India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. మంగళవారం ఈ మేరకు పలు అంశాలపై ఆయన లోక్సభలో ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
బ్రెజిల్లో జరిగిన వేలంలో నెల్లూరు జాతి ఆవు అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది. బ్రెజిల్లోని మినాస్ గెరైస్లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవు 4.8 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.40 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. ఇది సుమారు 1,101 కిలోల బరువు ఉండటం విశేషం. వియాటినా-19 అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుంది. ఈ ఆవును ఒంగోలు జాతి ఆవు అని కూడా పిలుస్తారు.
అడిషనల్ DMHO ఎస్ కె. ఖాదర్ వలి, జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ నెల్లూరు జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లకు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక మలేరియా అధికారి వి. నాగార్జున రావు, WHO కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
రెండు రోజులు నెల్లూరు జిల్లాలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్. విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. 4వ తేదీన జిల్లాలోని కోవూరు, కందుకూరు నియోజకవర్గాల్లో క్షేత్ర పరిశీలన అనంతరం రాత్రికి నెల్లూరులోనే బస చేస్తారు. 5వ తేదీ నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో 11 గంటల వరకు క్షేత్ర పరిశీలన జరగనున్నట్లు షెడ్యూల్లో తెలిపారు.
నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తహసీన్ను నారాయణ మెడికల్ కళాశాల క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలిసి అభినందించారు, ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర కార్పొరేషన్లో తొలిసారి ముస్లిం మైనారిటీ మహిళను ఎన్నుకోవడం చారిత్రాత్మకమన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న మంత్రి పొంగూరు నారాయణను అభినందించారు
5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని నెల్లూరు ఆర్ఐవో డా. శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో సంబంధిత ఎగ్జామినర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రాక్టికల్ సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
కందుకూరు మండలం మాల్యాద్రి కాలనీ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు వ్యక్తులు బైక్పై సింగరాయకొండ వైపు నుంచి కందుకూరు వస్తుండగా మాల్యాద్రి కాలనీ వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానికలు కందుకూరు వైద్యశాలకు తరలించారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విక్రమ సింహపురి యూనివర్సిటీలో కొత్తగా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ నాన్ వాయిస్ కోర్సు ఏర్పాటు చేసినట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ జే.విజేత తెలిపారు. VSU, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్తంగా ఈ కోర్సు తీసుకురావడం జరిగిందన్నారు. 10వ తరగతి పాసై, 18-25 సం.ల వయస్సు గల అభ్యర్థులు అర్హులు అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వైసీపీ మద్దతుదారుల ఇళ్లను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ మంత్రి నారాయణ సూచనలకు అనుగుణంగా ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. వైసీసీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని అన్యాయంగా కూల్చారని, ఆయన అక్కడే ఏళ్లుగా ఉన్నారన్నారు. మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే.. ‘ఇది పిచ్చి నారాయణ పాలన అని ప్రజలే తమ గోడును వెల్లబోసుకుంటారని కాకాణి ఎద్దేవా చేశారు.
Sorry, no posts matched your criteria.