Nellore

News December 5, 2025

నెల్లూరు: 2.94 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలే లక్ష్యం.!

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 21వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న 2,94,140 మంది చిన్నారులకు ఈ చుక్కల మందును వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 52 PHC, 28 UPHCల పరిధిలో 80 కేంద్రాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు.

News December 5, 2025

అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.

News December 5, 2025

నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

image

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.

News December 5, 2025

నెల్లూరు: రౌడీ షీటర్ పై PD యాక్ట్ నమోదు

image

రౌడీ షీటర్ జయప్రకాశ్‌ పై PD యాక్ట్ నమోదైనట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నిందితుడు 2022లో PD యాక్ట్ కేసులో సంవత్సరం జైలుకెళ్లాడు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో 1 రౌడీ షీట్, 3 హత్య, 2 హత్యాయత్నం, 8 రక్త గాయాలు చేసిన కేసులు అతనిపై ఉన్నాయి. సుమారు 14 రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకెళ్లి వచ్చినా అతను తీరు మార్చుకోకపోవంతో కేసు నమోదైంది.

News December 5, 2025

నెల్లూరు: రౌడీ షీటర్ పై PD యాక్ట్ నమోదు

image

రౌడీ షీటర్ జయప్రకాశ్‌ పై PD యాక్ట్ నమోదైనట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నిందితుడు 2022లో PD యాక్ట్ కేసులో సంవత్సరం జైలుకెళ్లాడు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో 1 రౌడీ షీట్, 3 హత్య, 2 హత్యాయత్నం, 8 రక్త గాయాలు చేసిన కేసులు అతనిపై ఉన్నాయి. సుమారు 14 రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకెళ్లి వచ్చినా అతను తీరు మార్చుకోకపోవంతో కేసు నమోదైంది.

News December 5, 2025

నెల్లూరు: రౌడీ షీటర్ పై PD యాక్ట్ నమోదు

image

రౌడీ షీటర్ జయప్రకాశ్‌ పై PD యాక్ట్ నమోదైనట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నిందితుడు 2022లో PD యాక్ట్ కేసులో సంవత్సరం జైలుకెళ్లాడు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో 1 రౌడీ షీట్, 3 హత్య, 2 హత్యాయత్నం, 8 రక్త గాయాలు చేసిన కేసులు అతనిపై ఉన్నాయి. సుమారు 14 రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకెళ్లి వచ్చినా అతను తీరు మార్చుకోకపోవంతో కేసు నమోదైంది.

News December 4, 2025

కండలేరు నుంచి నీటి విడుదల

image

కండలేరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షక ఇంజనీరు సుబ్రహ్మణ్యేశ్వర రావు తెలిపారు. జలాశయం కెపాసిటీ 60.14 టీఎంసీలు కాగా, ఎగువనుంచి 17500 క్యూసెక్కుల వర్షపు నీరు జలాశయానికి వస్తుండగా, 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జలాశయం వద్ద నీటి ప్రవాహం అదుపులో ఉందని, ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.