Nellore

News December 17, 2024

కోట: భారీ కొండచిలువ కలకలం..

image

కోట మండలం మద్దాలి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామంలోని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను బయట కట్టేసి నిద్రిస్తున్న సమయంలో కొండచిలువ అతని ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కుక్క అడ్డుకోవడంతో కొండచిలువ దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రజలు భయపడుతున్నారు.

News December 17, 2024

ఆత్మకూరు: పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. జీతం రూ.1,10,000

image

ఆత్మకూరు జిల్లా ఆస్పత్రి డైస్ సెంటర్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DMHO పెంచలయ్య తెలిపారు. వివరాలను spsnellore.ap.gov.in/notice/recruitment అనే వెబ్సైట్లో అప్లై చేయాలన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఈనెల 19వ తేదీ లోపు పెద్దాస్పత్రిలో డైస్ కేంద్రంలో అందించాలన్నారు. జీతం రూ.1,10,000 ఉంటుందన్నారు.

News December 17, 2024

నెల్లూరు: ‘త్వరలోనే 108 ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం’

image

108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామని మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ తెలిపారు.108 సర్వీసెస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ప్రతినిధి వర్గం రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో  సచివాలయంలో మంత్రిని కలిశారు. 108 ఉద్యోగుల ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

News December 16, 2024

నెల్లూరు: అమరవీరులకు NCC క్యాడెట్ల నివాళి

image

నెల్లూరు గ్రామీణ భక్తవత్సల నగర్‌లోని కేఎన్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సోమవారం10(A) నావెల్ NCCయూనిట్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో NCC సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు, ఆ పాఠశాల NCC క్యాడెట్లు పాల్గొని త్రివర్ణ పతాకాలు చేతపట్టి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు నివాళులర్పించారు.

News December 16, 2024

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు ఢమాల్

image

రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత, వర్షాల వల్ల నిమ్మకాయల వినియోగం తగ్గి రైతులకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా మూడు రోజుల నుంచి ధర తగ్గుముఖం పట్టింది. కిలోల లెక్కన రూ.15 నుంచి రూ.20 మాత్రమే ధర పలుకుతోంది. సంక్రాంతి వరకు ఇవే ధరలు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News December 16, 2024

నాయుడుపేట: ఐదేళ్ల చిన్నారితో అసభ్య ప్రవర్తన..

image

పెళ్లకూరు మండలంలో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ గ్రామంలో మూడు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సుధాకర్ అనే వ్యక్తి ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు గుర్తించి మందలించారు. చిన్నారి తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయుడుపేట DSP చెంచుబాబు, SI నాగరాజు విచారణ చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News December 16, 2024

భయం గుప్పిట్లో నెల్లూరు

image

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గతంలో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. బుధ, గురు వారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD హెచ్చరించింది. దీంతో ఓ వైపు వర్షం, మరోవైపు చలితో నెల్లూరు ప్రజలు వణికిపోతున్నారు.

News December 16, 2024

నెల్లూరు: జాబ్ మేళాలో 2500 మందికి ఉద్యోగాలు

image

నెల్లూరు మండలంలోని కనుప్రత్తిపాడులో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో 2500 మంది ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మేళాలో ఎంపికైన 800 మందికి ఆఫర్‌ లెటర్లు అందించారు. మిగిలిన వారికి సోమవారం పత్రాలను అందించనున్నట్లు వివరించారు.

News December 15, 2024

కోవూరు: రైలు నుంచి కిందపడి ఒకరు మృతి

image

కొవ్వూరు మండలం పడుగుపాడు ఇనమడుగు రైల్వే గేటు వద్ద ఇవాళ అస్సాంకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. సిల్చారు నుంచి తిరుచూరు వెళ్లే అరుణయ్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఆయన పొరపాటున కింద పడ్డాడు. ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.  బాధితుడి శరీరం రెండు భాగాలుగా వేరు పడింది. మృతుడిని అస్సాం రాష్ట్రం గోవిందపూర్ ప్రాంతానికి చెందిన షాలే అహ్మద్ (32)గా రైల్వే పోలీసులు గుర్తించారు. 

News December 15, 2024

ఉదయగిరిలో వెయ్యి మందికి పదవులు

image

ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ వ్యూహంతో 150 సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సాగునీటి సంఘాల ఎన్నికలలో సుమారు వెయ్యి మందికి పదవులు వచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యే తొలి అడుగులోనే ఉదయగిరి కోటపై టీడీపీ జెండా ఎగురవేసి, అనంతరం జరిగిన ఈ ఎన్నికలలో రెపరెపలాడించారు. ఇదే జోరుతో భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని నాయకులు ఘంటాపదంగా చెబుతున్నారు.