India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, డోన్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు పెడచెవిన పెట్టిన 15 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రావణమాసోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో పెద్దిరాజు అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీశైలంలో శ్రావణమాసోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 4వ తేదీ ఉదయం వరకు నిర్వహించే శ్రావణమాసోత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని దర్శిస్తారని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గడివేముల మండలంలో ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఎల్కే తండాకి చెందిన రాజునాయక్ తన భార్యతో కలిసి పాణ్యంలో చదువుతున్న కొడుకుని చూసేందుకు బైక్ పై వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో దేవనూరు గ్రామానికి క్రషర్ లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో రాజునాయక్ భార్య కళ్లెదుటే మృతిచెందాడు. ఘటనపై గడివేముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత శనివారం సాయంత్రం గొర్రెల మందపైన దాడి చేసినట్లు రైతులు, కాపరులు తెలిపారు. వెంటనే రుద్రవరం ఫారెస్ట్ రేంజర్ శ్రీపతి నాయుడి దృష్టికి తీసుకువెళ్లగా, సిబ్బందిని పంపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఆగస్టు 1న ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని శనివారం రాష్ట్ర సెర్ఫ్ సీఈవో నుంచి జిల్లా డీఆర్డీఏ-వైకేపీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. మొదటి రోజు 99 శాతం చేయాలని, రెండు రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో మొత్తం 2,43,337 మందికి రూ.103.54 కోట్లు పంపిణీ చేయనున్నారు.
కర్నూలు జగన్నాథగట్టులో ఉన్న IIITDMలో శనివారం బీటెక్ మూడో సంవత్సర విద్యార్థి సాయికార్తీక్ నాయుడు(20) ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మన్యం పార్వతీపురం జిల్లాకు చెందిన వాసి. మధ్యాహ్నం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి జేబులో సూసైడ్ నోట్ అనుమానాలకు తావిస్తోంది.
తుంగభద్ర పరుగులు పెడుతోంది. కృష్ణమ్మ చెంతకు బిరబిరా పారుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 1,17,632 క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పర్యాటకుల తాకిడి అధికమైంది. డ్యామ్ను రంగు రంగుల విద్యుత్ వెలుగులతో అలంకరించారు. నిన్న రాత్రి తీసిన ఫొటో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
నేటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కర్నూలులోని సనత్ నగర్ అయాన్ డిజిటల్ కేంద్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని, పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ మధుసూదన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరగనుంది. బేర్ యాక్ట్స్ పుస్తకాలు, గుర్తింపు కార్డులు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
డోన్ (మం) చిన్నమల్కాపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుకుమార్ను బ్యాంకాక్లో కిడ్నాప్ చేశారని తండ్రి డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈనెల 22న చెల్లెలికి ఫోన్ చేసి ఉద్యోగానికి 23న బ్యాంకాక్ వెళ్తున్నానని చెప్పాడు. 25న తనను కిడ్నాప్ చేశారని, రూ.80 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తర్వాత నుంచి ఆ ఫోన్ స్విచ్ఆఫ్ అయింది.’ అని తండ్రి తెలిపారు.
ఈ నెల 29న సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.