India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయన వెంట జాయింట్ కలెక్టర్ కార్తీక్, తదితరులు ఉన్నారు.
నెల్లూరు ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నిర్వహించారు. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్ కి మొత్తం 73 ఫిర్యాదులు అందాయని ఎస్పీ చెప్పారు. ప్రతీ అర్జీని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
శాసనసభ్యుల కోటా నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన ఆ పార్టీ సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేశ్ను కలిశారు. ప్రజాసమస్యలను మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా రవిచంద్రకు లోకేశ్ అభినందనలు తెలిపారు.
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటున్న ఆయన వాటా కోసం డిమాండ్ చేసినట్లు ఆంధ్రజ్యోతి సంచలన <
నెల్లూరు జిల్లాలో ‘బీద’ కుటుంబానికి MLC పదవి వరించింది. టీడీపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్కు బీసీ కేటగిరిలో సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పటికే ఆ కుటుంబంలోని బీద మస్తాన్ రావు వైసీపీ నుంచి టీడీపీలోకి రాగానే రాజ్యసభ సీటు ఇవ్వగా, ఆయన సోదరుడు బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
పెళ్లి వేడుకల్లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రామలింగాపురంలోని ఓ కళ్యాణ మండపంలో వధూవరులు వినూత్నంగా అతిథుల కోసం ఇండియా న్యూజీలాండ్ క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు పెళ్లి వేడుకల్లోనే మ్యాచ్ను వీక్షించారు. వధూవరులు క్రికెట్పై తమ ప్రేమను ఇలా చాటుకున్నారని పలువురు ప్రశంసించారు.
హోలీ పర్వదినం సందర్భంగా పొదలకూరులోని ప్రభుత్వ నిమ్మ యార్డుకు మంగళవారం సెలవును ప్రకటిస్తూ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారని, ఇందులో భాగంగా వ్యాపార లావాదేవీలకు సుముఖత చూపించరన్నారు. ఇందుకోసం యార్డ్కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని యార్డ్ పరిధిలోని పరిసర ప్రాంతాల నిమ్మ రైతులు గమనించాలని కోరారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర పేరును టీడీపీ ఖరారు చేసింది. ఈయన కావలి నియోజకవర్గం అల్లూరు(M) ఇస్కపల్లిలో జన్మించారు. గతంలో ఆయన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, ఆక్వా అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన సోదరుడు బీద మస్తాన్రావు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.
నెల్లూరులోని పలు ప్రాంతాలలో మరికాసేపట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల నేపథ్యంలో పినాకినీ అవెన్యూ, ఆకుతోట హరిజనవాడ, సర్వేపల్లి కాలువకట్ట, చిల్డ్రన్ పార్క్, అయోధ్యా నగర్, మధురా నగర్, అపోలో ఆస్పత్రి ప్రాంతాలలో ఉదయం 8 నుంచి మ.1గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్, కొచ్చిన్, గోవా పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు పత్తి రవీంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పదవులను పొంది పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.