Nellore

News April 13, 2024

నెల్లూరు: 43 మందిలో ఒక్కరే పాస్..

image

చేజర్ల మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో ఒక్క విద్యార్థి మాత్రమే పాసయ్యారు. 42 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ప్రభుత్వ అధ్యాపకుల నిర్లక్ష్యమని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ఇంటర్ లో 27 మందికి గాను 13 మంది ఫెయిల్ అయ్యారు.

News April 13, 2024

వెంకటాచలం: స్కూల్ వ్యాన్ ఢీకొని మహిళ మృతి

image

మండలంలోని ఈదగాలి గ్రామానికి చెందిన వెందోటి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మమ్మ దంపతులు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా ఇడిమేపల్లి ప్రాంతంలోని సర్వేపల్లి రైల్వే గేట్ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో వెంకటలక్ష్మమ్మ (30) అక్కడికక్కడే మృతిచెందింది. సుబ్రహ్మణ్యంకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 13, 2024

నెల్లూరు: 15వ తేదీతో ముగియనున్న గడువు

image

15వ తేదీ రాత్రితో ఓట్ల నమోదుకు గడువు ముగియనుంది. 18 ఏళ్లు నిండి ఇంకా ఓటు నమోదు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. ఇటీవల విడుదలైన జాబితాలో జిల్లాలో 18 నుంచి 19 వయసు ఓటర్లు 36,175 మంది ఉండగా… 40-49 ఏళ్ల వారు అత్యధికంగా 4,29,668 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News April 13, 2024

నెల్లూరు: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు GOOD NEWS

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫెయిలైన, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజును సంబంధిత కళాశాలలో ఈ నెల 18 నుంచి 24వ తేదీ లోపు చెల్లించాలని కోరారు. ప్రాక్టికల్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే ఒకటి నుంచి 4 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News April 13, 2024

నెల్లూరు: నలుగురికి మాత్రమే అనుమతి

image

నెల్లూరు జిల్లాలో ఎన్నికల సందడి ఇప్పటికే ప్రారంభం కాగా… నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి కానుంది. నామినేషన్ల సమయంలో ఆర్వో కార్యాలయ గేట్ నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఉంటుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. గేటు నుంచి అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

News April 12, 2024

సూళ్లూరుపేట: బస్సు, లారీ ఢీ.. ముగ్గురికి గాయాలు

image

సూళ్లూరుపేటలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు, కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇవాళ రాత్రి మల్లం గ్రామం నుంచి మాంబట్టు సెజ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో నైట్ డ్యూటీకి ఉద్యోగులతో వెళ్తున్న బస్సు టర్నింగ్ తిరిగే క్రమంలో వెనక నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఘటనలో బస్సులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

News April 12, 2024

నెల్లూరు జిల్లాలో యువతి దారుణ హత్య

image

జిల్లాలోని కొడవలూరు మండలం నార్త్ రాజు పాలెంకు చెందిన భయ్యా రాణి అనే యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఊచగుంటపాలెంకు చెందిన కొత్తూరు అనుప్ అనే వ్యక్తి ఆమెను బంగారం కోసం పెట్రోల్ పోసి తగలబెట్టాడని పోలీసులతో చెప్పారు. జువ్వలదిన్నె తిప్పలేరు కాలువ వద్ద ఆమె శవం లభించింది.

News April 12, 2024

నెల్లూరు: అప్పుడు 4.. ఇప్పుడు 8

image

నెల్లూరులో గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 25,535 మందికి 17042 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈసారి 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం(69) పెరిగినా 8వ స్థానానికి పడిపోయింది. అలాగే సెకండ్ ఇయర్‌లో గతేడాది 22,789 మందికి 17,438 మంది పాసయ్యారు. 77 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇవాల్టి ఫలితాల్లో 81 శాతంతో 6వ స్థానానికే పరిమితమైంది.

News April 12, 2024

నెల్లూరు: 25 నుంచి లా పరీక్షలు

image

నెల్లూరు వీఆర్ లా కళాశాల విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెమిస్టరు, 6వ సెమిస్టరు పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 6వ సెమిస్టర్ పరీక్షలతో కోర్స్ పూర్తి కానుంది. మే 8న మొదటి సెమిస్టరు విద్యార్థులకు, మే 2న 6వ సెమిస్టరు విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి.

News April 12, 2024

నెల్లూరు జిల్లాకు 8వ స్థానం

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 69 శాతంతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. 21,293 మందికి 17,292 మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలవగా.. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో ఇదే జిల్లా 81 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 25,990మందికి 21,062 మంది పాసయ్యారు.