India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడి చేసిన ఘటన వెంకటాచలం మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం..కసుమూరుకు చెందిన మస్తాన్బాబు ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఓ యువతి నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనేకసార్లు లైంగికంగా వేధించాడని అన్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా ఒప్పుకోకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
V.V.పాలెం మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. 167B హైవే సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి బైకును ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మయ్య(60)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
కావలి కేంద్రంగా స్టాక్ మార్కెట్ పేరుతో జరిగిన భారీ మనీ స్కాం వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుల్ పాత్ర ఉండటంతో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదేశాలు జారీ చేశారు. మనీ స్కాంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ అనంతరం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణ, జ్యోతి అయోధ్య కుమార్ లను సస్పెండ్ చేశారు.
టెన్త్ అర్హతతో నెల్లూరు డివిజన్లో 63 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీలోగా https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కావలి పట్టణ శివారు ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై గుండెమడకల రమేశ్ (45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు కావలి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మర్రిపాడులోని నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై కస్తూర్బా గాంధీ కళాశాల సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నన్నోరుపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి(16) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ నాయుడుపేటలో ఓ ఇంటిని బాడుగకు తీసుకొని బయట ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
✒ శంకరనగరంలో తల్లిని కాపాడబోయి.. కొడుకు మృతి
✒ బెడ్ కాఫీ బదులు బెడ్ లిక్కర్: కాకాణి
✒విడవలూరులో రోడ్డు విస్తరణ వద్దంటూ ఆందోళన
✒కందుకూరు MROతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం
✒అల్లూరు దర్గా సమాధిలో కదలికలు
✒కొండాపురంలో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి
✒నెల్లూరు ప్రజలరా.. ఆ లింక్ క్లిక్ చేశారో ఖాతా ఖాళీ
అనంతసాగరం మండలం శంకర్ నగరం గ్రామం వద్ద కొమ్మలేరు వాగులో మునిగి ఉప్పలపాటి ఆకాష్ అనే యువకుడు మృతి చెందాడు. వాగు సమీపంలో గడ్డి కోసేందుకు వెళ్లిన తల్లి వాగులో పడిపోగా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి వాగులో మునిగి ఆకాశ్ మృతి చెందాడు. కళ్లముందే కొడుకు వాగులో మునిగి చనిపోవడంతో తల్లి, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బీటెక్ చదివిన ఆకాశ్ మృతి చెందడంతో శంకర్ నగరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివిధ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు SP జి.కృష్ణకాంత్ సోమవారం సూచించారు. బ్యాంకుల పేర్లతో పంపిస్తున్న అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వలవేస్తారని అన్నారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.