India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కే.సుమన్, సహాధ్యక్షులు సంపత్ కుమార్ కోరారు. నెల్లూరు జిల్లాలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహీధర్ బాబు, జిల్లా జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి పేట రాజేశ్ పాల్గొన్నారు.
జగన్ 2.O ప్రభుత్వం రాగానే అతిగా ప్రవర్తించే వారందరి లెక్కలు తేల్చుతామని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. పొదలకూరు(M) బిరుదవోలులో శనివారం ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కాకాణి హామీ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమైనట్లు ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బోర్డు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని ఎగ్జామినర్ చీఫ్ అడిషనల్ సూపర్డెంట్ను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విద్యార్థులను ఇబ్బంది పెడితే ఆ కళాశాలపై చర్యలు తప్పవన్నారు.
చంద్రబాబు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హామీలన్నీ పేపర్లకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.
రామాయపట్నం పోర్ట్ ఆధారంగా 6 వేల ఎకరాలలో BPCL తలపెట్టిన రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుకు ఆదిలోనే గండం ఏర్పడింది. BPCL కోసం తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని సముద్ర తీర గ్రామాలకు చెందిన మత్స్యకార రైతులు శుక్రవారం తేల్చి చెప్పారు. కరేడు పంచాయితీలోని అలగాయపాలెంలో రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాలెం తదితర గ్రామాల మత్స్యకారులు పెద్ద సంఖ్యలో సమావేశమై ప్రభుత్వం చేసే బలవంతపు భూసేకరణను ప్రతిఘటించాలని తీర్మానించారు
పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు ముందు టీచర్ హేళనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేసి ఉపాధ్యాయుడు వీర రాఘవులుపై కేసు నమోదు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రధాన భాగస్వాములైన ఎగ్జామినర్లు, చీఫ్, అడిషనల్ సూపరింటెండెంట్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం తుది విడత పరీక్ష కేంద్రాల చీఫ్ అడిషనల్, చీఫ్ సూపరింటెండెంట్లకు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆర్ఐఓ సూచించారు. పరీక్ష పై ఆపోహలు, ఆరోపణలు రాకుండా చూడాలని కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
కార్పొరేషన్ లోన్ల కోసం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పేర్కొన్నారు. శుక్రవారం సంగం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు లక్షల సబ్సిడీతో మండలానికి ఒక జనరిక్ మెడిసిన్ యూనిట్ మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాలెట్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.