Nellore

News August 20, 2024

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో వేగంగా పరిశ్రమలు స్థాపించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను పరిశ్రమల శాఖ జిఎం సుధాకర్‌ కమిటీ సభ్యులకు వివరించారు.

News August 20, 2024

వెంకటాచలం: ఈనెల 22 నుంచి డిగ్రీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

image

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు డిగ్రీ 5వ సెమిస్టర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని యూనివర్సిటీ ఉపకులపతి విజయ భాస్కర్ రావు తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ పరీక్షలకు హాజరు కావలసిందిగా ఆయన సూచించారు. అర్ధగంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాలని తెలిపారు.

News August 20, 2024

వెంకటాచలం: ఈనెల 22 నుంచి డిగ్రీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

image

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు డిగ్రీ 5వ సెమిస్టర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని యూనివర్సిటీ ఉపకులపతి విజయ భాస్కర్ రావు తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ పరీక్షలకు హాజరు కావలసిందిగా ఆయన సూచించారు. అర్ధగంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాలని తెలిపారు.

News August 20, 2024

నాయుడుపేటలో 22న ఇంద్ర సినిమా రీ రిలీజ్

image

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ ఇంద్ర సినిమాను ఈనెల 22న నాయుడుపేటలోని సీఎస్ తేజా థియేటర్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఉదయం 8గంటలకు సినిమా ప్రదర్శిస్తామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. సినిమాకి సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడదల చేసి ఉన్నారు. 2002 జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. మరోసారి సినిమా‌ రిలిజ్ కాబోతుండడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 20, 2024

నెల్లూరు: ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

image

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ ఉపాది హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నల్లబోతుల భాస్కర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. నందిపాడు ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఏపివోఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ లకు మెమోలు ఇస్తూ… ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

News August 20, 2024

నెల్లూరు: వృక్షానికి రాఖీ కట్టిన విద్యార్థులు

image

అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సురేశ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగను సోమవారం సందడిగా జరుపుకున్నారు. విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టారు. వృక్షానికి కూడా రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య సోదర భావాన్ని చాటడానికి రక్షాబంధన్ పండుగ ఎంతో దోహదపడుతుందన్నారు.

News August 20, 2024

నెల్లూరు జిల్లా యువకులకు అరుదైన అవకాశం

image

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ NCC వాలంటీర్లు యుగంధర్ రెడ్డి, లవకుమార్‌ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యేక్షంగా వీక్షించే అవకాశం దక్కించుకున్నారు. దేశ వ్యాప్తంగా 200మందిని, రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి ఈ అవకాశం కల్పించారు. వారిలో VSUకు చెందిన విద్యార్థులు యుగంధర్ రెడ్డి, లవకుమార్‌ ఉండడం విశేషం. దీంతో వారిని పలువురు అభినందించారు.

News August 20, 2024

నెల్లూరు: ఒక్కరోజే 330కు పైగా రిజిస్ట్రేషన్లు

image

నెల్లూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సోమవారం ఒక్కరోజే 330కి పైగా వివిధ రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత 3 నెలలుగా పదుల సంఖ్యలో జరిగిన రిజిస్ట్రేషన్లు.. సోమవారం మంచి రోజు కావడంతో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. నెల్లూరు ప్రధాన కార్యాలయంలో 80, స్టోన్ హౌస్ పేటలో 25, జిల్లాలోని మండల కేంద్రాల్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 225 కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

News August 20, 2024

నెల్లూరు: పొగాకు కొనుగోలు చరిత్రలోనే అత్యధిక ధర

image

నెల్లూరు పొగాకు కొనుగోలు వేలం కేంద్రంలో దక్షిణ ప్రాంత తేలికపాటి (SLS) నేలలో పండించే పొగాకు కొనుగోలు చరిత్రలో అత్యధికంగా కేజీ పొగాకు ₹358 రూపాయలు అమ్ముడయ్యిందని నిర్వహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా D.C పల్లిలోని పొగాకు వేలం కేంద్రంలో ప్రారంభంలో కేజీ ₹220 రూపాయలు కాగా ప్రస్తుతం అత్యధికంగా ₹358 రూపాయలు పలకడం పొగాకు కొనుగోలు చరిత్రలోనే రికార్డుగా రైతులు హర్షలు వ్యక్తం చేస్తున్నారు.

News August 19, 2024

నెల్లూరు: ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది: సీఎం

image

సోమశిల ప్రాజెక్టు సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు పోతే దానిని పెట్టకుండా 5 ఏళ్లు పాలించిందని విమర్శించారు. సోమశిల మరమ్మతులకు రూ. 95 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడున్న NDA ప్రభుత్వం ఎన్నికష్టాలు ఉన్నా అన్ని పనులు పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు.