Kurnool

News January 28, 2025

కర్నూలు: తల్లిదండ్రుల మృతి.. అనాథగా మిగిలిన బాలుడు

image

సీ.బెలగల్ మండలం పలుకుదొడ్డిలో బోయ బుజ్జమ్మ(25) కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. కనకవీడు గ్రామానికి చెందిన బోయ బుజ్జమ్మను పలుకుదొడ్డి గ్రామానికి చెందిన బోయ నాగేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, బోయ నాగేంద్ర రెండేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ గ్రామస్థులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

News January 28, 2025

కర్నూలు: తల్లిదండ్రుల మృతి.. అనాథగా మిగిలిన బాలుడు

image

సీ.బెలగల్ మండలం పలుకుదొడ్డిలో బోయ బుజ్జమ్మ(25) కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. కనకవీడు గ్రామానికి చెందిన బోయ బుజ్జమ్మను పలుకుదొడ్డి గ్రామానికి చెందిన బోయ నాగేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, బోయ నాగేంద్ర రెండేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ గ్రామస్థులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

News January 28, 2025

కూటమి గెలుపులో యువగళం పాదయాత్ర కీలక పాత్ర: ఎంపీ

image

నాడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిందని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. యువగళం పాదయాత్ర సోమవారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలులోని ఎంపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి గెలుపులో యువగళం పాదయాత్ర కీలక పాత్ర పోషించిందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ లోకేశ్ ముందుకు వెళ్తారని అన్నారు.

News January 27, 2025

BREAKING: కర్నూలు జిల్లాలో ఇద్దరు గురుకుల విద్యార్థుల కిడ్నాప్

image

సీ.బెళగల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూలులో 6వ తరగతి చదువుతున్న సూర్యతేజ, 7వ తరగతికి చెందిన నవీన్ అనే విద్యార్థులు సోమవారం కిడ్నాప్‌‌నకు గురైనట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని దుండగులు పిల్లలను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల ఆచూకీ తెలిస్తే మండల ఎస్ఐ నంబర్ 9121101073కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News January 27, 2025

కర్నూలులో 30న వైసీపీ జిల్లా కార్యవర్గ సమావేశం

image

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 30న గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలులో శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ (బిర్లా కాంపౌండ్)లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా వైసీపీ కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీల సభ్యులు తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు.

News January 27, 2025

కర్నూలులో కలెక్టర్ అర్జీల స్వీకరణ.. ఎస్పీ కార్యక్రమం రద్దు

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నేడు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పీజీఆర్‌లో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగనుంది
➤ మరోవైపు పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య ఎంపికలు ఉన్నందున రద్దు చేసినట్లు చెప్పారు.

News January 27, 2025

ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సురేంద్ర

image

విశాఖపట్నంలో జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పత్తికొండకు చెందిన సురేంద్ర బాబును రాష్ట్ర శాఖ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానన్నారు. ఈ అవకాశం కల్పించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News January 26, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ శుభవార్త

image

కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుభవార్త చెప్పారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గైర్హాజరైన అభ్యర్థులు ఈనెల 27న హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. 28వ తేదీతో అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు ముగుస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

News January 26, 2025

కర్నూలు: ‘ఆ హత్య దారుణం’

image

ఆలూరు మండలం అరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ హత్య అత్యంత అమానుషమైన చర్య అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బీ.వీరశేఖర్ అన్నారు. దేవనకొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఫ్యాక్షన్ నుంచి సామాన్య ప్రజానీకం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఇలా హత్యలు చేయడం తగదని అన్నారు.

News January 26, 2025

టికే ఆర్ శర్మ సేవలు చిరస్మరణీయం: డీవీఆర్

image

గాంధీయవాది టీకేఆర్ శర్మ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి డీవీఆర్ సాయి గోపాల్ అన్నారు. శనివారం యూనివర్సిటీ ప్రాంగణంలో టీకేఆర్ శర్మ శతజయంతి ఉత్సవాల బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలను ఈనెల 30న కర్నూలులోని కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు సంస్థ సంయుక్తా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.