Kurnool

News January 24, 2026

కర్నూలు రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు

image

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు రైల్వే స్టేషన్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందాలతో రైల్వే పార్శిల్ కార్యాలయం, వెయిటింగ్ హాలు, ప్లాట్‌ఫారాలు, రైళ్లలో ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. టౌన్ సీఐ నాగరాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలు ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలుగా పోలీసులు తెలిపారు.

News January 24, 2026

పది ఫలితాలు మెరుగ్గా ఉండాలి: కర్నూలు కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షల ఫలితాల మెరుగుదల లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాల ప్రత్యేక అధికారి 100 రోజుల ప్రణాళికలో భాగంగా తనిఖీలు నిర్వహించి విద్యార్థులతో మాట్లాడాలని సూచించారు.

News January 24, 2026

జిల్లాలో మాతృమరణాల నివారణే లక్ష్యం: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో మాతృమరణాలను నివారించడమే లక్ష్యం పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సంబంధిత శాఖల అధికారులు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మాతృమరణాలకు గల కారణాలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 24, 2026

కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

జనవరి 26న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్పీ సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News January 24, 2026

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సరి సూచించారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం పర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ‘జీరో- గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ అనే థీమ్‌తో ర్యాలీనీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి మొక్కలను నాటారు.

News January 24, 2026

వసతి గృహాల్లో సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశం

image

కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్షించారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాల మరమ్మతులకు వెంటనే ఎస్టిమేట్లు పంపాలని అధికారులను ఆదేశించారు. వారం వారం హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సూచించారు. నెల రోజుల్లోపు అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల కోసం దోమల తెరలు ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News January 24, 2026

వసతి గృహాల్లో సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశం

image

కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్షించారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాల మరమ్మతులకు వెంటనే ఎస్టిమేట్లు పంపాలని అధికారులను ఆదేశించారు. వారం వారం హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సూచించారు. నెల రోజుల్లోపు అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల కోసం దోమల తెరలు ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News January 24, 2026

వసతి గృహాల్లో సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశం

image

కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్షించారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాల మరమ్మతులకు వెంటనే ఎస్టిమేట్లు పంపాలని అధికారులను ఆదేశించారు. వారం వారం హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సూచించారు. నెల రోజుల్లోపు అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల కోసం దోమల తెరలు ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News January 24, 2026

కోడుమూరులో ఈనెల 29న జాబ్ మేళా

image

కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన 18 నుంచి 45 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 10 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు కరపత్రాలు విడుదల చేశారు. ప్లేస్మెంట్ అధికారి సాయి తేజ పాల్గొన్నారు.

News January 24, 2026

వసతి గృహాల్లో సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశం

image

కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్షించారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాల మరమ్మతులకు వెంటనే ఎస్టిమేట్లు పంపాలని అధికారులను ఆదేశించారు. వారం వారం హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సూచించారు. నెల రోజుల్లోపు అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల కోసం దోమల తెరలు ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.