India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దుస్తులు ఆరేస్తూ ప్రమాదవశాత్తూ జారి రెండో అంతస్తు నుంచి కిందపడి వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని బ్రాహ్మణవీధిలో ఆర్టీసీ ఉద్యోగి సునీల్, మనోజ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మనోజ తాము ఉంటున్న భవన రెండో అంతస్తులో దుస్తులను ఆరేయసాగారు. ఈ తరుణంలో మేడపై నుంచి తీగలను తాకుతూ కింద పడటంతో విద్యుదాఘాతానికి గురయ్యారు.
కోల్ కత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి న్యాయం కోరుతూ ప్రభుత్వ వైద్యశాలతోపాటు అన్ని ప్రైవేట్ వైద్యశాలల్లో వైద్యసేవలు నిలిపివేయనున్నారు. ఇవాళ ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు (24 గంటలు) అన్ని రకాల సాధారణ వైద్య సేవలను, అత్యవసరం కాని ఆపరేషన్లను నిలిపేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
నెల్లూరు నగరంలో ఇవాళ, రేపు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన సందర్భంగా ఆయన విజయవాడ నుంచి రైలు మార్గం ద్వారా నెల్లూరు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా నెల్లూరు కొండయ్యపాలెం గేట్ వద్దనున్న ఆర్అండ్బి గెస్ట్ హౌస్కు చేరుకున్న గవర్నర్.. అక్కడే బస చేయనున్నారు.
ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ లా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 5ఏళ్ల 4, 6వ సెమిస్టరు ఫలితాలు వెలువడినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా రీ వాల్యుయేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల కోర్సు విద్యార్థుల 1వ సెమిస్టర్ ఫలితాలు రావాలని, అవి కూడా విడుదల చేస్తారని పేర్కొన్నారు.
ఆగస్టు 15 సందర్భంగా లవంగంపై అతి సూక్ష్మ సైజులో జాతీయ జెండాను రూపొందించి మండలంలోని యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి బుధవారం అందరినీ అబ్బుర పరిచారు. లవంగంపై చిన్న సైజు కర్ర పుల్లను తయారుచేసి పేపర్ పై సూక్ష్మ సైజులో జాతీయ జెండాను తయారుచేసి గ్రామంలో ప్రదర్శించారు. పలువురు రాము ప్రతిభను అభినందించారు.
శ్రీహరికోటలోని షార్ నుంచి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ను సైంటిస్టులు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.
పేదవాని కడుపు నింపే అన్న క్యాంటీన్ను నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ప్రతి పేదవానికి కూడు, గుడ్డ, నీడ అందించాలనే ఎన్టిఆర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రతిష్ఠ చేశారని మంత్రి వెల్లడించారు. అనంతరం అన్న క్యాంటీన్లో టిఫిన్ చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన అమీర్కు ప్రత్యేక అభినందనలు ఉన్నతాధికారులు తెలిపారు. ఆగస్టు 15న అమరావతిలో జరిగిన
పంద్రాగస్టు వేడుకలకు ఎన్సీసీ విన్యాసాల విభాగం తరపున నెల్లూరు నుంచి షేక్ అమీర్ ఎంపికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జెండా వందనం చేశారు. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన షేక్ అమీర్ తన వారితో మైదానంలో నిర్వహించిన కవాతు అబ్బురపరిచింది.
కావలి మాజీ ఎమ్మెల్యే కారు చోదకుడిగా పని చేస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో స్థలం కొనుగోలుతో పాటు ఇలాగ అనేక అక్రమాలు పాల్పడిన వ్యక్తికి అప్పటి తాహశీల్దార్ సహకరించారన్న సమాచారంతో తహసీల్దారుపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. వైసీపీ నాయకులతో అంటకాగి అక్రమాలకు పాల్పడిన వారి పాపాలు పండుతున్నాయి. ఈ క్రమంలో గతంలో పనిచేసిన ఓ తాహశీల్దార్పై సస్పెండ్ వేటు పడనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.