Nellore

News September 2, 2025

ముత్తుకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

image

ముత్తుకూరు (M) బోడి స్వామి కండ్రిగలో జరిగిన వినాయక నిమజ్జనంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. వినాయక నిమజ్జనం కోసం టాక్టర్ ను నీటితో శుభ్రం చేస్తుండగా వివాదం తలెత్తింతి. ఓ వర్గం రాళ్లు రువ్వినట్లు మరో వర్గం ఆరోపించారు. దీంతో ఇరువర్గాలలో పలువురికి గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

News September 2, 2025

నెల్లూరు: షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని రూ.50 లక్షలు టోకరా!

image

కావలి టూ టౌన్ పరిధికి చెందిన ఓ వ్యక్తిని ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ మార్కెట్లో కువేర అనే కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఓ వ్యక్తి నమ్మపలికారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆ కంపెనీ షేర్ మార్కెట్లో రూ.50 లక్షల పెట్టుబడి పెట్టి ఆదాయం కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 2, 2025

సరోగసి ద్వారా చికిత్స చేసే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి

image

నెల్లూరు డిఎంహెచ్వో సుజాత కీలక ఆదేశాలు జారీ చేశారు. గర్భాశయ గర్భధారణ, ప్రయోగశాలలో ఫలదీకరణ(IVF), వీర్యం, అండాలను భద్రపరిచే బ్యాంకులు, అద్దె గర్భము(సరోగసి) ద్వారా చికిత్సలు చేసేవారు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సంబంధిత నేషనల్ రిజిస్ట్రేషన్ పోర్టర్లో నిర్ణిత ఫీజులు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి వద్ద అనుమతి పత్రాన్ని తీసుకోవాలన్నారు.

News September 1, 2025

దారుణంగా రహదారులు.. బిల్లులు ఇవ్వక ఇబ్బందులు

image

ఏఎంసీ రోడ్ల పనులపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో నెల్లూరు జిల్లాలో కీలక రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. 2022లో 222 రోడ్లను రూ.185.40 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు వచ్చినా, నిధుల సమస్యతో కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారు. ఇప్పటివరకు 51 పనులు మాత్రమే ప్రారంభమై 26 పూర్తి కాగా, 25 ఆగిపోయాయి. మిగతా 171 పనులు అసలు మొదలుకాలేదు. చేసిన పనులకే బిల్లులు ఇవ్వకపోవడంతో కొత్త పనులు చేయడం లేదు.

News September 1, 2025

కరటంపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఆత్మకూరు మండలం నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై కరటంపాడు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్‌, బైకు ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతిచెందగా, మహిళకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 1, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 436 అర్జీలు : కలెక్టర్

image

ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 436 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూశాఖకు 174, మున్సిపల్‌ శాఖకు 41, సర్వేకు 18, పోలీసుశాఖకు 62, సివిల్‌ సప్లయిస్‌కు 11 అర్జీలు అందాయన్నారు.

News September 1, 2025

నెల్లూరు: మ్యాట్రిమోనిలో పరిచయం.. రూ.14.50 లక్షలతో బురిడీ

image

కలిగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఓ మ్యాట్రిమోని ప్రొఫైల్లో కీర్తి రెడ్డి అనే మహిళ పరిచయం అయ్యింది. దీంతో ఆమె క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చని ఆశ చూపి నమ్మించి రూ.14.50 లక్షల నగదు పెట్టుబడి పెట్టించింది. ఆ వ్యక్తికి ఎటువంటి ఆదాయం రాకపోవడంతో నకిలీ పోర్టల్ అని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 1, 2025

నెల్లూరు: హావ్వా.. ఇది రైతు బజారేనా…!

image

నెల్లూరు ఫత్తేఖాన్ పేట రైతు బజారు కూరగాయలు విక్రయాలు జరిగే దుకాణాలు వ్యాపారులు లేక వెలవెలబోతున్నాయి. ఫలితంగా బయటి వ్యక్తులకు ఆవాసంగా మారుతోంది. ఇక్కడ మొత్తం 81 షాపులు ఉండగా ఇందులో 30 వరకు దుకాణాలు ఖాళీగా దర్శనామిస్తున్నాయి. మరోవైపు లోపల ఆవరణంలో గచ్చు పగిలిపోయింది. దీంతో ఆలనా పాలన లేకపోవడంతో రైతు బజారు కళావిహీనంగా మారుతోంది. మార్కెట్ శాఖ అధికారులు దృష్టి పెడితే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

News September 1, 2025

డయాలసిస్‌ పేషంట్‌‌కు పింఛన్ అందించిన కలెక్టర్

image

మూలాపేట ఈఎస్‌ఆర్‌ఎం స్కూలు సమీపంలో జరిగిన పింఛన్ల పంపిణీలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. మంచానికే పరిమితమైన డయాలసిస్‌ పేషంట్‌ సిరివెళ్ల శ్రీనివాస్‌కు రూ.15వేలు, ఒంటరి మహిళ శారదకు రూ.4 వేలు నగదు అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్దకు కలెక్టర్‌ వచ్చి నగదు అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

News September 1, 2025

ఇచ్చిన మాట కోసం TGT ఉద్యోగాన్నే వద్దనుకున్నాడు.!

image

ఇచ్చిన మాట కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు HM G.సుబ్బారెడ్డి. ఈయన ఉదయగిరి(M) పుల్లాయపల్లి MPP పాఠశాలలో పని చేస్తున్నారు. ఇటీవల DSCలో TGT ఉద్యోగం వచ్చింది. ఆయన ఇది వరకే పట్టణంలో చదువుకొంటున్న పలువురు పేద విద్యార్థులను ఆయన పాఠశాలకు రప్పించుకుని మంచి విద్యను అందిస్తున్నారు. పైతరగతి విద్యార్థులతో స్టడీ అవర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వెళితే పిల్లలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఉద్యోగాన్ని వద్దనుకున్నారు.