Nellore

News July 30, 2024

శభాష్ నెల్లూరు పోలీసు.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు లేఖ

image

నెల్లూరు రొట్టెల పండగకు చెన్నైకి చెందిన వృద్ధ దంపతులు వచ్చారు. డబ్బు, ఫోన్లు పోగొట్టుకున్నారు. చెన్నైకి వెళ్లేందుకు ఛార్జీకి డబ్బు కోసం భిక్షాటనకు సిద్ధపడ్డారు. గుర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ మస్తాన్‌ వృద్ధులకు భోజనం పెట్టి మరో రూ.500 ఇచ్చి చెన్నైకి పంపించారు. జరిగిన విషయాన్ని కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ రంజన్‌కు వివరించారు. కుమారుడు జరిగిన విషయం నగదు ఇచ్చి ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు లేఖ రాశారు.

News July 30, 2024

నాయుడుపేట: బాలికను బెదిరించి ఇద్దరు అత్యాచారం

image

మైనర్ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు మైనర్ యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాయుడుపేట మండల పరిధిలోని ఓ గిరిజన కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురులు బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

News July 30, 2024

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు లైసెన్సులు మంజూరు చేయాలి: కలెక్టర్

image

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్) త్వరితగతిన లైసెన్సులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాల కోసం జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ లో జరిగింది. ఈ సమావేశంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు లైసెన్సుల జారీ ప్రక్రియను నాబార్డ్, వ్యవసాయ, మత్స్య, డిఆర్డిఏ, తదితరులు పాల్గొన్నారు.

News July 29, 2024

రామాయపట్నం పోర్టును పూర్తి చేయాలి : వేమిరెడ్డి

image

రాష్ట్ర వాణిజ్యానికి ప్రముఖమైన రామాయపట్నం పోర్టును త్వరగా పూర్తి చేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో రూల్‌ నెంబర్‌ 377 ద్వారా ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం, 13వ షెడ్యూల్‌ ప్రకారం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్రం చేపట్టాలని ఉందన్నారు.

News July 29, 2024

సూళ్లూరుపేటలో పలు లాడ్జీలపై పోలీసుల తనిఖీలు

image

సూళ్లూరుపేట పట్టణంలోని పలు లాడ్జీలపై SI రహీం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లాడ్జిల్లో బసచేసే కస్టమర్ల వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని, అందరి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, చట్ట విరుద్ధంగా ఎవరికి గదులు ఇవ్వవద్దన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ASI రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

News July 29, 2024

చేజర్ల మండలంలో క్షుద్ర పూజలు కలకలం

image

చేజెర్ల మండలం కండాపురం గ్రామ సమీపంలో నీ వాగు వద్ద సోమవారం క్షుద్ర పూజాలు కలకలం రేపుతున్నాయి. గ్రామ సమీపంలో వాగు వద్ద ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి పూజలు. చుట్టూ ముగ్గు వేసి, పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలు పెట్టి ఉన్నారు. ఈ క్షుద్ర పూజలను చూసిన గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News July 29, 2024

పొదలకూరు: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

పొదలకూరు పోలీసులను ఆదివారం ఒక ప్రేమ జంట వచ్చి తమకు రక్షణ కల్పించాలని కోరారు. కనిగిరి మండలానికి చెందిన యువతి, పొదలకూరు మండలం విరుపూరుకు చెందిన యువకుడు వివాహం చేసుకుని పోలీసు స్టేషన్ ఆశ్రయించారు. ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ.. అమ్మాయి అదృశ్యం కేసు నమోదు కావడంతో ఇద్దరు మేజర్లు కావడంతో వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు.

News July 29, 2024

నెల్లూరు: ఎస్సీ కార్పొరేషన్‌‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ

image

నెల్లూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్లో తెలింది. దీంతో కలెక్టర్‌ ఆనంద్‌ ఇటీవల విచారణ అధికారిని నియమించారు. కార్యాలయంలో గతంలో చోటుచేసుకున్న అవకతవకలు, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగాలు, ఉద్యోగోన్నతులు, రూ.20.86 లక్షల దుర్వినియోగంపై విచారించి నివేదిక సమర్పించాలని అధికారిని ఆదేశించారు. దీంతో అంతా ఉత్కంఠ నెలకొంది.

News July 29, 2024

కావలి: బెదిరించి బాలికపై అత్యాచారం

image

కావలి పట్టణానికి చెందిన 58 ఏళ్ల మహబూబ్ బాషా 4వ తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పనులకు వెళ్లగా, బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసినా నిందితుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను నగ్నంగా ఫోన్‌లో చిత్రీకరించి అందరికీ చూపిస్తానని బెదిరించి అత్యాచారం చేసినట్లు విచారణలో తెలింది. తల్లిదండ్రులు 2టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటరమణ బాలిక ఇంటికి వెళ్లి విచారించారు.

News July 29, 2024

నెల్లూరు: ఫోర్జరీ కేసులో మేయర్ భర్త పీఏ అరెస్టు..?

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడైన నగర మేయరు భర్త జయవర్ధన్‌ పీఏ శివకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా జయవర్ధన్, శివకృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. HYDలో శనివారం శివకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఫోర్జరీ సంతకాల విషయమై మేయరు భర్తతో పాటు ఆరుగురిపై దర్గామిట్ట స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.