India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు నగరం కపాడిపాలెంలో చోటుచేసుకుంది. కపాడిపాలెంకు చెందిన శ్రావణ్ కారు డ్రైవర్గా భార్య సుమాంజలి నర్స్గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇటీవల వారి మధ్య చిన్నపాటి గొడవ జరగ్గా భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాప చెందిన శ్రావణ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నెల్లూరు జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎగ్జామ్స్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మొత్తం 7 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 86.4% మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4102 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3546 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 556 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు 13 జిల్లాల్లో 92 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే అత్యధికంగా విశాఖ జిల్లా వారు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి అత్యల్పంగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో 3546 మంది పరీక్షలకు హాజరై 86.4గా నమోదైన సంగతి తెలిసిందే. పరీక్షలు జరుగుతాయా.. లేదా అన్న మీమాంస కూడా పరీక్షకు రాకపోవడానికి ఓ కారణమని కొందరు భావిస్తున్నారు.
నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహం జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా నెల్లూరులో జిల్లా ఎస్పీ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం పర్యటనను విజయవంతం చేశారు. దీంతో అందరికీ జిల్లా ఎస్పీ దన్యవాదాలు తెలియజేశారు.
బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో చికెన్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ ధర రూ.93 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.190గా ఉంది. అదే విధంగా లేయర్ చికెన్ ధర రూ.127గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
CM చంద్రబాబు ఆదివారం నెల్లూరుకు రానున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.10 గంటలకు కనుపర్తిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్కు హెలీకాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి గొలగమూడి సమీపంలోని వీపీఆర్ కన్వెన్షన్లో టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి హెలీప్యాడ్ చేరుకుని 2.15 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు.
మార్చి 1వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ అన్నారు. శనివారం డీకే బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్, అడిషనల్ చీఫ్ సూపరిటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారుల శిక్షణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆర్ఐఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 53,200 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు.
నెల్లూరు నగరం దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వర స్వామిని దర్శించారు. అనంతరం అమ్మవారికి నవావరణ పూజ నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
✒ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: నెల్లూరు కలెక్టర్
✒ త్వరలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరు: మంత్రి నాదెండ్ల
✒ కందుకూరు: RTCబస్లోనే అనంత లోకాలకు
✒ నెల్లూరులో 40 కిలోల వెండి స్వాధీనం
✒ బుచ్చి గోదాములో మంత్రుల తనిఖీలు
✒ నెల్లూరు: మహిళా అధికారుల ఫైట్ (వీడియో)
✒ నెల్లూరు జిల్లా ఎస్పీ హెచ్చరిక
✒ కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు
✒ నెల్లూరు: వెబ్ సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు
నెల్లూరులో రేపు(ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని కోరారు.
Sorry, no posts matched your criteria.