Nellore

News May 8, 2025

హై కోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్.. తీర్పు వాయిదా

image

మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో ఊరట దక్కలేదు. పొదలకూరు(మ) వరదాపురంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి వేసిన పిటీషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు.. తీర్పును జూన్ 16కు వాయిదా వేసింది. కాకాణి పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

News May 8, 2025

నుడా వీసీగా జేసీ కార్తీక్

image

నెల్లూరు అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్(నుడా) వైస్ ఛైర్మన్‌గా జాయింట్ క‌లెక్టర్ కార్తీక్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నుడా వీసీగా నెల్లూరు కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ సూర్యతేజ‌ పనిచేశారు. ఆయన ఇటీవలే బ‌దిలీ అయ్యారు. గ‌త కొద్ది రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో జేసీని నుడా వైస్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

News May 7, 2025

మత్స్యకార సేవలో పథకం ద్వారా జిల్లాకి రూ.24.47 కోట్లు

image

జిల్లాలో మత్స్యకార సేవలో పథకం ద్వారా 12,239 మంది మత్స్యకారులకు రూ.24.47 కోట్లు నగదును వారి బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి జమచేసినట్లు జిల్లా మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం బీచ్‌ నుంచి సీఎం చంద్రబాబు ‘మత్స్యకార సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

News May 7, 2025

సీఎం పర్యటనపై కలెక్టర్, ఎస్పీతో మంత్రి ఆనం సమీక్ష 

image

మే ఒకటో తేదీన సీఎం చంద్రబాబును నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్‌తో శనివారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల వివరాలపై ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. 

News May 7, 2025

నెల్లూరులో వ్యభిచార గృహాలపై దాడులు

image

నెల్లూరులో వ్యభిచార గృహాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు, విటులు, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు నవాబుపేట SI సాంబశివరావు వెల్లడించారు. అల్లీపురానికి చెందిన పొట్టెయ్య ముగ్గురు మహిళలతో మధురానగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పలు ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను రప్పించి వ్యభిచారం మొదలు పెట్టాడు. దాడులు చేసి సెక్స్ వర్కర్లను హోమ్‌కు తరలించినట్లు SI వెల్లడించారు.

News May 7, 2025

సిలిండర్‌కు అధిక ధరలు తీసుకుంటే చర్యలు: జేసీ

image

నెల్లూరు జిల్లాలో వినియోగదారుల నుంచి గ్యాస్ డెలివరీ బాయ్స్ అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. తన కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీదారులతో సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు బుకింగ్ చేసిన వెంటనే సిలిండర్ డెలివరీ చేయాలని సూచించారు. మీ ఏరియాలో సిలిండర్‌కు ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 7, 2025

నెల్లూరులో ప్రేమజంట ఆత్మహత్య

image

నెల్లూరులో ప్రేమజంట మృతి కలకలం రేపింది. జోసఫ్ రత్నకుమార్(తూ.గో), శ్రావణి(కృష్ణా) నాలుగు రోజుల కిందట రైల్వే ఫీడర్స్ రోడ్డులోని సింహపురి హోటల్లో గదిని తీసుకున్నారు. ఈక్రమంలో శుక్రవారం రూము నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టగా కుళ్లిన స్థితిలో మృత‌దేహాలు దర్శనమిచ్చాయి. మూడు రోజుల కిందటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

News May 7, 2025

నెల్లూరు: పరిశ్రమలకు ఆ నీరు..?

image

నెల్లూరులో మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసిన నీటిని స్థానిక పరిశ్రమలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కమిషనర్ వైఓ నందన్ ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టు పరిసర పరిశ్రమల ప్రతినిధులు, కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు పరిధిలో మూడు ప్రధాన మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వీటిని వ్యవసాయానికి ఉపయోగించవచ్చన్నారు.

News April 25, 2025

గణితంలోనే 3,934 మంది ఫెయిల్

image

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 3,934 మంది విద్యార్థులు ఒక్క గణితంలోనే ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత సైన్సులో 2,555 విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. గణితం ప్రశ్నా పత్రంలో లోపాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రయత్నం చేశారని, అయినా ఫలితాలు నిరాశ కలిగించాయని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రీ-వెరిఫికేషన్‌కు సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. 

News April 25, 2025

30 నుంచి VSUలో టోర్నమెంట్

image

కాకుటూరు దగ్గర ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈనెల 30 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందితో వీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.