India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్టు సౌత్ గెస్ట్హౌస్ వద్ద రెన్నోవేషన్ వర్క్లో భాగంగా వెల్డింగ్ పనులు జరుగుతుండగా ఒక గదిలో షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన పోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని పోర్టు అధికార వర్గాలు తెలిపాయి.
జిల్లాలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో గ్రూప్-2 పరీక్షల కోఆర్డినేషన్ అధికారి, కందుకూరు సబ్ కలెక్టర్ టి. శ్రీపూజ, డిఆర్వో ఉదయభాస్కర్రావుతో కలిసి పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలందరూ సంతృప్తి చెందేలా పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాం ప్రసాద్ సిసోడియా గురువారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, కావలి, ఆత్మకూరు RDOలు స్వాగతం పలికారు. రేపు రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశ మవుతారని జిల్లా సమాచార శాఖ అధికారి సదారావు ఒక ప్రకటనలో తెలిపారు.
సోమశిల ప్రాజెక్టు నుంచి గత 2 రోజులుగా 6 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగింది. అయితే, పెరిగిన నీటి ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించిన అధికారులు ఇవాళ ఉదయం 6 క్రస్ట్ గేట్లను మూసివేశారు. దీంతో నీటి విడుదల పూర్తిగా నిలిపివేయబడింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ, భవిష్యత్ చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు.
దామరమడుగు పల్లిపాలెం గ్రామానికి చెందిన పొట్లూరి ప్రసాద్కు పోక్సో కేసులో ఐదేళ్లు జైలు శిక్ష రూ.37 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. మే 20, 2021న పల్లిపాలెంకు చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ ప్రేమించకపోతే.. తన పేరు రాసి చనిపోతానని బెదిరించాడు. ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జీ కృష్ణకాంత్ అభినందించారు.
కలిగిరి మండలం టీడీపీ కార్యాలయం సమీపంలో పెద్దన్నలూరుకు చెందిన ఓ నాయకుడు బహిరంగంగా పెదకొండూరు వీఆర్వో నరేశ్ను చొక్కాపట్టుకొని దుర్భాషలాడి దౌర్జన్యంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే జరిగిన ఘటనపై వీఆర్వో నరేశ్ కలిగిరి తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. VROపై జరిగిన దౌర్జన్యంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్కు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తేదీన నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదని ఆరోపించారు.
జిల్లాలోని గూడూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, కోట, ఆత్మకూరు, వెంకటగిరి, S.పేట, N.పేట న్యాయ సేవ అధికార కమిటీల పారా లీగల్ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గీత ఒక ప్రకటన తెలిపారు. 25 లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా కోర్టుకు అందించాలన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ సేవకులు, లా విద్యార్థులు దరఖస్తు చేసుకోవచ్చన్నారు.
రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 22726 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు పలు పరిశ్రమలు ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలకు SIPC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న SIPC భేటీలో ఆమోదించాల్సి ఉంది. కృష్ణపట్నంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ (రిలయన్స్) రూ.1,566 కోట్లతో మెగా ఇండస్ట్రియల్ పార్కు స్థాపించనుంది. దీంతో 400 మందికి ఉపాధి కలగనుంది.
Sorry, no posts matched your criteria.