India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు కలెక్టర్ ఆనంద్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. సాధారణ బదిలీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 5.58 లక్షలు స్వాహ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులుకు ఫిర్యాదు అందింది. ఉద్యోగ వేటలో ఉన్న మూలపేటకు చెందిన ఓ యువకుడు ఫోన్లో పరిచయమైన ఓ యువతి చెప్పిన మాటలకు లోబడి ఆమె ఖాతాకు రూ.5.58 లక్షలను బదిలీ చేశాడు. తర్వాత ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
నెల్లూరు జిల్లాలో 185 Jr.కళాశాలలు ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 100 రోజులు గడిచినా ల్యాబ్ల బూజు దులిపే పనిలేదు. రసాయనాలు లేక, సదుపాయాలు లేని పరిస్థితి. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కేవలం థియరీపై దృష్టి పెడుతున్నారు. పరీక్షలకు ముందు ల్యాబ్లు తెరిచి పూర్తి మార్కులు వేసి దగాకు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రూ.916 కోట్లతో మొదటి దశ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూ సేకరణ, OLS సర్వే పూర్తి చేయడం జిల్లా యంత్రాంగంపై ఉంది. AAI అధికారులు కొండలు తొలగింపు, కాలువ మార్పు, చెరువు పూడ్చివేత వంటి మార్పులు సూచించారు. మొత్తం 1379 ఎకరాల్లో 669 ఎకరాలు సేకరించారు. దామవరం మేత పోరంబోకు భూములు, కౌరు గుంట రైతులకు పరిహారం విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి.
విజయ డైరీ పాల సేకరణ ధరలు పెంచనున్నట్లు పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు కేజీ వెన్నకు రూ.775 లెక్కన లీటర్ పాలకు రూ. 77.50, సొసైటీ నిర్వహణకు రూ.1.50 ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి కేజీ వెన్నకు రూ.785 లెక్కన లీటర్ పాలకు రూ. 78.50, సొసైటీ నిర్వహణకు రూ.1.50 కలుపుకొని రూ.80 ఇవ్వనున్నట్లు తెలిపారు.
వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి కుమ్మరివారి ఇంటి నుంచి అమ్మవారి ప్రతిమను మెట్టినిల్లు అయిన చాకలివారి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ దిష్టి చుక్క, కళ్లు పెట్టారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆపై ఊరేగింపుగా పోలేరమ్మ ప్రధాన గుడి వద్దకు తీసుకు వచ్చి ప్రతిష్టించారు. నయన మనోహరంగా ఉన్న పోలేరమ్మను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.
కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్లో నెల్లూరు నగరానికి 18వ ర్యాంకు వచ్చింది. 3 నుంచి 10 లక్షల విభాగంలో నగరానికి ఈ అవార్డు వరించింది. దీంతో స్వచ్ఛ సర్వేక్షన్లో18వ ర్యాంకు రావడానికి కృషిచేసిన అధికారులు, మున్సిపల్ కార్మికులకు కలెక్టర్, నెల్లూరు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.
కలవాయి మండల పరిధిలోని తోపుగుంట వద్ద చిరుత పులి కలకలం రేపింది. తోపుగుంట – కొండాపురం మధ్య ప్రాంతంలో పర్ల కొండ గ్రామానికి చెందిన పూలే పెంచలయ్య అనే వ్యక్తి కలువాయిలోని ఓ బ్యాంకులో విధులు నిర్వహిస్తుంటారు. విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా తోపుగుంట వద్ద ఉన్న సోమశిల – పొదలకూరు రోడ్డును చిరుత పులి రోడ్డు దాటుతుండగా గమనించి స్థానికులను ఆయన అప్రమత్తం చేశారు. పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది.
నేపాల్లో చిక్కుకున్న నెల్లూరు జిల్లా వాసులకు రక్షణగా ప్రభుత్వం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా వాసులు ఎవరైనా నేపాల్లో ఉంటే వారి వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్లో తెలియపరచాలని కోరారు. వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్కు https://cets.apsche.ap.gov.in,
https://vsu.ac.in వెబ్ సైట్లను సందర్శించాలని అడ్మిషన్స్ డైరెక్టర్ హనుమారెడ్డి సూచించారు.
Sorry, no posts matched your criteria.