India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతసాగరం మండలంలో బుధవారం ఓ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోమశిల జలాశయంలో మృతదేహం నీటిపై తేలాడుతుండగా స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, జాలర్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ల పరిధిలో నెలకొన్న కనీస మౌలిక వసతులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్కు లేఖ రాశారు. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు రైల్వేస్టేషన్లో నీటి సమస్యలు, కావలి రైల్వే స్టేషన్ పరిధిలో చెత్త తరలింపు, వర్షాకాలంలో నీటి లీకేజీలు, ట్యాప్ కనెక్షన్లు, స్టేషన్ పరిధిలో బెంచీల ఏర్పాటు చేయాలని MP కోరారు.
నెల్లూరు నగరం ములుముడి వీధికి చెందిన మూడేళ్ల బాలిక ఆరుబయట ఆడుకుంటూ కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు చిన్న బజార్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ చిన్న బజార్ సీఐ ఆదేశానుపారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంట వ్యవధిలోనే తప్పిపోయిన ఆ బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
నెల్లూరు విద్యుత్ భవన్లోని స్కాడా బిల్డింగ్లో లైన్మెన్ దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టౌన్ ఎం.శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్ఈ వి.విజయన్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థకు లైన్మెన్, సిబ్బంది ఫిల్లర్ లాంటి వారని కొనియాడారు. విద్యుత్ సిబ్బంది ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.
☞ నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. 15 ఏళ్లు జైలు శిక్ష
☞ నెల్లూరు: ధైర్య సాహసాల పోలీస్ అధికారి ఇక లేరు
☞ మనుబోలు: స్వీట్స్తో శ్రీ విశ్వనాథ స్వామికి ఏకాంత సేవ
☞ ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలి: MLA ప్రశాంతి
☞ నెల్లూరు: చంద్రబాబుపై రైతు ఆగ్రహం
☞ ఉదయగిరి: సేల్స్ టాక్స్ అధికారుల దాడులంటూ పుకార్లు
☞ సంగం: రూ.3.5 లక్షల విలువ చేసే ఉత్సవ విగ్రహాల అందజేత
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం 79 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 27,613 మంది విద్యార్థులకుగాను 26,893 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో 1394 మంది విద్యార్థులకు 164 మంది విద్యార్థులు గైర్హజరయ్యారని ఆర్ఐవో తెలిపారు.
పోలీస్ విధి నిర్వహణలో ధైర్య సాహసాలు, నిజాయితీ గల విశ్రాంత అడిషనల్ ఎస్పీ భోగాది పృథ్వీ నారాయణ తుది శ్వాస వదిలారు. గతంలో నెల్లూరు నగర సీఐగా పనిచేశారని పోలీస్ సంఘం నాయకులు శ్రీహరి తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీపరుడని, ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వెంకటాచలం మండలం జోసఫ్ పేట వద్ద సర్వేపల్లి రిజర్వాయర్లో బాగా ఉబ్బిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పది రోజుల కిందట గొలగమూడి సమీపంలోని సర్వేపల్లి కాలువలో కొట్టుకు వచ్చిన సుమారు 35 ఏళ్ల మహిళా మృతదేహంగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పది రోజులుగా మహిళ మృతదేహం కోసం సర్వేపల్లి కాలువ, రిజర్వాయర్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
జలదంకి మండలం బ్రాహ్మణక్రాకకు చెందిన దేవరకొండ విజయ్ కుమార్ అనే నిందితుడికి పోక్సో, కిడ్నాప్ కేసులలో 15 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.22 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. 2017లో మండలానికి చెందిన ఓ బాలిక(14)ను ప్రేమ పేరుతో వేధించి, కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చేసిన సిబ్బందిని SP కృష్ణకాంత్ అభినందించారు.
ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని నెల్లూరు నగర డీఎస్పీ సింధు ప్రియా తెలిపారు. నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్లో 200 మంది ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనదారులు ప్రజలకు ఇబ్బందు లేకుండా వాహనాలు నడపాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.