India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రౌడీ షీటర్ జయప్రకాశ్ పై PD యాక్ట్ నమోదైనట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నిందితుడు 2022లో PD యాక్ట్ కేసులో సంవత్సరం జైలుకెళ్లాడు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో 1 రౌడీ షీట్, 3 హత్య, 2 హత్యాయత్నం, 8 రక్త గాయాలు చేసిన కేసులు అతనిపై ఉన్నాయి. సుమారు 14 రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకెళ్లి వచ్చినా అతను తీరు మార్చుకోకపోవంతో కేసు నమోదైంది.

రౌడీ షీటర్ జయప్రకాశ్ పై PD యాక్ట్ నమోదైనట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నిందితుడు 2022లో PD యాక్ట్ కేసులో సంవత్సరం జైలుకెళ్లాడు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో 1 రౌడీ షీట్, 3 హత్య, 2 హత్యాయత్నం, 8 రక్త గాయాలు చేసిన కేసులు అతనిపై ఉన్నాయి. సుమారు 14 రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకెళ్లి వచ్చినా అతను తీరు మార్చుకోకపోవంతో కేసు నమోదైంది.

రౌడీ షీటర్ జయప్రకాశ్ పై PD యాక్ట్ నమోదైనట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నిందితుడు 2022లో PD యాక్ట్ కేసులో సంవత్సరం జైలుకెళ్లాడు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో 1 రౌడీ షీట్, 3 హత్య, 2 హత్యాయత్నం, 8 రక్త గాయాలు చేసిన కేసులు అతనిపై ఉన్నాయి. సుమారు 14 రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకెళ్లి వచ్చినా అతను తీరు మార్చుకోకపోవంతో కేసు నమోదైంది.

కండలేరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షక ఇంజనీరు సుబ్రహ్మణ్యేశ్వర రావు తెలిపారు. జలాశయం కెపాసిటీ 60.14 టీఎంసీలు కాగా, ఎగువనుంచి 17500 క్యూసెక్కుల వర్షపు నీరు జలాశయానికి వస్తుండగా, 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జలాశయం వద్ద నీటి ప్రవాహం అదుపులో ఉందని, ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.

కండలేరు జలాశయం నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 6,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 11 గంటలకు 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కండలేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రస్తుతం కండలేరులో నీటిమట్టం 60 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

దిత్వా తుఫాను నేపథ్యంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కండలేరు జలాశయాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని ఎస్.ఈ.సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని నిరంతరం పర్యవేక్షించి, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీప గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్ప్రైజెస్పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్కు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్ ప్రైజెస్ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.

వీఆర్సీ అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలబడడంతో ఆ ప్రాంతంలో అధికారులు రాకపోకలను నిషేధించారు. ఇటీవల ఈ అండర్ బ్రిడ్జి రిపేర్లు చేసిన విషయం తెలిసిందే. సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ నీళ్లు నిలబడడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. దీనివల్ల ప్రజలు కిలోమీటర్ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.

నెల్లూరు జిల్లాలోని వరి నాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 11 మండలాల పరిధిలోని 71 గ్రామాల్లో 1,169 హెక్టార్లలో నాట్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 1,775 మంది రైతులు నష్ట పోయారన్నారు. భారీ వర్షాల వల్ల బోగోలు, విడవలూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, అల్లూరు, వెంకటాచలం, బుచ్చి, సంగం, మనుబోలు మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.