India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చోటు దక్కింది. ఈ కమిటీ ఛైర్మన్గా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను లోక్సభ స్పీకర్ ఓం బీర్లా నియమించారు. ఈ కమిటీలో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. అందులో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభనుంచి ఏడుగురిని నియమించారు. వీరు 2025 ఏప్రిల్ 30వ తేదీ వరకు పదవీలో కొనసాగుతారు.
సూళ్లూరుపేటలోని మహాదేవయ్య నగర్ వెనకవైపు ఉన్న కాళంగి నదిలో బుధవారం ఓ గుర్తుతెలియని మృతదేహం తేలియాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో గురవారం మృతదేహాన్ని వెలికితీస్తామని పోలీసులు చెప్పారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ప్రియుడి ఇంటి ముందు అతడి ప్రియురాలు ఆందోళనకు దిగిన ఘటన గూడూరులో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గూడూరు అరుంధతీయవాడకు చెందిన గోవిందు ప్రశాంత్ తనను పెళ్లి చేసుకుంటానని గర్భం చేశాడని అన్నారు. పెళ్లి చేసుకోవాలని అడిగితే.. ముఖం చాటేయడంతో ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసింది.
అనంతసాగరం మండలం, సోమశిల జలాశయం నుంచి మరికాసేపట్లో కండలేరుకు కృష్ణా జలాలను అధికారులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జలాశయంలో 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు రోజుల క్రితం జలాశయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించిన విషయం తెలిసిందే. తమ ప్రాంతాలకు కూడా నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.
జిల్లాలోని సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీ అని గత ప్రభుత్వంలో నామకరణం చేసిన విధంగానే కొనసాగించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బ్యారేజీలకు పెట్టిన పేర్లను టీడీపీ ప్రభుత్వం తొలగించడం సరికాదన్నారు. బ్యారేజీలకు తిరిగి పాత పేర్లను పునరుద్ధరించాలన్నారు.
జిల్లా స్థాయి అండర్ – 9 ఓపెన్, బాలికల చెస్ పోటీలను ఈనెల 25న నిర్వహించి జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నామని చెస్ అసోసియేషన్ నెల్లూరు కార్యదర్శి మస్తాన్ బాబు తెలిపారు. రాయ్ చెస్ అకాడమీలో నిర్వహించనున్న పోటీలకు ఆసక్తి గలవారు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు.
విద్యార్థులకు సరిగా బోధించకపోవడం, తదితర కారణాలతో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖధికారి పి.విజయ రామారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఆర్వి ప్రసన్నలక్ష్మి, తెలుగు పండిట్ ఎల్ శ్రీనివాసరావుపై ఆ పాఠశాల విద్యార్థులు ఇటీవల కలెక్టర్ ఆనందుకు ఫిర్యాదు చేశారు. సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి ఎమ్.వినయ్ కుమార్ మంగళవారం తెలిపారు. వివిధ కంపెనీలలో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు జాబ్ మేళాకు హాజరు కావాలని తెలిపారు.
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, FCI గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు తొలగించాలని ఆదేశించారు.
తన కార్యక్రమాలలో ఎక్కడైన ఫ్లెక్సీలు కట్టిన బొకేలు, శాలువాలు ఇచ్చిన టపాసులు కాల్చిన ఆ కార్యక్రమానికి తాను హాజరుకానని.. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఎక్కడపడితే అక్కడ కట్టడం వల్ల ప్రజలకు, చిన్న చిన్న వ్యాపారస్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. తన కార్యక్రమాలలో ఎక్కడా హంగు, ఆర్భాటాలు వద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.