India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మిగనూరు మండలం బోడబండ దగ్గర బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో తండ్రీకొడుకు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే వారి మృతికి కారణమని మృతుల కుటుంబీకులు ఆరోపించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు ఓవర్ టేక్ చేయబోయి బైకును ఢీ కొట్టిందన్నారు. గురువారం గ్రామస్థుల అశ్రునయనాల మధ్య శ్యామేల్(30), గౌతమ్(2)ల అంత్యక్రియలు జరిగాయి.
వికసిత్ భారత్ 2047 అనే అంశంపై SSGS (గుంతకల్) కళాశాలలో జరిగిన జాతీయ సదస్సులో పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని అవార్డులు సాధించారు. సాంకేతికతో నైపుణ్యాన్ని పెంపొందించుకొని పలు రంగాలలో విస్తృతంగా వినియోగించి స్థిరమైన అభివృద్ధి సాధ్యమని వ్యవసాయ సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పరిష్కరించాలని శివప్రసాద్, శ్రావణి, లత అన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంపీ కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆనాడు స్వాతంత్ర్యం కోసం గాంధీ చేపట్టిన స్వాతంత్ర్య సంగ్రామం స్ఫూర్తిదాయకమన్నారు.
ఫెయిల్ అయిన డిగ్రీ, బీఈడీ విద్యార్థులకు రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ గొప్ప అవకాశం కల్పించారు. వర్సిటీ పరిధిలో 2015, 2016, 2017, 2018లో డిగ్రీ, బీజీడీ (2019 కూడా) ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్ష రాసుకోవచ్చని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31వ తేదీ లోపు తగిన రుసుం ఆయా కళాశాలల్లో చెల్లించాలన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న (తెలుగు,ఉర్దూ కన్నడ) సెకండరీ గ్రేడ్ టీచర్లు TISలో 30వ తేదీలోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా TISలో పనిచేస్తున్న వారిలో 19 మంది ఇంకా నమోదు చేసుకోలేదని, మరో 99 మంది తమ వివరాలను అసంతృప్తిగా నమోదు చేశారని ఆయన వివరించారు.
చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దకడబూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తంబలి రంగస్వామి(30) పూల వ్యాపారి. బుధవారం పెద్దకాలువ గడ్డ సమీపంలో వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యవ్వన వయస్సులో కొడుకు ఈ ఘటనకు పాల్పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
వచ్చే నెల 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్, మార్చి 1వ తేదీ నుంచి రెగ్యులర్ పరీక్షలు జరగనున్నాయని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.
ఫిబ్రవరిలో జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇంటర్ బోర్డు అధికారి గురువయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అలసత్వం వీడి వలసల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎంపీడీఓ, ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీవోలను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఉపాధి హామీ పథకం అమలు, వలసల నివారణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన చోట సీజనల్ హాస్టళ్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి పనులు కల్పించి వలసలను నివారించాలని సూచించారు.
SUV సెగ్మెంట్లో Kia Syros కారును ఎంజీ బ్రదర్స్ కియా కర్నూలు ప్రతినిధులు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ కారు అద్భుతమైన ఫీచర్స్, పెట్రోల్ & డీజిల్, మాన్యువల్ & ఆటోమేటిక్ వేరియంట్లతో అందుబాటులో ఉందని సీఈఓ ఆదిత్య మాచాని తెలిపారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్, ఎస్బీఐ ఎస్ఎంఈ ఏజీఎం తారకేశ్వర్, జీఎం రత్న క్రాంతి కుమార్, జీఎం సేల్స్ శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.