Kurnool

News December 28, 2024

వాటితో నాకేంటి సంబంధం: మాజీ మంత్రి బుగ్గన

image

బేతంచెర్లలో గురువారం అధికారులు పలు గోదాములపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే వాటిలో కొన్ని క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయని, ఆ గోదాములు మాజీ మంత్రి బుగ్గనకు సంబంధించిన వారివిగా గుసగుసలు వినిపించాయి. దానిపై బుగ్గను స్పందిస్తూ .. బంధువులు కొందరు ప్రైవేటు గోడౌన్‌లు నిర్వహిస్తున్న మాట వాస్తవేమని.. అయితే తనకేంటి సంబంధమంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ విచారణలో ఎవరికి చెందినవో బయటకు వస్తాయన్నారు.

News December 28, 2024

జనవరి 1న శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అర్జిత సేవలను కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

News December 28, 2024

అటవీ సంపదను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్ జి.రాజకుమారి 

image

అటవీ సంపదను సంరక్షించుకుంటూ వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పచ్చర్ల ఎకో టూరిజం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రాణాతో కలిసి జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.

News December 27, 2024

వైసీపీకి ఇంతియాజ్ రాజీనామా

image

విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మంత్రి టీజీ భరత్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఇంతియాజ్ తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News December 27, 2024

కర్నూలు: 58వ సారి రక్తదానం

image

కర్నూలులోని ఓ ఆసుపత్రిలో హనుమంతు అనే వ్యక్తికి గుండె ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సొసైటీని సంప్రదించారు. ఆ సొసైటీ అధ్యక్షుడు గందాలం మణికుమార్ స్పందించారు. 58వ సారి ఆయన రక్తదానం చేశారు. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని అందించారు. 

News December 27, 2024

శ్రీశైలంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

image

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కోరారు. శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ సిఫార్సు లేఖలను తిరుమలలో యాక్సెప్ట్ చేయాలి. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. TTD తరఫున తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం’ అని సురేఖ కోరారు.

News December 27, 2024

కర్నూలు జిల్లాతో మన్మోహన్‌కు అనుబంధం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కర్నూలు జిల్లాతో అనుబంధం ఉంది. జులై 1, 2004న ఆయన జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి గ్రామంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన బాధితులకు అండగా నిలిచారు. అలాగే మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.

News December 27, 2024

టీజీ భరత్ కుమార్తె పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ

image

మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్యపాన్య వివాహ వేడుక హైదరాబాదులోని GMR అరేనలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, హీరో బాలకృష్ణ హాజరై సందడి చేశారు. నూతన వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి ఫరూక్, పలువురు ఎమ్మెల్యేలు బాలయ్యతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

News December 26, 2024

మంత్రి భరత్ కుమార్తె పెళ్లిలో సీఎం చంద్రబాబు

image

మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. హైదరాబాదులోని GMR అరేనలో జరిగిన ఈ వేడుకకు హాజరై వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్‌ను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

News December 26, 2024

శ్రీశైలానికి మంత్రి కొండా సురేఖ రాక

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి నేడు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నట్లు దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. రాత్రి 7 గంటలకు మంత్రి శ్రీశైలం చేరుకుంటారని చెప్పారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.