Nellore

News November 30, 2025

నెల్లూరు జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇచ్చేలా DyEOs, MEOs, HMs అందరూ చర్యలు తీసుకోవాలని డీఈవో బాలాజీ రావు ఆదేశించారు. నెల్లూరులో సోమవారం జరగాల్సిన PGRS కూడా రద్దు చేశారని తెలిపారు.

News November 30, 2025

వర్షాలు.. మంత్రి ఆనం కీలక ఆదేశాలు

image

భారీ వర్షాలు, దిత్వా తుఫాను నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి యువరాజ్ IAS, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ విభాగాలతో చర్చించారు. సోమశిల, కండలేరు, సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. వాగులు, జలాశయాల వద్ద ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఆదేశించారు.

News November 30, 2025

నెల్లూరుకు చేరుకున్న NDRF బృందాలు

image

తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నెల్లూరు జిల్లాకు NDRF బృందాలు చేరుకున్నాయి. డీఎస్పీ ఆఫీస్ దగ్గరకు NDRF టీం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటికి రావొద్దని సూచిస్తున్నారు.

News November 30, 2025

13న నెల్లూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం డిసెంబర్ 13వ తేదీన ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదల, వైద్య ఆరోగ్యశాఖ, సాంఘిక సంక్షేమంపై చర్చిస్తారన్నారు. 2026-27 బడ్జెట్ అంచనాలపైనా చర్చ జరుగుతుందన్నారు.

News November 30, 2025

తెరపైకి దక్షిణ నెల్లూరు జిల్లా..!

image

స్లాంగ్, కల్చర్‌కు పూర్తి విభిన్నంగా ఉండే గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారు. రాపూరు, కలువాయి, సైదాపురం సైతం ఇదే జిల్లాలో విలీనం చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ‘రాయలసీమ వద్దు.. నెల్లూరు ముద్దు’ అనే నినాదంతో సోషల్ మీడియా వేదికగా ఉద్యమిస్తున్నారు. నెల్లూరులో కలిపి వీలు లేకుంటే.. గూడూరు కేంద్రంగా దక్షిణ నెల్లూరు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ను అక్కడి ప్రజలు తెరపైకి తెచ్చారు.

News November 30, 2025

సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయ్యాలి : SP అజిత

image

సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, కోఆర్డినేటర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్ మరియు బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.

News November 30, 2025

సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయ్యాలి : SP అజిత

image

సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, కోఆర్డినేటర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్ మరియు బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.

News November 30, 2025

సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయ్యాలి : SP అజిత

image

సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, కోఆర్డినేటర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్ మరియు బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.

News November 30, 2025

సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయ్యాలి : SP అజిత

image

సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, కోఆర్డినేటర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్ మరియు బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.

News November 30, 2025

సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయ్యాలి : SP అజిత

image

సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, కోఆర్డినేటర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్ మరియు బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.