India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వింజమూరు మండలంలో ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకోనున్న సీఎం, ముందుగా నార్త్ ఎస్సీ కాలనీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాతూరు చెరువు బండ వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి, మధ్యాహ్నం ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

జిల్లాలో ఇద్దరు MLAలను మంత్రి పదవులు ఊరిస్తున్నాయి. కోవూరు MLA ప్రశాంతి రెడ్డి మంత్రి పదవి ఆశిస్తుండగా నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి కూడా రేసులో ఉన్నారు. YCP నుంచి వచ్చిన వీరికి మంత్రి పదవులు వస్తే సీనియర్లు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకరికి మోదం.. మరొకరికి ఖేదంగా మారుతోంది. అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపినా TDPలో ముసలం మొదలై సార్వత్రిక ఎన్నికల్లో ఫలితం మారే అవకాశం ఉంది.

కొడవలూరు మండలం గండవరం మెయిన్ రోడ్డుపై దారుణం జరిగింది. గడ్డి మిషన్ కోసం డీజిల్ తీసుకువెళ్తున్న వెంకటేష్ (పెద్ద పుత్తేడు), బాల వెంకయ్య (సంగం మండలం) అనే ఇద్దరిని దుండగులు కత్తులతో నరికి చంపారు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా జరిగిన ఈ దాడితో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాత కక్షలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మర్రిపాడు మండలం నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుకు గురై గోగుల నవనీత్ (5) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

జిల్లాలో ధాన్యం సేకరణలో మిల్లర్లదే ఇష్టారాజ్యంగా ఉంది. ధాన్యం సేకరణకు తేమ శాతం, తరకలు, రాళ్లు, లారీలు ఏర్పాటు చేయకపోవడం వంటి కొర్రీలు పెట్టి రైతులకు చుక్కలు చూపుతున్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేయగా 11 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. సాధారణ రకానికి రూ.20,300 మద్దతు ధర ఉంటే దళారులు రూ.17వేలుకు కొనుగోలు చేస్తున్నారు. గొనె సంచులు, కొరత కల్లాలు రైతులను వేధిస్తున్నాయి.

IPL సీజన్ మొదలైన నేపథ్యంలో జిల్లా పరిధిలో ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్ గురించి ఎస్పీ డా. అజిత వేజెండ్ల యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్కు బానిసలై కొంత మంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ కేవలం వినోదం కోసం చూడాలి అని, బెట్టింగ్ వైపు మొగ్గు చూపితే అది ఊబి లాంటిది అని, ఇంకా వెనక్కి రావడం కష్టం అని అన్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో CM చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఉదయం 11.30గంటలకు DVసత్రం(M) నెల్లబల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన పుదూరుకు చేరుకుని టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు. తర్వాత లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేస్తారు. మధ్యాహ్నం బిరదవాడ వద్ద TDP నాయకులతో సమావేశం, సాయంత్రం 4.45గంటలకు తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో జరిగే P-4 కార్యక్రమానికి హాజరవుతారు.

మర్రిపాడు మండలం నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుకు గురై గోగుల నవనీత్ (5) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

కావలి రూరల్ వెంకయ్యగారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అంకయ్య కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి కేసు నమోదు చేశారు.

గుంటూరులో ఓ వ్యక్తి 3వ అంతస్తు నుంచి పడి దుర్మరణం చెందాడు. నెల్లూరు(D) కోవూరు(M) ఇనమడుగుకు చెందిన అశోక్ కుమార్ రెడ్డి(29) గుంటూరులోని ముత్యాలరెడ్డి నగర్లో ఉంటున్నాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కింద పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.