Nellore

News September 24, 2024

నెల్లూరు జిల్లా 108లో ఉద్యోగ అవకాశాలు

image

నెల్లూరు జిల్లాలోని 108 వాహనాల్లో పైలెట్, ఈఎంటీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఎస్. విజయ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 25వ తేదీలోపు నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, దిశ మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న 108 కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

News September 24, 2024

మనుబోలు: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

image

మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై ఓ ట్రావెల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం విజయవాడ నుంచి చెన్నైకి 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. యాచవరం రోడ్డు దాటాక బస్సు టైరు పగిలిపోయింది.దీంతో బస్సు అదుపుతప్పి మరో వైపు వెళ్లిపోయింది. ఆసమయంలో వేరే వాహనాలు ఉండకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించినట్లు బస్సు సిబ్బంది తెలిపారు.

News September 24, 2024

ఆత్మకూరు: మరణించిన వీఆర్వోకు బదిలీ ఉత్తర్వులు

image

ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాలెం సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నరసింహారెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం జిల్లాలో జరిగిన రెవెన్యూ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అతనికి ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి వీఆర్వో గా పోస్టింగ్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో మృతి ఉన్నతాధికారులకు తెలియకపోవడంతోనే ఇలా జరిగి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.

News September 24, 2024

జిల్లా పోలీస్ సేవలు-భేష్: రేంజ్ IG

image

శాంతిభద్రతల పరిరక్షణ, నేర నిర్మూలనలో జిల్లా పోలీసులు సమర్దవంతంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీని గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి అభినందించారు. సోమవారం పోలీసుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రధమస్థానంలో సాధించిందన్నారు. అంతేకాకుండా ముత్తుకూరు పరిధిలో జరిగిన దోపిడీ కేసును గంటల వ్యవధిలో చేధించడంలో అద్భుతంగా పనిచేశారన్నారు.

News September 23, 2024

నెల్లూరు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని బండగానిపల్లి గ్రామానికి చెందిన భేరి తిరుపాల్ రెడ్డి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్‌లో ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో పోస్ట్ చేశారనిఅన్నారు. అందుకు గాను ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.

News September 23, 2024

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి స్పాట్ డెడ్

image

కలిగిరి మండలం లక్ష్మీపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. కుమ్మరి కొండూరు నుంచి బైక్‌పై వస్తున్న రామస్వామి పాళెం గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, వంకదారి మాలాద్రిని లక్ష్మీపురం సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 23, 2024

25, 2 6న వెంకటగిరిలో మద్యం దుకాణాలు బంద్

image

వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ఈ నెల 25న మధ్యాహ్నం 3 గం. నుంచి 26న రాత్రి 7 గంటల వరకు డ్రై డే మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు. అలాగే అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు సూచించారు. బందోబస్తు, భద్రత చర్యలు పకడ్బందీగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు.

News September 23, 2024

నెల్లూరు జిల్లాలో భారీగా అధికారుల బదిలీలు

image

జిల్లాలో ఆదివారం పలువురు అధికారులు బదిలీ అయ్యారు. వారిలో ఆరుగురు MROలు, 55-డిప్యూటీ MROలు, 17-రీసర్వే డిప్యూటీ తహశీల్దార్లు, 70-సీనియర్ అసిస్టెంట్లు, 27 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వారితోపాటూ ప్రధానంగా జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో చిరంజీవులు, డీపీవో సుస్మితారెడ్డి, డీఆర్డీఏ పీడీ కేవీ సాంబశివారెడ్డి, డ్వామా పీడీ వెంకట్రావు, డీఎఫ్ఓ ఆవుల చంద్రశేఖర్ బదిలీ అయ్యారు.

News September 22, 2024

గూడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

చిల్లకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఆగిఉన్న కంటైనర్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. చిల్లకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కారులో నుంచి బయటకు తీసి 108 వాహనంలో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 21, 2024

వెంకటగిరి జనసేన ఇన్‌ఛార్జ్‌పై వేటు

image

వెంకటగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లపై క్రమశిక్షణ చర్యలు చేపడుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోపు ఆయనపై ఉన్న ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.