India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాణ్యం మండలం కౌలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆకస్మికంగా పర్యవేక్షించారు. కేంద్రంలోని హాజరు అయిన విద్యార్థులు, హాజరు పట్టీని, ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.
కర్నూలులోని టీజీ నివాసంలో శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి హోదాలో తొలిసారి తమ నివాసానికి వచ్చిన బీసీ జనార్ధన్ రెడ్డిని మంత్రి టీజీ భరత్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకున్నారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేంటి? కామెంట్ చేయండి..
హీరో నందమూరి బాలకృష్ణ ‘ఎన్బీకే 109’ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలో జరుగుతోంది. బాబి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమాలో పాటను, కొన్ని విలన్ సీన్లను ఓర్వకల్లు సమీపంలోని రాతివనాల్లో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మండలంలో తెలియడంతో గురువారం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షూటింగ్ విరామ సమయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి బాలకృష్ణను కలిశారు.
నంద్యాల జిల్లాలో చిరుత చిక్కింది. శిరివెళ్ల మండలం పచ్చర్ల టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బోనులోకి చిరుతపులి వెళ్లింది. దీంతో కొద్ది రోజులుగా భయాందోళనకు గురైన పచ్చర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పులిని సుదూర అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుత దాడిలో పచ్చర్లకు చెందిన మాజీ ఉప సర్పంచి షేక్ మెహరూన్బీ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.
కర్నూల్ జిల్లాలో పింఛన్ పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 2,45,229 మందికి జులై 1న పింఛన్ అందజేయనున్నారు. పెంచిన ప్రకారం జులై నెలకు రూ.167.34 కోట్లు పంపిణీ చేయనున్నారు. సచివాలయం సిబ్బందితో జులై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీని ప్రారంభిస్తారు. మొత్తం నాలుగు రకాల కేటగిరీ పింఛనుదారుల్లో 11 సబ్ కేటగిరీలకు చెందిన వారికి మొత్తం రూ.7 వేలు అందజేయనున్నారు.
కర్నూలు జిల్లాలోని అటవీ భూములపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కర్నూలు డి.ఎఫ్.ఓ. శ్యామల, నంద్యాల డి.ఎఫ్.ఓ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి సుబ్బరాయుడు ఇందుకు వివరాలను డిప్యూటీ సీఎంకు తెలియజేశారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 30న కోవెలకుంట్ల మండలంలో పర్యటించనున్నట్లు బీసీ రామనాథరెడ్డి తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గం చరిత్రలో తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్న బీసీ జనార్దన్ రెడ్డి, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కోవెలకుంట్ల మండలానికి రానున్నారు. దీంతో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులను సినీ నటుడు నటుడు రాజకుమార్ కలిశారు. కర్నూలులోని గౌరు దంపతుల స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై కాసేపు ముచ్చటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ ఎంపీలతో బుధవారం నిర్వహించిన చిట్చాట్లో కీలక సూచనలు, సలహాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. ‘మీ విలువైన సమయం మాకు కేటాయించి కీలక సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మోదీ సార్’ అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో తాము భాగస్వామ్యం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.
Sorry, no posts matched your criteria.