Nellore

News October 29, 2025

కావలిలో భారీ వర్షపాతం నమోదు

image

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.

News October 29, 2025

నెల్లూరులో Photo Of The Day

image

నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాత్రి, పగలు, వర్షం అనే తేడా లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. నెల్లూరు రూరల్ కొండ్లపూడిలోని పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆ ఇద్దరూ అక్కడే భోజనం చేసి వారికి భరోసా కల్పించారు.

News October 28, 2025

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 28, 2025

శ్రీహరికోట: షార్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11.

News October 28, 2025

నెల్లూరులో విద్యార్థుల మిస్సింగ్.. గూడూరులో ప్రత్యక్షం

image

ధనలక్ష్మిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న రాకేష్, లోకేష్ ఈ నెల 23న అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. వారిద్దరూ గూడూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లిన ఆ ఇద్దరు విద్యార్థులు గూడూరులో ఉండగా.. సాంకేతికత ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు.

News October 28, 2025

భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు ఇవే.!

image

☞ నెల్లూరు కలెక్టరేట్: 086102331261, 7995576699
☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు- 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు- 9100948215
☞ కావలి RDO ఆఫీసు-7702267559
☞ రాష్ట్ర టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101.
☞ జిల్లా యాంత్రాంగం తుఫాన్ ధాటికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంది.

News October 28, 2025

కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

image

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు

News October 27, 2025

జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ పరిపాలన అధికారి తుమ్మా విజయ్ కుమార్ బొకే అందించి అభినందించారు. అనంతరం పలు సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయ్ తెలిపారు.

News October 27, 2025

రేపు జూనియర్ కళాశాలలకు సెలవు: నెల్లూరు RIO

image

నెల్లూరు జిల్లాలో మంగళవారం అన్ని జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు RIO వరప్రసాద్ రావు తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 27, 2025

లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

image

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్‌ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.