India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జంట హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. మత్తులో విచక్షణ కోల్పోయిన నిందితులు కత్తులతో దాడులు, దోపిడీలు చేస్తున్నారు. రాము మద్యం డబ్బుల కోసం స్నేహితుడిపై కత్తితో దాడి చేయగా, మరో ఘటనలో డబ్బులివ్వలేదని చెప్పినవారిపై దాడి జరిగింది. నగరంలో గంజాయి, మద్యం విక్రయాలు విస్తరిస్తుండటంతో నేరాలు పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పాతనేరస్తులు రోడ్లపై కాపు కాస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.
నెల్లూరులో ఇటీవల నేరాలు పెరుగుతుండడంతో ప్రజల్లో భయం నెలకొంది. కత్తులతో బెదిరించి దోపిడీలు, హత్యలు చేయడం పెరిగాయి. పెన్నా బ్యారేజ్ వద్ద జరిగిన జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. యువకులు గంజాయి మత్తులో కత్తులు దాచుకొని ప్రజలను బెదిరిస్తున్నారు. చిన్న గొడవలకు కూడా కత్తులు చూపడం ఫ్యాషన్గా మారింది. పోలీసు నిఘా సరిగా లేక, పాత నేరస్థులపై చర్యలు లేవన్న ఆరోపణలున్నాయి.
ప్రస్తుత కాలంలో ఊబకాయం (Obesity) ప్రమాదకరంగా మారింది. గుండె, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు ఇది ప్రధాన కారణమవుతోంది. ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఊబకాయంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో 30% మంది ఊబకాయులు ఉండగా, వారిలో సగం మహిళలేనని అధ్యయనం తెలిపింది. పిల్లల్లో 25% మందికి ఈసమస్య ఉంది. రోజు వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు.
ఉమ్మడి నెల్లూరు(G) సూళ్లూరుపేటలో 2019లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నెల్లూరు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి MA సోమశేఖర్ ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. ముద్దాయిలు ఇద్దరు సూళ్లూరుపేట బొగ్గుల కాలనీకి చెందిన తిరువల్లూరు నవీన్ కుమార్, సాయి నగర్కు చెందిన కేకుల దేవకు జీవిత ఖైదీ విధించారు. దీంతోపాటు నగదు దోపిడీకి పాల్పడినందుకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు.
కావలి రైతు బజార్ను ఆధునికరించే దిశగా అడుగులు పడుతున్నాయి. మార్కెట్లో ఇప్పటికే శిథిలావస్థకు గురైన దుకాణాలలో తొలగించారు. వర్షం నుంచి రక్షణగా రూఫ్ టాప్ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రూ.45 లక్షలతో పనులు వారం కిందటే ప్రారంభమయ్యాయి. కొత్తగా దుకాణాల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, పెయింటింగ్ పనులు తదితర వాటికి మరో రూ.50 లక్షలు ఖర్చు కానున్నట్లు సమాచారం.
నెల్లూరులో అధునాతన వసతులతో అతిపెద్ద కూరగాయల మార్కెట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ నుంచి జీవో విడుదలైంది. నవాబుపేట సమీపంలోని నరుకూరు రోడ్డులో ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డులో నెల్లూరు నగరపాలక సంస్థ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ మార్కెట్ను పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. మొత్తం 19.69 ఎకరాలలో మార్కెట్ ఏర్పాటు కానుంది.
కృష్ణపట్నంతో పాటు త్వరలోనే రామాయపట్నం, దుగ్గరాజపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా దగదర్తి ఎయిర్ పోర్ట్ పూర్తయితే జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని, దీని వలన పేదరికం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే HYD-చెన్నై, చెన్నై-అమరావతికి బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 కల్లా AP ఆర్థికంగా అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.
వెంకటాచలం(M) ఈదగాలిలో ఏర్పాటు చేసిన బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ద్వారా 200 లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేయనున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇదొక ఇన్నోవేటివ్ ప్రాజెక్టు అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ఆలోచనలను అందిపుచ్చుకోవడం గొప్ప విషయమన్నారు. వినూత్నంగా కరెంటును ఉత్పత్తి చేసే విధానానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు.
CM చంద్రబాబు శుక్రవారం వెంకటాచలం మండలం చేరుకున్నారు. ఈదగాలి గ్రామంలోని నందగోకులం లైఫ్ స్కూల్లో పర్యటించారు. అనంతరం సమీపంలోని గోశాలను సందర్శించి, నంది పవర్ ట్రెడ్ మిల్ మిషన్ను ప్రారంభించనున్నారు. అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. ఆయన వెంట ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు.
NTR ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేస్తూ నెల్లూరులోని కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యం బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు నిలిపివేయడంతో ఈమేరకు సేవలను నిలిపివేశారు. బకాయిలు విడుదల చేయకపోవడం, మరోవైపు 2010 నుంచి 2025 వరకు ఆసుపత్రిలో ఉపయోగించే పలు రకాల వస్తువులు, ఎంవోయూ ధరలు, విద్యుత్ ఛార్జీలు పెరగడంతో నిర్వహణ భారం అధికమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.