Kurnool

News June 29, 2024

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు కర్నూల్ యువకుడు

image

జులై మూడో వారంలో విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి అండర్-10 ఆర్చరీ పోటీలకు కర్నూల్ నగరానికి చెందిన యువకుడు కె.పార్థ చంద్ర ఎంపికైనట్లు జిల్లా ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి నాగరత్నమయ్య తెలిపారు. పార్థ చంద్ర ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో 9వ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని వివరించారు.

News June 29, 2024

కర్నూల్ TO తిరుపతి, విజయవాడకు సర్వీసులు ఎప్పుడో?

image

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (ఓర్వకల్లు) విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకల సంఖ్య పెరుగుతోంది. మూడేళ్ల కాలంలో 1,20,732 మంది ప్రయాణం చేశారు. వైజాగ్, చెన్నై నగరాలకు తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతున్నారు. అయితే ఈ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి నగరాలకూ విమానాలు తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. మన రాష్ట్ర ఎంపీ రామ్మోహన్ నాయుడే కేంద్ర విమానయానశాఖ మంత్రి కావడంతో దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

News June 29, 2024

సైకిల్‌పై.. అయోధ్య నుంచి మహానందికి

image

ఢిల్లీకి చెందిన రాజేంద్ర శర్మ సైకిల్‌పై మహానందికి చేరుకున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే ఆయన చిన్నప్పటి నుంచే హిందూ ధర్మం పట్ల ఆకర్షితుడై సైకిల్‌పై సంపూర్ణ భారత్ యాత్ర చేయాలని సంకల్పించాడు. ఈ ఏడాది మార్చి 13న అయోధ్య నుంచి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు. 7 రాష్ట్రాలను దాటుకుంటూ ఏపీకి చేరాడు. అందులో భాగంగా మహానంది చేరుకున్నారు. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అహోబిలం, తిరుపతికి వెళ్తానని చెప్పారు.

News June 29, 2024

రూ.1,861 కోట్లను దోచేశారు: ఎంపీ బైరెడ్డి శబరి

image

ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులను శిక్షించాలని ఎంపీ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని కోరారు. ‘వైసీపీ పాలనలో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం అయిందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మాజీ సీఎం జగన్ ప్రచార పిచ్చి కోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకంగా రూ.1,861 కోట్లను దోచేశారు. ఈ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులకు శిక్షించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.

News June 29, 2024

ALERT.. నంద్యాల జిల్లాలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు జిల్లాలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్లు, పోల్స్, టవర్స్ కింద ఉండొద్దని సూచించింది.

News June 29, 2024

విద్యార్థులకు పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి: కలెక్టర్

image

పాణ్యం మండలం కౌలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆకస్మికంగా పర్యవేక్షించారు. కేంద్రంలోని హాజరు అయిన విద్యార్థులు, హాజరు పట్టీని, ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.

News June 28, 2024

మంత్రులు BCJR, టీజీ భరత్ భేటీ

image

కర్నూలులోని టీజీ నివాసంలో శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి హోదాలో తొలిసారి తమ నివాసానికి వచ్చిన బీసీ జనార్ధన్ రెడ్డిని మంత్రి టీజీ భరత్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకున్నారు.

News June 28, 2024

మీ కొత్త MLA నుంచి ఏం ఆశిస్తున్నారు?

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్​పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేంటి? కామెంట్ చేయండి..

News June 28, 2024

ఓర్వకల్లులో బాలయ్య సినిమా షూటింగ్

image

హీరో నందమూరి బాలకృష్ణ ‘ఎన్‌బీకే 109’ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలో జరుగుతోంది. బాబి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమాలో పాటను, కొన్ని విలన్‌ సీన్లను ఓర్వకల్లు సమీపంలోని రాతివనాల్లో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం మండలంలో తెలియడంతో గురువారం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షూటింగ్ విరామ సమయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి బాలకృష్ణను కలిశారు.

News June 28, 2024

ఫలించిన ఆపరేషన్.. చిక్కిన చిరుత

image

నంద్యాల జిల్లాలో చిరుత చిక్కింది. శిరివెళ్ల మండలం పచ్చర్ల టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బోనులోకి చిరుతపులి వెళ్లింది. దీంతో కొద్ది రోజులుగా భయాందోళనకు గురైన పచ్చర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పులిని సుదూర అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుత దాడిలో పచ్చర్లకు చెందిన మాజీ ఉప సర్పంచి షేక్ మెహరూన్‌బీ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.