India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, వాహన డ్రైవర్ మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ప్రమాద ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. విద్యార్థులు హంపిలో ఆరాధనకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్తో పాటు ముగ్గురు మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులు మృతి చెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త చీఫ్ను ప్రకటించే ఛాన్సుంది. సుమారు 10 మంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అందులో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రేసులో ముందున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్ను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు <<15220489>>చెందిన<<>> ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో ముగ్గురు మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్రగా గుర్తించారు. డ్రైవర్ శివ కూడా ప్రాణాలు కోల్పోయారు. నరహరితీర్థుల ఆరాధనోత్సవాలకు 14 మంది విద్యార్థులు మంత్రాలయం నుంచి హంపీకి బయలుదేరగా తుఫాన్ వాహనం బోల్తా పడి ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలులో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో ఓ యువకుడు నకిలీ హాల్ టికెట్ సృష్టించి దొరికిపోయాడు. కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన తిరుమల ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిలయ్యాడు. అర్హుడైనట్లు నకిలీ హాల్ టికెట్ సృష్టించి 1,600M పరుగులో పాల్గొనేందుకు వచ్చాడు. ఇదివరకే ఫెయిలయిన వివరాలు కంప్యూటర్లో నమోదు కావడంతో అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఎమ్మిగనూరు మండలంలో కుక్కలు వ్యక్తి మృతికి కారణమయ్యాయి. సోగనూరు గ్రామానికి చెందిన నారాయణ (50) పొలం పనుల చేసి తిరిగి వస్తుండగా భీమిరెడ్డి పొలం వద్ద రెండు కుక్కలు ఆయన బైకుకు అడ్డు వచ్చాయి. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
కర్నూలు జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య తలెత్తకుండా రూ.6.91 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు.
కర్నూలు జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య తలెత్తకుండా రూ.6.91 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు రెవెన్యూ, అటవీ, TR&B, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.