Nellore

News July 31, 2024

నెల్లూరు: బంతి తోటలో అశ్లీల ఫ్లెక్సీలు

image

వరికుంటపాడు మండలం తిమ్మా రెడ్డిపల్లి సమీపంలో బంతి తోటలో హీరోయిన్ల అశ్లీల చిత్రాలతో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. భోగ్యంవారిపల్లికి చెందిన ఓ రైతు తన పొలంలోని పంటకు దిష్టి తగలకుండా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ తోట నేషనల్ హైవే పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ ఫ్లెక్సీలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

News July 31, 2024

ముత్తుకూరు: కారులోనే వ్యక్తి మృతి

image

ముత్తుకూరు మండల కేంద్రంలోని పోస్టాఫీస్ సమీపంలో బుధవారం రాత్రి ఆగి ఉన్న కారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. కారు ఇంజిన్ ఆన్‌లో ఉండగానే సీటులోనే మృతి చెందాడు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిది హైదరాబాద్ నగరం అమీర్ పేటకు చెందిన బాలన్నగారి ద్వారకనాధ్ రెడ్డిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News July 31, 2024

నెల్లూరు జిల్లాలో పలువురు DSPలు బదిలీ

image

నెల్లూరు జిల్లాలోని పలువురు DSPలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గూడూరు DSP సూర్యనారాయణరెడ్డి, నాయుడుపేట DSP శ్రీనివాస రెడ్డి, విజయభాస్కర్( నెల్లూరు రైల్వే)ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయగా, నెల్లూరు CID CCS రామక్రిష్ణాచారిని తిరుపతి ట్రాఫిక్ DSPగా, ఆత్మకూరు DSP శ్రీనివాసరావును నెల్లూరు SB DSPగా, ఏ.శ్రీనివాసులు( ట్రాఫిక్ DSP నెల్లూరు)ను పెనుకొండకు బదిలీ చేశారు.

News July 31, 2024

నెల్లూరు: వేగంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు

image

నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా 38 స్టేషన్‌లో 309 కి.మీ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఈసారి బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేంద్రం ఇచ్చింది. రాష్ట్రం తన వాటా ఇవ్వనుంది. దర్శి, పొదిలి ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ చేశారు. జిల్లాలో వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంటకగిరి మండలాల మీదుగా 15 స్టేషన్‌లలో పనులు సాగునున్నాయి. అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు.

News July 31, 2024

నెల్లూరు: పాఠశాలల మేనేజ్‌మెంట్ కమిటీలకు ఎన్నికలు

image

ప్రభుత్వ పాఠశాలల మేనేజ్‌మెంట్ కమిటీలకు ఎన్నికలు ఆగష్టు8 న జరిగేలా ప్రభుత్వం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఉన్న తల్లిదండ్రుల కమిటీ పేరును కూటమి ప్రభుత్వం మేనేజ్‌మెంట్ కమిటీలుగా మార్పు చేసింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ఎన్నికలకు2న నోటిఫికేషన్ ప్రకటన, 5న ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరణ, తుది జాబితా ప్రకటన, 8న ఎన్నికల నిర్వహణ ఉంటుంది. పాత కమిటీల పదవీకాలం ఈ నెలతో ముగిసింది.

News July 31, 2024

నెల్లూరు: బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలకు పోటాపోటీ

image

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్ మెన్, సూపర్ వైజర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారి స్థానంలో ప్రస్తుతం కొత్త నియామకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన లిస్టులు ఫైనల్ చేసిన అధికారులు వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. కాగా ప్రస్తుత మద్యం పాలసీ సెప్టెంబర్ నెలాఖరుకు ముగియనుంది.

News July 31, 2024

నెల్లూరు: ఆగస్టు 7న ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగం

image

సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ ను ఆగస్టు 7వ తేదీన ఉదయం 9.17 గంటలకు ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాల్లో ఉన్నారు. ఈ రాకెట్ ఈఓఎస్ 08 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ప్రస్తుతం రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. సమీక్షల అనంతరం ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

News July 31, 2024

నెల్లూరు: ఇద్దరి ఈవోలపై 54 అభియోగాలు

image

జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి ఆలయంలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. ఆ సమయంలో ఈవోలుగా పనిచేసిన గిరికృష్ణ, వెంకటేశ్వర్లు ఉన్నారు. దీనిపై కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి డిప్యూటీ కమిషనర్‌ కె.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. గిరికృష్ణపై 26, వెంకటేశ్వర్లుపై 28 అభియోగాలు నమోదు చేశారు. దీంతో ఇరువురిని సస్పెండ్‌ చేశారు.

News July 31, 2024

నెల్లూరు: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

image

ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జి డీఈఓ గ్లోరీ కుమారి తెలిపారు. ఆగస్టు 27వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు దగ్గరలోని ఓపెన్ స్కూలు కేంద్రాలను సంప్రదించాలని కోరారు. .

News July 31, 2024

నెల్లూరు: రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీకి చర్యలు

image

ఆగస్టుకు సంబంధించిన సామాజిక పింఛన్లను రెండు రోజుల్లోనే నూరు శాతం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో 3,11,535 మంది లబ్ధిదారులకు పింఛన్ అందించేందుకు ప్రభుత్వం రూ.131.68 కోట్లు కేటాయించిందని డీఆర్డీఏ పీడీ సాంబశివరెడ్డి వెల్లడించారు.