India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 3వ తేదీ నుంచి జిల్లాలో 34 గ్రామాలలో రీ సర్వే నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. భూములు కలిగిన అందరూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూముల హద్దులు రీ సర్వే టీంకు చూపించి రికార్డులలో తమ పేరు నమోదు చేసుకొని రీ సర్వే నిర్వహించు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

అక్టోబర్ 2 గాంధీ జయంతి.. దసరా రెండు ఒకే రోజు వచ్చాయి. దీంతో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. దసరా పండగ అంటే మందు బాబులకు విందే. కానీ ఈసారి అది కుదరడం లేదు. దీంతో మందుబాబులు, బెల్టు షాపులు వారు ముందురోజే మద్యాన్ని భారీగా డంపు చేస్తున్నారు. రేపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 180 కి పైగా వైన్, 26కు పైగా బార్లు మూతపడనున్నాయి. మరోవైపు చికెన్ దుకాణాలు రాత్రి సమయం, వేకువజామునే అమ్మకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఉదయగిరి హైవే పెద్ద చెరువుకు పోయే దారి వద్ద గేదెను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్( రేరా) నాదేళ్ల తిరుపతయ్య దంపతులకు ప్రమాదం తప్పింది. ఉదయగిరి (M) గడ్డంవారిపల్లికి చెందిన డిప్యూటీ కలెక్టర్ తన స్వగ్రామం నుంచి ఆత్మకూరులోని శుభకార్యానికి వెళుతుండగా అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

నెల్లూరు నగరాన్ని వాహనాలు చుట్టు ముట్టాయి. దసర పండుగ నేపథ్యంలో చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున చేరుకోవడం, ప్రజలు పలు అవసరాల నిమిత్తం నగరంలోకి రావడంతో ఆత్మకూరు బస్టాండ్, ఫ్లైఓవర్, స్టోన్ హౌస్ పేట, మినిబైపాస్, రైల్వే స్టేషన్ రోడ్లలో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి. ఎటుచుసిన వాహనాలు కదలక పోవడంతో వాహనదారులు నరకం అనుభవించారు. ఇదేమి నరకం రా బాబూ అంటూ.. జనం విసుగెత్తి పోయారు.

జిల్లా లో 2025 – 26 సం.కు గాను ఇన్స్పైర్ – మనక్ నామినేషన్లు విశేష స్పందన లభించినట్లు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలువగా నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 711 పాఠశాలలు నుంచి 2925 నామినేషన్లు అందినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లాలో 3 వేలు నామినేషన్ రాగా, నెల్లూరు జిల్లా 2925 నామినేషన్లు వచ్చాయన్నారు.

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదుర్గా అలంకార రూపంలో కొలువైన జగన్మాతను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కోవూరు జనార్ధన్ రెడ్డి ఆలయ మర్యాదలతో కలెక్టర్కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అది అక్టోబర్ 1వ తేదీ 2003. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు CM హోదాలో తిరుమలకు వస్తున్నారు. సరిగ్గా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు రాగానే ఒక్కసారిగా బాంబు శబ్దం. అందరూ తేరుకునేలోపే CM ఉన్న కారు గాల్లోకి ఎగిరి పడగా చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు నేటితో 22 ఏళ్లు. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో CM వ్యాఖ్యానించారు.

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంగళవారం SP అజితను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా జిల్లాకు వచ్చిన అజితకు MP బొకే అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై వారు చర్చించారు.

పండగలు వస్తే చాలు ప్రైవేట్ ట్రావెల్స్లో టికెట్ల ధరలు రేసు గుర్రాల్లా పరుగులు తీస్తాయి. సాధారణ రోజుల్లో కన్నా అదనంగా ఛార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తాయి యాజమాన్యాలు. దసరా నేపథ్యంలో AC బస్సులలో నెల్లూరు TO HYDకు రూ.1200, స్లీపర్ రూ.2150 వరకు పెంచేశారు. బెంగళూరుకు రూ.1,000, స్లీపర్ రూ.1600-2 వేల వరకు ధర ఉంది. అదే RTCలో NLR-HYDకు సూపర్ లగ్జరీ రూ.850, లగ్జరీ రూ.740, ఏసీ రూ.1330గా ఉంది.

జిల్లా ఔషద నియంత్రణ శాఖ AD కార్యాలయాన్ని రూ. కోట్లు వెచ్చించి నెల్లూరు పెద్దాసుపత్రి ఆవరణంలో దాదాపు 6 నెలల క్రితం నిర్మించారు. అయితే అధికారులు ఆ భవనాన్ని ప్రారంభించకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి జేమ్స్ గార్డెన్లో అద్దె భవనంలో ఉంటున్న కార్యాలయాన్ని సొంత భవనంలోకి తరలిస్తే పరిపాలపరంగా సులువుగా ఉంటుంది. అధికారులు స్పందించి కార్యాలయం వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.