Kurnool

News December 31, 2024

బొకేలు వద్దు.. పుస్తకాలు, పెన్నులతో రండి: పత్తికొండ ఎమ్మెల్యే

image

న్యూ ఇయర్ వేళ పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బొకేలు, పూలదండలు, శాలువాలతో రావొద్దని సూచించారు. విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే మొక్కలు తీసుకురావాలని సూచించారు. జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సైతం తన అభిమానులకు ఇలాంటి పిలుపే ఇచ్చారు.

News December 31, 2024

కర్నూలు: ‘అక్రమ కేసులు బనాయించడం సరికాదు’

image

వెల్దుర్తి మండలం బొమ్మిడి పల్లిలో జరిగిన హత్య కేసులో ఏ సంబంధం లేని వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పలువురు వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి కర్నూలు ఎస్పీ బిందు మాధవ్‌ను కలిశారు. కేవలం వైసీపీ సానుభూతిపరులన్న ఉద్దేశంతో హత్య ఘటనలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను ఇరికించడం సరికాదన్నారు.

News December 31, 2024

గ్రీటింగ్ కార్డ్స్ ❤

image

న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని శుభాకాంక్షలు చెబుతూ ఫ్రెండ్స్‌కు పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..

News December 31, 2024

రాష్ట్ర స్థాయిలో అస్పరి మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

image

విజయవాడలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి ప్రతిభాన్వే‌‌శణ పోటీల్లో భాగంగా కౌశల్-2024 పోస్టర్ ప్రెజెంటేషన్‌లో ఆస్పరి మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి పీ.మహేష్ తృతీయ స్థానంలో నిలిచాడు. మహేశ్‌కు ప్రిన్సిపల్, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు.

News December 30, 2024

మత్తు పదార్థాల నిర్మూలనకు అందరూ సహకరించాలి: కలెక్టర్

image

మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్తుపదార్థాల నియంత్రణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎస్పీ జి.బిందు మాధవ్‌తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. విద్యాలయాల పరిసర ప్రాంతాల్లో మత్తుపదార్థాల ఆనవాళ్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News December 30, 2024

కర్నూలులో కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ ప్రారంభం

image

కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇవాళ దేహదారుఢ్య (PMT/PET) పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 600 మంది అభ్యర్థులకు గాను 280 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హాజరైనట్లు ఎస్పీ జీ.బిందు మాధవ్ తెలిపారు. కర్నూలు జిల్లాలో నిర్వహించే ఈ పరీక్షలకు 10,143 మంది అభ్యర్థులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు PMT/PET పరీక్షల తీరును ఆయన పరిశీలించారు.

News December 30, 2024

ఆ ఘటనల్లో చర్యలు తీసుకోరా?: ఎమ్మిగనూరు MLA

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు ఎస్ఐపై దాడి, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎంపీడీవోపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థలో విశ్వాసం పెంచాలని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రశ్నించక మానరు అని ఆయన వ్యాఖ్యానించారు.

News December 30, 2024

గడివేముల వద్ద ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

image

కర్నూలు జిల్లా గడివేముల మండల పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని పెసరవాయి-కరిమద్దెల గ్రామాల మధ్య బండి ఆత్మకూరు మండలానికి చెందిన ట్రాక్టర్ కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో వరి నాట్లు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన సునీల్ సర్దార్ (45)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 30, 2024

ముంచేస్తున్న మాయగాళ్లు.. జాగ్రత్త సుమీ!

image

కర్నూలు జిల్లాలో సైబర్ కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. నకిలీ లింకులు పంపుతూ మాయమాటలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. గతేడాది జిల్లాలో 41 సైబర్ కేసులు నమోదు కాగా.. 2024లో ఆ సంఖ్య 104కు చేరడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో మిగిలిన నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిన సైబర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ మోసాల ఉచ్చులో పడకుండా ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

News December 30, 2024

క్రైమ్ రేట్ 35.85 శాతం తగ్గింది: కర్నూలు ఎస్పీ

image

గతేడాతో పోలిస్తే ఈ సంవత్సరం 35.85 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. పోలీసు శాఖ జిల్లా వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడంతోనే 2024లో నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. జిల్లా పోలీసుల సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు. 2023లో జిల్లాలో 7,877 కేసులు నమోదు కాగా.. 2024లో 5,053 కేసులు నమోదయ్యాయని తెలిపారు.