India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలు బదిలీపై నెల్లూరు జిల్లాకు వచ్చారు. నెల్లూరు నవాబుపేటకు అన్వర్ బాషా, దర్గామిట్టకు ఎం.రోశయ్య, ఆత్మకూరుకు జి.గంగాధర్ రావు, గూడూరు సర్కిల్ కు జి. మంగారావు, గూడూరు వన్ టౌన్కు కే. శేఖర్ బాబు, వాకాడుకు ఎస్.హెచ్ హుస్సేన్ బాషా, నాయుడు పేటకు ఎం.బాబీ, సుళ్లూరుపేటకు ఎం.మురళీకృష్ణ బదిలీ అయ్యారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు.
డక్కిలి మండలం కమ్మవారిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సతీమణి సింధు బుధవారం ప్రకటించారు. కమ్మవారిపల్లి గ్రామంలో నిర్వహించిన టీడీపీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ.. తన భర్త కురుగొండ్ల రామకృష్ణ జన్మించిన కమ్మవారిపల్లి (పాతనాలపాడు) గ్రామంలో మౌళిక వసతులు కల్పించడంతో పాటు జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామన్నారు.
జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులకు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పరిమళ తెలిపారు. శిక్షణ సమయంలో భోజన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో వివరాలు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు ఆఫీసు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చేనేత కార్మికులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మహత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించి, చేనేత కార్మికులకు అండగా నిలవాలన్నారు.
నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరుతూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కి విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రిని ఎంపీ కలిసారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే సెంటర్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ లేఖ అందించారు. అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను అందులో వివరించారు.
జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన సభ్యత్వంలో నెల్లూరు జిల్లాలో ఉదయగిరి మూడో స్థానంలో నిలిచిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగినేని కాశీరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జనసేన సభ్యత్వాలు 4 విడుదలలో ఉదయగిరి నియోజకవర్గంలో 4 వేలు పైచిలుకు సభ్యత్వాలు వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బుధవారం లోక్సభలో అమృత్ భారత్ స్టేషన్ పథకంపై పలు ప్రశ్నలు వేశారు. ఈ పథకం కింద జిల్లాల వారీగా పునర్నిర్మాణానికి ఎంపికైన రైల్వే స్టేషన్ల వివరాలు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈ స్టేషన్ల అభివృద్ధికి కేటాయించిన, పంపిణీ చేసిన మొత్తం నిధులు ఎన్ని అని ప్రశ్నించారు.
ఇందుకూరుపేట మండలం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వై కృష్ణ బుధవారం మృతి చెందాడు. ఇటీవల కానిస్టేబుల్ కృష్ణ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదానికి గురై గత పది రోజుల నుంచి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుటుంబానికి తోటి మిత్రులు, సన్నిహితులు, కుటుంబ స్నేహితులు, పోలీస్ శాఖ సిబ్బంది ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమరావతిలో గత ఐదేళ్లుగా ఏపుగా పెరిగిన ముళ్లపొదలను జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటలతో అమరావతికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. 30 రోజుల్లోగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి కోసం 38 రోజుల్లోనే 34 వేలు ఎకరాలు రైతులు ల్యాండ్ పోలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారన్నారు.
డయేరియాతో దుగరాజపట్నం మెరైన్ పోలీసు స్టేషన్ హోంగార్డు రాజేశ్(34) మంగళవారం రాత్రి మృతి చెందాడు. వాకాడు మండలం తూపిలిపాళెం గ్రామానికి చెందిన హోంగార్డు రాజేశ్ స్టేషన్లో సెంట్రీ విధుల్లో ఉండగా వాంతులు, విరేచనాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్ మృతిపట్ల మెరైన్ SI ఈశ్వరయ్య, ASIలు, సిబ్బంది సంతాపం తెలిపారు.
Sorry, no posts matched your criteria.