Nellore

News April 18, 2026

పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు ఇవే…

image

☞ ఏప్రిల్ 28న: ధ్వజారోహణం, శేష వాహ సేవ ☞29న: బంగారు హనుమంత సేవ ☞ 30న: బంగారు గరుడసేవ ☞మే 1న: కళ్యాణోత్సవం, రథోత్సవం ☞2న: వసంతోత్సవం, అశ్వవాహన సేవ ☞3న: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ.

News April 18, 2026

పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు ఇవే…

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
28: ధ్వజారోహణం, శేష వాహ సేవ
29: బంగారు హనుమంత సేవ
30: బంగారు గరుడసేవ
1: కళ్యాణోత్సవం, రథోత్సవం
2: వసంతోత్సవం, అశ్వవాహన సేవ
3: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ
భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.

News April 18, 2026

పొదలకూరు: బస్తా రూ.12 వేలు

image

పొదలకూరు ప్రాంతంలో నిమ్మకాయల ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం 80 కిలోల బస్తా ధర రూ.10,500 నుంచి రూ.12 వేలు వరకు పలుకుతుండగా, సమీప రోజుల్లో ఇది రూ.15,000 చేరే అవకాశముందని వ్యాపారులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, సరఫరా పరిమితం కావడం వల్ల ధరలు భారీగా పెరిగాయి. రోజుకు 10 నుంచి 15 లారీల వరకు లక్నో, ఢిల్లీ, చెన్నై తరలి పోతున్నాయి.

News April 18, 2026

నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.

News April 18, 2026

నెల్లూరు: బాలికపై రేప్.. పదేళ్లు జైలు శిక్ష

image

నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య(45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె(16)ని 2021లో బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

News April 18, 2026

ఏపీ జట్టు కెప్టెన్‌గా ముత్తుకూరు యువకుడు

image

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు జరిగే జాతీయ స్థాయి టీ-10 క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్‌గా నెల్లూరు జిల్లా ముత్తుకూరు యువకుడు బాపనపాటి ప్రకాశ్ ఎంపికయ్యాడు. కరీముల్లా, సునీల్, వెంకటేశ్, నాగేంద్ర, అఖిల్ తదితరులు జట్టు సభ్యులుగా అసోసియేషన్ ప్రకటించింది. స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 18, 2026

నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

image

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.

News April 18, 2026

నెల్లూరు: అధికారుల తప్పుడు లెక్కలు..!

image

నెల్లూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బ కేసులు నమోదు అవుతున్న వైద్యాధికారులు వాటిని లెక్కల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో 486, 2024లో 867, 2025లో 34 కేసులు నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు ఒక్క కేసే నమోదైందని అధికారులు చెబుతున్నారు. గత నెల నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నా.. అప్రమత్తత చర్యల్లో వైద్య శాఖ నిర్లక్ష్యంగా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి.

News April 18, 2026

నెల్లూరు: అధికారుల తప్పుడు లెక్కలు..!

image

నెల్లూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బ కేసులు నమోదు అవుతున్న వైద్యాధికారులు వాటిని లెక్కల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో 486, 2024లో 867, 2025లో 34 కేసులు నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు ఒక్క కేసే నమోదైందని అధికారులు చెబుతున్నారు. గత నెల నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నా.. అప్రమత్తత చర్యల్లో వైద్య శాఖ నిర్లక్ష్యంగా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి.

News April 18, 2026

నెల్లూరు: అధికారుల తప్పుడు లెక్కలు..!

image

నెల్లూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బ కేసులు నమోదు అవుతున్న వైద్యాధికారులు వాటిని లెక్కల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో 486, 2024లో 867, 2025లో 34 కేసులు నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు ఒక్క కేసే నమోదైందని అధికారులు చెబుతున్నారు. గత నెల నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నా.. అప్రమత్తత చర్యల్లో వైద్య శాఖ నిర్లక్ష్యంగా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి.