India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 79 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 85 శాతానికి పెంచాలని అధికారులు కృషి చేస్తున్నారు. పోయినసారి ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయో చూద్దాం.
➤ కావలి: 76.3 ➤ ఆత్మకూరు: 83.3
➤ కోవూరు: 77.6 ➤ నెల్లూరు సిటీ: 663
➤ నెల్లూరు రూరల్: 65.2 ➤ సర్వేపల్లి: 82.1
➤ గూడూరు: 77.8 ➤ సూళ్లూరుపేట: 83.2
➤ వెంకటగిరి: 79.3 ➤ ఉదయగిరి: 80.3
నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వస్తూ.. కావలి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని తల్లి, కుమారుడు చనిపోయారు. ఇద్దరి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. మృతులు సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన సుభాషిని, విజయ్ కుమార్గా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కావలి ఏరియా హాస్పిటల్కు తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు 450 బస్సులకు కేటాయించినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పీవీ శేషయ్య తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు సాగించడంతో పాటు ఈవీఎంల తరలింపునకు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ్ ఆదేశాల మేరకు బస్సులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బస్సులను నడపనున్నట్లు వివరించారు.
ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఉప్పలపాడు సమీపంలో శనివారం సాయంత్రం జబర్దస్త్ నటి పవిత్ర కారుకి ప్రమాదం జరిగింది. ఓటు వేసేందుకు తమ సొంత ఊరు సోమశిల వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన పవిత్రను దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఎన్నికల ప్రచార గడువు ముగియనుండగా తాయిలాల పర్వానికి తెర లేచింది. నగదు పంపిణీకి ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. దీంతో DV సత్రం, నాయుడుపేట, సూళ్లూరుపేటలో ఇప్పటికే చాలా చోట్ల డబ్బు పంచుతున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలైన కూటమి, వైసీపీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకు టీడీపీ రూ.వెయ్యి ఇస్తుంటే, దానికి పైచేయిగా YCP రూ.2 వేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వింజమూరు బ్రాంది షాప్ నందు మందు బాబులు బారులు తీరారు. మద్యం షాపు తీసే గంట ముందు నుంచి షాపు ముందు బైకులు కార్లుతో వచ్చి బారులుగా నిలబడ్డారు. కొంతమంది మద్యం బాబులు నిలబడేందుకు ఓపిక లేక దుకాణం దారులపై, సిబ్బందిపై వాగ్వాదానికి దిగుతున్నారు. ఎస్సై కోటిరెడ్డి మందుబాబులను వరుస క్రమంలో నిలబెట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు.
మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి పోలింగ్ కేంద్రానికి ప్రత్యేకత ఉంది. ఈ పోలింగ్ కేంద్రంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఆత్మకూరు, ఉదయగిరి వైసీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు కూడా బ్రాహ్మణపల్లిలోనే ఓటు వేయనున్నారు.
ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
భారత సైన్యంలో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ జరుగుతోందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి రామాంజనేయులు తెలిపారు. 17 నుంచి 21 ఏళ్ల లోపు వారు అర్హులని వెల్లడించారు. నేవీలో పోస్టుకు పదో తరగతి, ట్రేడ్ మాన్ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.