Nellore

News August 10, 2024

మంత్రి నారాయణతో వైసీపీ ఎమ్మెల్సీలు కరచలనం

image

నెల్లూరు దర్గామిట్టలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణ మీద అనేక సార్లు విమర్శలు చేస్తుంటారు. అయినా మంత్రి పట్టించుకోకుండా కరచలనం ఇచ్చి ఆత్మీయంగా పలకరించారు.

News August 10, 2024

జడ్పీ సమావేశానికి క్యూకట్టిన మంత్రులు, ప్రజాప్రతినిధులు

image

నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి సర్వసభ్య సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు.

News August 10, 2024

నెల్లూరు: భిన్న ధ్రువాలు కలిసిన వేళ

image

నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని శాలువా పుష్పగుచ్ఛం అందించి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ సత్కరించారు. శనివారం జడ్పీ సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చాలాకాలం తర్వాత ఈ సఖ్యత నెల్లూరు నగరంలో చర్చాంశనీయంగా మారింది.

News August 10, 2024

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

నెల్లూరు నగరంలోని దర్గామిట్ట వద్ద గల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన మెనూపై ఆరా తీసారు. వసతి గృహంలో ఉన్న స్టాకును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు.

News August 10, 2024

సంగంలో పాల డైరీ ప్రారంభించిన మంత్రి ఆనం

image

సంగం మండలం, దువ్వూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన ఓ పాల డైరీని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ప్రారంభించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఈ డైరీని నిర్మించడం అభినందనీయమని నిర్వాహకులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News August 10, 2024

సోమశిలకు రోజురోజుకి పెరుగుతున్న వరద

image

సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి శనివారం ఉదయం 6 గంటలకు 11,290 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరథ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 15.733 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 17, 18 స్లూయిస్ ద్వారా పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 85 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నట్లు తెలిపారు.

News August 10, 2024

కోవూరు : బాలికను గర్భవతిని చేసిన కారు డ్రైవర్

image

బాలికపై అత్యాచారం చేసి గర్భిణిని చేసిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి మధ్యలో ఆపేసి ఇంటి దగ్గరే ఉంటోంది. ఆమె సమీప బంధువు కారు డ్రైవర్ K శ్రీనివాసులు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు నలతగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భిణిగా వైద్యులు నిర్ధారించారు. బాలికను నిలదీయగా నిజం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సోకేసు నమోదు చేశారు.

News August 10, 2024

ఘనంగా పెంచలకోనలో కుంకుమార్చన 

image

రాపూర్ మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి అభిషేకం, సాయంత్రం ప్రాకారోత్సవం, సామూహిక కుంకుమర్చన సేవ తదితర పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

News August 9, 2024

నెల్లూరు జిల్లాలో బదిలీ అయిన SIలు వీరే..

image

నెల్లూరు జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీచేస్తూ ఎస్పీ కృష్ణ కాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వారి వివరాలు:
➽ కలిగిరి ఎస్ఐ- సంతోష రెడ్డి
➽ కొండాపురం ఎస్ఐ-మహేంద్ర
➽ కందుకూరు టౌన్ ఎస్ఐ-ఆనంద భాస్కర్
➽ విడవలూరు ఎస్ఐ-రాజా
➽ రాపూరు ఎస్ఐ-మాలాద్రి
➽ ఆత్మకూరు ఎస్ఐ-ముత్యాలరావు
➽ ఏఎస్ పేట ఎస్ఐ-ప్రసాద్ రెడ్డి
➽ సోమశిల ఎస్ఐ సుబ్బారావును వీఆర్‌కు బదిలీ చేశారు.

News August 9, 2024

తాము పార్టీ మారడం లేదు: జడ్పీ ఛైర్పర్సన్ అరుణమ్మ

image

తాము పార్టీ మారుతున్నట్టు వస్తున్న కథనాలపై జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపీ సీనియర్ నేత ఆనం జయకుమార్ రెడ్డి స్పందించారు. తాము ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారమని స్పష్టం చేశారు. తాము ఈ స్థితిలో ఉండడానికి వైసీపీనే కారణమని, పార్టీ అధిష్ఠానానికి కట్టుబడి ఉన్నామన్నారు.