India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జగనన్న కాలనీలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహం చూసిన కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు జిల్లాలో గతేడాది మద్యం ఏరులై పారింది. 2024 డిసెంబర్ నాటికి రూ.139.5 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. 2025 ఆ లెక్కను దాటేసింది. నెల్లూరోళ్లు గడిచిన డిసెంబర్ నాటికి రూ. 143.75 కోట్ల మద్యాన్ని తాగేశారు. 2024 తో పోలిస్తే.. రూ. 4 కోట్ల మేరా అధికంగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తేనే.. జిల్లాలో మద్యం విక్రయాలు ఎంత జోరుగా సాగుతున్నాయో తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, కంటేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి రమణయ్య తన కొడుకు రఘురామయ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరులో 2025లో గంజాయి బ్యాచ్కు ఓ వ్యక్తి బలయ్యాడు. అరుణ తర్వాత మరో లేడీ డాన్ కామాక్షి వెలుగులోకి వచ్చింది. వరుస నేరాలపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ రౌడీషీట్లు తెరిచారు. 3కంటే ఎక్కువ కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2025లో మొత్తం 16 మందిపై పీడీయాక్ట్, 34మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 102 మందిని రిమాండ్కు పంపారు. 510 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో ఈనెల 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రీసర్వే చేశారు. భూ వివాదాలను పరిష్కరించి కొత్తగా పాస్ పుస్తకాలు ముద్రించారు. రాజముద్రతో ఉన్న వీటిని గ్రామ సభలు నిర్వహించి ప్రజాప్రతినిధుల ద్వారా రైతులకు అందజేస్తున్నారు. జిల్లాకు మొత్తం 1.05 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు చేరాయి. ఈ కొత్త పుస్తకాలు మీకు అంది ఉంటే కామెంట్ చేయండి.

<<18602332>>ఛాంపియన్ ఫార్మర్స్<<>> పేరిట నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా <<18725510>>మాట్లాడే <<>>వీలు కల్పించారు. చేపలు, రొయ్యలు, ఆక్వా సాగు సందేహాలపై మత్స్యశాఖ శాస్త్రవేత్త N.తీరజ(9866210891)కు ఉద్యాన పంటలు, విత్తనాల ఎంపికపై ఉద్యానవన శాఖ అధికారిణి లక్ష్మికి(7995088181) కాల్ చేయవచ్చు.

ఉదయగిరి మండలం కొండకింద గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డు, దుర్గం, జి.చెరువుపల్లి అటవీ ప్రాంతాల్లో తిరగడాన్ని తాము చూశామని నాలుగైదు రోజులుగా ప్రజలు చెబుతున్నారు. తాజాగా గురువారం రాత్రి 7గంటల సమయంలో కుర్రపల్లి-కృష్ణాపురం మార్గంలో జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటడాన్ని కృష్ణారెడ్డిపల్లికి చెందిన దేవసాని శ్రీనివాస్ రెడ్డి చూశారు.

సర్పంచ్ ఎన్నికలు జనవరిలోనే జరపాలని ప్రభుత్వం గతంలో చెప్పడంతో నెల్లూరు జిల్లాలో గ్రామ రాజకీయాలు స్పీడందుకున్నాయి. జిల్లాలోని 722 పంచాయతీల్లో నాయకులు మంతనాలు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు పంచాయతీ విభజన జరగకూడదు. ప్రస్తుత సర్పంచ్ల గడువు ఏప్రిల్తో ముగుస్తుంది. ఆ తర్వాతే పంచాయతీల విభజన చేసిన జూన్ లేదా జులైలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పల్లె రాజకీయాలు స్లో అయ్యాయి.

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.
Sorry, no posts matched your criteria.