Nellore

News December 1, 2025

జగన్ పర్యటనకు గంజాయి బ్యాచ్‌ని తెచ్చారు: కోటంరెడ్డి

image

ఇటీవల జగన్ నెల్లూరుకు వచ్చినప్పుడు కామాక్షమ్మ వందలాది మంది గంజాయి బ్యాచ్‌ని తీసుకువచ్చింది నిజమా? కాదా? అని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ‘పెంచలయ్య మరణానికి నేను, నా తమ్ముడు, కార్పొరేటర్ శ్రీనివాసులు కారణమని సీపీఎం చెబితే ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. కామాక్షమ్మ నుంచి ఆనం విజయకుమార్ రెడ్డి రూ.5లక్షలు తీసుకున్నారనే ప్రచారం ఉంది’ అని ఆయన చెప్పారు.

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

image

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

image

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

image

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

image

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.

News November 30, 2025

నెల్లూరులో మెడికో విద్యార్థి సూసైడ్ !

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 30, 2025

నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్.!

image

నెల్లూరు జిల్లాకు దిత్వా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. భారీ వృక్షాల వద్ద నిలబడరాదని, పాత భవనాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లాలో కూడా RED అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 30, 2025

NLR: 7న జాతీయ ఉపకార వేతన అర్హత పరీక్ష

image

2025-26కు సంబంధించిన జాతీయ ఉపకార వేతనం అర్హత పరీక్షకు డిసెంబర్ 7న నిర్వహిస్తున్నట్లు నెల్లూరు DEO డాక్టర్ ఆర్.బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 3,685 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని చెప్పారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామన్నారు. HMలు పాఠశాల యుడైస్ ఉపయోగించి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

News November 30, 2025

గంజాయి కేసులో హత్య కేసు నిందితురాలు కామాక్షి అరెస్ట్

image

సీపీఎం కార్యకర్త పెంచలయ్య దారుణ హత్య కేసులో కీలక నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు గంజాయి కేసులో ఆదివారం అరెస్టు చేశారు. బోడి గాడి తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. అక్కడ 25 కేజీల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. నవాబుపేట పోలీస్‌స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో DSP మాట్లాడుతూ.. గంజాయి కేసులో కామాక్షిని అరెస్టు చేశామన్నారు.

News November 30, 2025

నెల్లూరు: రైతులను భయపెడుతున్న తుఫాను..!

image

తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రమైన ఆర్థిక నష్టం, పంట నష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, ధాన్యం పంటలకు భారీగా నష్టం కలుగుతోంది. వర్షాలు, గాలులతో పంటలు తడిసిపోవడం, నేలకొరగడం లాంటి సమస్యలు ఇబ్బంది పెట్టుతున్నాయి. కావలిలో మొంథా తుఫానుతో చెరువులన్నీ నిండిపోయాయి. రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పుడు దిత్వా తుపాన్ హెచ్చరికలతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు భయపడుతున్నారు.