Nellore

News October 2, 2025

నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా మిథున్‌ రెడ్డి

image

నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా పీవీ మిథున్‌ రెడ్డి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. నెల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే మిథున్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి ఆయనకే అప్పగిస్తూ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.

News October 2, 2025

గాంధీ జయంతి రోజున పొదలకూరులో ఆగని జీవహింస

image

గాంధీ జయంతి (డ్రై-డే), దసరా రెండూ ఒకే రోజు రావడంతో గురువారం పొదలకూరు మాంస వ్యాపారులు ఈ రోజు డ్రై-డే అన్న సంగతే మర్చిపోయారు.. సాధారణంగా ప్రతి ఏడాది అక్టోబర్-2 గాంధీ జయంతిని పురస్కరించుకొని మద్యం, జీవహింస నిషేదిస్తారు. ఆ దిశగా అధికారులు వ్యాపారులకు ముందస్తు సమాచారం అందిస్తారు. కానీ ఈ దఫా అవేమి జరిగినట్లు లేదు. దీనితో యథేచ్ఛగా మాంసం విక్రయాలు చేస్తున్నారు.

News October 2, 2025

నెల్లూరు: యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు

image

జిల్లాలో విద్యుత్తు వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించనుంది. జిల్లాలో 12,37,429 విద్యుత్తు కనెక్షన్లు ఉండగా.. వీటిపై గతంలో true up పేరుతో 40 పైసలు చొప్పున యూనిట్‌కి వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన దానిలో కొంత వినియోగదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో యూనిట్‌కు 13 పైసలు తగ్గించి ఇచ్చేందుకు తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. True down పేరుతో నవంబర్ బిల్లు నుంచి తగ్గనుంది. 12 నెలలు పాటు ఈ విధానం ఉంటుంది.

News October 2, 2025

వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి

image

వైసీపీ సీనియర్ నాయకుడు, అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి వైసీపీ సముచిత స్థానం కల్పించింది. కేంద్ర పార్టీ కార్యాలయం విడుదలు చేసిన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయనకు స్థానం కల్పించింది. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన విష్ణువర్ధన్ రెడ్డి.. రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

News October 2, 2025

నెల్లూరు: ప్రమాదం అంచున బాలికలు!

image

కౌమార బాలికల్లో రక్త హీనత వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా31,242 మందికి ఈ ఏడాది జూన్ నుంచి sep వరకు హీమోమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. 22,538 మందికి HB వాల్యూ నార్మల్ గా ఉంది. కాగా MILD ANEMIA 6418, MODERATE ANEMIA 2256, SEVERE ANEMIA 30 మంది చొప్పున బాధపడుతున్నారు. జిల్లాలో 8704 మంది కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉందనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

News October 2, 2025

నెల్లూరు: ప్రమాదం అంచున బాలికలు!

image

కౌమార బాలికల్లో రక్త హీనత వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా31,242 మందికి ఈ ఏడాది జూన్ నుంచి sep వరకు హీమోమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. 22,538 మందికి HB వాల్యూ నార్మల్ గా ఉంది. కాగా MILD ANEMIA 6418, MODERATE ANEMIA 2256, SEVERE ANEMIA 30 మంది చొప్పున బాధపడుతున్నారు. జిల్లాలో 8704 మంది కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉందనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

News October 2, 2025

వైసీపీలో మాజీ ఎంపీ ఆదాలకు కీలక పదవి

image

వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీలో కీలక పదవి దక్కింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయన చోటు దక్కింది. గత ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సేవల్ని పార్టీ వినియోగించుకోవాలని భావించడంతో ఆయన CEC లో చోటు దక్కింది. దీంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 2, 2025

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ

image

నెల్లూరు జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రజలకు శ్రీ దుర్గా మాత ఆశీస్సులు ఉండాలని, సకల శుభాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ దుర్గ భవాని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరారు.

News October 2, 2025

3వ తేదీ నుంచి జిల్లాలో రీ సర్వే గ్రామాల జాబితా విడుదల

image

ఈనెల 3వ తేదీ నుంచి జిల్లాలో 34 గ్రామాలలో రీ సర్వే నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. భూములు కలిగిన అందరూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూముల హద్దులు రీ సర్వే టీంకు చూపించి రికార్డులలో తమ పేరు నమోదు చేసుకొని రీ సర్వే నిర్వహించు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

News October 1, 2025

నెల్లూరు: జోరందుకున్న మద్యం అమ్మకాలు

image

అక్టోబర్ 2 గాంధీ జయంతి.. దసరా రెండు ఒకే రోజు వచ్చాయి. దీంతో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. దసరా పండగ అంటే మందు బాబులకు విందే. కానీ ఈసారి అది కుదరడం లేదు. దీంతో మందుబాబులు, బెల్టు షాపులు వారు ముందురోజే మద్యాన్ని భారీగా డంపు చేస్తున్నారు. రేపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 180 కి పైగా వైన్, 26కు పైగా బార్లు మూతపడనున్నాయి. మరోవైపు చికెన్ దుకాణాలు రాత్రి సమయం, వేకువజామునే అమ్మకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.