India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్, కొచ్చిన్, గోవా పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు పత్తి రవీంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పదవులను పొంది పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఉచిత బస్సు తుస్సు – గ్యాస్ సిలిండర్లు బుస్సు అని టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సెటైర్లు వేశారు. పొదలకూరు మండలంలో ఆయన శనివారం పర్యటించారు. కూటమి పాలన బాగా లేదంటే కాకాణి సమక్షంలో ప్రజలు పెదవి విరిచారు. చంద్రబాబుకి మోసం చేయడంతోనే కలిసి వస్తుందని కాకాణి ఎద్దేవా చేశారు.
కావలి నియోజకవర్గం YCP నేత, కావలి మాజీ ఏఎంసీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసినట్లు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ లేఖను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఉచిత బస్సు తుస్సు – గ్యాస్ సిలిండర్లు బుస్సు అని టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సెటైర్లు వేశారు. పొదలకూరు మండలంలో ఆయన శనివారం పర్యటించారు. కూటమి పాలన బాగా లేదంటే కాకాణి సమక్షంలో ప్రజలు పెదవి విరిచారు. చంద్రబాబుకి మోసం చేయడంతోనే కలిసి వస్తుందని కాకాణి ఎద్దేవా చేశారు.
మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించి అన్ని రంగాల్లో ముందంజ వేయాలన్నది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మహ్మద్ ఫరూక్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
సమాజం సిగ్గుతో తలిదించుకునే ఘటన ఇది. రాపూరు(మ) తెగచెర్లకు చెందిన ఇద్దరు జీవనోపాధి కోసం మలేషియా వెళ్లి పోలీసులకు చిక్కి జైలులో మగ్గుతున్నారు. బాధితుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఓ దుండగుడు CMO నుంచి వచ్చానని కలెక్టర్తో అన్ని విషయాలు మాట్లాడానని వారిని నమ్మించాడు. మీ పిల్లలను ఇండియాకు రప్పించేందుకు ఖర్చు అవుతుందని వారి నుంచి రూ.50వేలు దోచేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీలో కీలకనేతగా కొనసాగుతున్న బీద రవిచంద్ర ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పట్లోనే ఆయనకు ఎమ్మెల్సీపై అధినేత నుంచి హామీ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బీద అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. రవిచంద్ర గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఎమ్మెల్సీగా వ్యవహరించారు.
నెల్లూరు వీఆర్సీ మైదానంలో చికెన్ & ఎగ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ చికెన్ మేళాను కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చికెన్ను నిర్భయంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మకండి అని ప్రజలకు సూచించారు. అలాగే జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చికెన్ టేస్ట్ చేశారు.
రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 22మంది వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇన్ఛార్జ్ అడ్మిన్ కార్యదర్శులకు కమిషనర్ సూర్యతేజ శుక్రవారం షోకాజ్ నోటీసులను జారీచేశారు. ప్రభుత్వం 100 శాతం పన్నులు వసూలు చేయాలని చెప్పినా జీరో వసూళ్లను చేయడంతో వారికి నోటీసులు జారీ చేశామన్నారు. మార్చి చివరికి 100% లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
శనివారం నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలను, పొదుపు సంఘాల మహిళలను సత్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, వివిధ పథకాల కింద ఆస్తుల పంపిణీ, ప్రొసీడింగ్స్ అందజేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.