Kurnool

News August 6, 2024

శ్రీశైలం మల్లన్న దంపతులకు వెండి రథోత్సవం

image

శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం రాత్రి శ్రావణమాసం పురస్కరించుకుని వెండి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈఓ పెద్దిరాజు ఆధ్వర్యంలో ముందుగా అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెండి రథం మీద కొలువైన స్వామి, అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో వెండి రథోత్సవం వైభవంగా జరిగింది.

News August 5, 2024

కర్నూల్: ఆస్తి గొడవ.. కొడుకు చేతిలో తండ్రి మృతి

image

ఆస్తి తగాదాలతో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణలో తండ్రి తలకు గాయమై మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం జమ్మలదిన్నెలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. జమ్మలదిన్నె గ్రామానికి చెందిన కోసిగి తిక్కయ్య-సిద్దమ్మ దంపతుల పెద్ద కుమారుడైన రాముడు ఇంటి స్థలం విషయంలో తండ్రి తిక్కయ్య (63)తో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో తోయడంతో తిక్కయ తల గోడకు తగిలి రక్తస్రావం అయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు.

News August 5, 2024

మహానందిలో జబర్దస్త్ నటి సాయి లేఖ పూజలు

image

మహానంది పుణ్యక్షేత్రంలో జబర్దస్త్ నటి సాయిలేఖ సోమవారం పూజలు నిర్వహించారు. మహానందీశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన ఆమె శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. నల్లమల అందాలకు తాను ఫిదా అయినట్లు ఆమె చెప్పారు. గతంలోనూ పలుమార్లు ఈ క్షేత్రానికి వచ్చానని తెలిపారు.

News August 5, 2024

నంద్యాల: B.Tech విద్యార్థిని సూసైడ్

image

పల్నాడు (D) మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల (D) డోన్‌కు చెందిన విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ మాచర్లలోని హాస్టల్ రూమ్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో నిన్న ఉదయం రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 5, 2024

మంత్రాలయం: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

మంత్రాలయం మండలం లక్ష్మరి గ్రామ సమీపంలో ఉన్న మోడల్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని పార్వతి పాఠశాల గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. సుంకేశ్వరి గ్రామానికి చెందిన చిన్న చిన్నప్ప మనుమరాలు పార్వతి. తల్లిదండ్రులు పనుల నిమిత్తం హైదరాబాద్‌లో వెళ్లారు. విద్యార్థిని తాతయ్య దగ్గర చదువుకుంటోంది. ఘటనా స్థలానికి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

News August 5, 2024

నేడు నంద్యాల జిల్లాకు వైఎస్ జగన్..?

image

నంద్యాల జిల్లాలో మరికాసేపట్లో YCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. TDP నేతల దాడిలో మృతి చెందిన నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురం గ్రామానికి చెందిన YCP కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు సమాచారం. నంద్యాలకు వస్తున్నట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.

News August 5, 2024

మహానంది: సీతారామపురంలో భయం.. భయం

image

మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో భయం భయం నెలకొంది. డీఐజీ ప్రవీణ్ కుమార్, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకుని మృతుడు సుబ్బరాయుడు భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మాకు రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.

News August 5, 2024

నంద్యాల: శుభ ముహూర్తాలకు వేళాయే..!

image

శ్రావణమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ మాసాన్ని శుభాలు, పండుగల మాసం అని అంటారు. ఈ నెలలో అన్ని రోజులూ శుభకరమే. ఈ నెలలో ప్రతి ఇల్లూ నిత్య పూజలతో అలరారుతుంది. ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం అయింది. మహా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో వచ్చినందున ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. వివాహాది, గృహారంభాలు, ఇతర శుభముహూర్తాలకు వేళయింది.

News August 5, 2024

మీరు తగ్గకుంటే.. మేమూ తగ్గేదే లేదు: మాజీ ఎమ్మెల్యే శిల్పా

image

‘హత్యారాజకీయాకు టీడీపీ నాయకులు చరమగీతం పాడాలి. లేని పక్షంలో మేము కూడా తిరగబడదతాం. తగ్గేదే లేదు’ అని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తేల్చి చెప్పారు. సీతారామపురంలో YCP నేత సుబ్బరాయుడు మృతదేహాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. YCP MLA విరుపాక్షి, మాజీ MLAలు రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డి, రామిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.

News August 5, 2024

విజయవాడ వెళ్లిన కర్నూలు జిల్లా కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విజయవాడ వెళ్లారు. ఆయన అక్కడ సోమ, మంగళవారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరె న్స్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లాకు సంబంధించిన ప్రగతి నివేదికలను తీసుకొని వెళ్లినట్లు సమాచారం. అనంతరం తిరిగి బుధవారం కర్నూలుకు రానున్నారు.