Kurnool

News January 26, 2026

వ్యవసాయ శకటానికి మొదటి స్థానం: కలెక్టర్

image

77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షతన పోలీస్ పరేడ్ మైదానంలో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి, దేవాదాయ శాఖ శకటానికి 2వ బహుమతి, జిల్లా విద్యా శాఖ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ శకటాలకు 3వ బహుమతిని కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వారికి జేసీ, ఎస్పీలతో కలిసి జ్ఞాపకలను అందజేశారు.

News January 26, 2026

వ్యవసాయ శకటానికి మొదటి స్థానం: కలెక్టర్

image

77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షతన పోలీస్ పరేడ్ మైదానంలో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి, దేవాదాయ శాఖ శకటానికి 2వ బహుమతి, జిల్లా విద్యా శాఖ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ శకటాలకు 3వ బహుమతిని కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వారికి జేసీ, ఎస్పీలతో కలిసి జ్ఞాపకలను అందజేశారు.

News January 26, 2026

అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం: కలెక్టర్

image

సమిష్టి కృషితో జిల్లాని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం కర్నూలులో 77వ గణతంత్ర వేడుకలలో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్‌తో కలిసి కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని కలెక్టర్ చదివి ప్రజలకు వినిపించారు. అంతకుముందు వారు ఆయుధ దళాల నుంచి గౌరవ వందనాలు స్వీకరించారు.

News January 26, 2026

కర్నూలు కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకలు

image

77వ గణతంత్ర వేడుకలు సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. అంతకుముందు పోలీసులు కలెక్టర్‌కు గౌరవ వందనం సమర్పించి, స్వాగతం పలికారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచారు.

News January 26, 2026

రాష్ట్రస్థాయి కబడ్డీ జట్టుకు బాలికల ఎంపిక

image

రాష్ట్ర జట్టుకు ఎంపికైన బాలికల కబడ్డీ క్రీడాకారులను అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ అమర్ ప్రకాష్ ఆదివారం ఆదోనిలో అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27 వరకు అనకాపల్లిలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లా టీమ్ తరఫున కోసిగి, ఆదోని నుంచి కీర్తన, వీరేషమ్మ, సౌమ్య, పల్లవి, శిరీష ఆడతారన్నారు. కోసిగి కస్తూర్బా స్కూల్ PET సుమలత కోచ్‌గా ఎంపికయ్యారని తెలిపారు.

News January 26, 2026

అనుమానితులపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేరాల నియంత్రణకు, అనుమానాస్పద వ్యక్తుల ఆచూకి కనిపెట్టేందుకు ఆదివారం రాత్రి జిల్లా పోలీసులు ఆకస్మికంగా పలు లాడ్జిల్లో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

News January 25, 2026

ఆస్పరి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన తలారి నాగరాజు (35) ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పరి-నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి చెన్నై వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆయన ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 25, 2026

రైతుల సంక్షేమానికి ఏపీఏంఐపీ కృషి చేయాలి: కలెక్టర్

image

రైతుల సంక్షేమానికి ఏపీఏంఐపీ కార్యాలయం మరింత సమర్థవంతంగా సేవలందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ఆదివారం కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని రైతులకు సూక్ష్మ నీటి సాగు పరికరాలు, రాయితీలు, సాంకేతిక సలహాలను మరింత చేరువ చేయాలని కలెక్టర్ సూచించారు.

News January 25, 2026

అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలైన ఏడుగురికి పీవోఏ యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

News January 25, 2026

రేపు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు: కలెక్టర్

image

ఈనెల 26న (సోమవారం) కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఆ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.