India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.

సూళ్లూరుపేటకు చెందిన ఎన్ఆర్ఐ యస్వంత్ బధిర విద్యార్థుల కోసం ఆడియో మీటర్ అందజేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బధిరుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక పాఠశాల విద్యార్థులకు రూ.82 వేల విలువైన దీనిని సమకూర్చారు. దీనికి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు. యశ్వంత్ను కలెక్టర్ అభినందించారు.

ఎవరైనా డీలర్లు కృత్రిమ ఎరువుల కొరత సృష్టించినా, MRP ధరలకు మించి విక్రయించినా, ఎరువులను దారి మళ్లించినా చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారిణి P.సత్యవాణి హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 62,928 మెట్రిక్ టన్నులు యూరియా విక్రయించారన్నారు. ప్రస్తుతం 18,025 మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేటు డీలర్స్, కోపరేటివ్ సొసైటీలు, RSK, మార్క్ పెడ్ గోడౌన్లో నిల్వ ఉందని చెప్పారు.

సోమిరెడ్డి నీతిమాలిన మాటలు విని భవిష్యత్తులో ఉద్యోగులు ఇబ్బంది పడొద్దని మాజీ మంత్రి కాకాణి సూచించారు. ‘సోమిరెడ్డి చెప్పారనే వెంకటాచలం సర్పంచ్ను డీపీవో శ్రీధర్ రెడ్డి తొలగించారు. పోలీసులు లేకుండా MLA గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు కుక్కను కొట్టినట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఇరిగేషన్ శాఖలోనే సోమిరెడ్డి రూ.100కోట్ల అవినీతి చేశారు’ అని కాకాణి ఆరోపించారు.

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా మిల్లర్లు సహకరించాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్స్తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీకి సంబంధించి ధాన్యం సేకరణ, బ్యాంకు గ్యారంటీలపై చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

నెల్లూరు జిల్లాలో మత్స్యకారులకు భద్రతతో పాటు చేపలు ఉండే ప్రాంతాన్ని పసిగట్టే నావిగేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. జిల్లాలో 3వేల బోట్లకు వీటిని అమర్చనుంది. నెల్లూరులోని జిల్లా మత్స్య శాఖ ఆఫీసుకు ఈ పరికరాలు వచ్చాయి. వీటిని బోట్లకు అమర్చడంతో మత్స్సకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Sorry, no posts matched your criteria.