India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది కావలిలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హత్యాయత్నం కేసులో ఇరుక్కున్న వెంటనే ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. బెంగళూరులో ఉండొచ్చని కొందరు.. కాదు కాదు ఆయన దేశం దాటి శ్రీలంక వెళ్లుంటారంటూ మరికొందరి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన జాడ మిస్టరీగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ లోపిస్తుంది. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడటం లేదు. వరికుంటపాడు పాఠశాలలో తెల్లన్నం, ఆలుగడ్డ కూర పెట్టారు. కందుకూరులో నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. బోగోలు పాఠశాలలో కూర్చునే సౌకర్యం లేదు. గుడ్లూరులో మెనూ ప్రకారం వడ్డించినా విద్యార్థులు తినలేదు. అధికారులు పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లాలో అద్దె, శిదీలావస్థకు చేరుకున్న పంచాయతీలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు మోక్షం లభించింది. దీంతో జిల్లాలో తోలుత 40 చోట్ల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరవగా, ఒక్కోదానికి రూ. 32లక్షలు వెచ్చించనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద నిధులు కేటాయించనున్నారు.
శ్మశాన వాటిక సమీపంలో ఉందంటేనే నివాసం ఉండేందుకు కూడా చాలా మంది భయపడుతుంటారు. కానీ కావలిలో మాత్రం సమాధులతోనే కొందరు సావాసం చేస్తున్నారు. గతంలో అక్కడి పెద్దలు శ్మశానానికి 70 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమి అన్యాక్రాంతం అయింది. సమాధులు ఆక్రమించుకుని మరీ ఇల్లును నిర్మించుకోవడంతో, ఇంటి ముందే సమాధులు దర్శనమిస్తున్నాయి. భయం లేకుండానే కాపురాలు చేస్తున్నారు.
విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కావలిలో నడుస్తున్న కళాశాలలో ఈ ఏడాది నుంచి బీ.ఫార్మసీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రిజిస్ట్రార్ సునీత తెలిపారు. ఏపీఈఏపీసీఈటీ 2025 కౌన్సెలింగ్లో వీఎస్యూ పీఎస్ఎఫ్, కళాశాల కోడ్ పీహెచ్ఎం కోర్సు అని వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఏడాదికి రూ. 60 వేలు ఉంటుందని, ఫీజు రీయేంబర్స్ మెంట్ ద్వారా అర్హులైన విద్యార్థులు ఉచితంగా అభ్యసించవచ్చన్నారు.
వెంకటగిరి జాతరకి వెళుతున్న క్రమంలో వృద్ధురాలి మెడలో నుంచి సరుడు దొంగలించిన ఘటన నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. వెంకటగిరి వెళ్లేందుకు నెల్లూరుకు చెందిన పద్మ ఆర్టీసీ బస్టాండ్కు వచ్చింది. వెంకటగిరి వెళ్లే బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి. ఈ క్రమంలో బస్సు ఎక్కుతుండగా మెడలో ఉన్న రెండున్నర సవర్ల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బజార్ సీఐ కోటేశ్వర్ రావ్ కేసు నమోదు చేశారు.
ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు కలెక్టర్గా నియమితులైన హిమాన్షు శుక్లా ఇది వరకు AP I&PR (సమాచార&ప్రజా సంబంధాల శాఖ) డైరెక్టర్గా పని చేశారు. ఈయన 2013 బ్యాచ్కు చెందిన IAS అధికారి. హిమాన్షు పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించారు.
వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ముగిసింది. పొలి చల్లడం పూర్తి అయ్యాక ఊరేగింపునకు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన పూల రథంపై అమ్మవారిని ఉంచి సాయంత్రం 5 గంటలు దాటాక నగరోత్సవం ప్రారంభించారు. ఆర్చి సెంటర్ నుంచి రాజావారి వీధి, కాశీపేట, శివాలయం మీదుగా మల్లమ్మ గుడి వీధిలోని విరూపణ మండపం వరకు ఊరేగింపు జరిగింది. ‘ వెళ్లి రా పోలేరమ్మా ‘ అంటూ భక్తులు ఘన వీడ్కోలు పలికారు. 2.30 గంటలు ఊరేగింపు జరిగింది.
నెల్లూరు కలెక్టర్గా నియమితులైన హిమాన్షు శుక్లా ఇది వరకు AP I&PR (సమాచార&ప్రజా సంబంధాల శాఖ) డైరెక్టర్గా పని చేశారు. ఈయన 2013 బ్యాచ్కు చెందిన IAS అధికారి. హిమాన్షు పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.