India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కందుకూరు పట్టణంలోని తిక్కవరపు రామిరెడ్డి జూనియర్ కళాశాల 29వ వార్షికోత్సవ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఇదే కళాశాలలో నేను చదువుకున్నందున గర్వ పడుతున్నానని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అన్ని వసతులు ఉన్నాయని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.
విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డం వస్తే తొలగించి రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తారు. అయితే వింజమూరు – ఆత్మకూరు వెళ్లే ప్రధాన రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభం ఉంచారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డు వేసి ఏం ప్రయోజనం అని విమర్శించారు. అధికారులు స్పందించి వెంటనే స్తంభాన్ని తొలగించి, రోడ్డు పక్కకు మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
వచ్చేనెల 3వ తేదీన బుచ్చి నగర పంచాయతీలో 2 నగర వైస్ ఛైర్మన్ల ఎంపిక జరగాల్సి ఉంది. ఈలోగా ఆశావాహులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2021 నవంబర్ 15న 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 18 YCP, 2 TDP అభ్యర్థులు విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఛైర్ పర్సన్తోపాటు 9మంది TDP లో చేరారు. ఇద్దరు వైస్ ఛైర్మన్లు రాజీనామా చేశారు. దీంతో ఈ పదవుల కోసం పోటీ నెలకొంది.
నెల్లూరు కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తున్న పిల్లలపై నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని వీఆర్సీ, ఆర్టీసీ, గాంధీ బొమ్మ, ఆత్మకూర్ బస్టాండ్ ప్రాంతాలలో 8 మంది పిల్లలతో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించారు.
న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి N.MD ఫరూక్ గురువారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నెల్లూరుకు రోడ్డు మార్గంలో రానున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అనంతరం ఆయన మైనారిటీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 31న ఆయన తిరిగి నంద్యాలకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు.
కూతురిని రూ. 25 వేలకు అమ్మిన కసాయి తండ్రి రమణయ్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య దంపతులకు ముగ్గురు మగ పిల్లలు, ఏడుగురు ఆడపిల్లలు సంతానం కలరు. చిత్తూరు జిల్లాలో రమణయ్య కుటుంబం బాతులు మేపుతుండేవారు. భార్య అనారోగ్యం కావడంతో తన ఐదో కూతురు మల్లిక(10)ను నగరికి చెందిన బాలాజీకి రూ.25 వేలకు అమ్మాడు. చిన్నారిని గ్రామస్థులు రక్షించి పోలీసులకు అప్పగించారు.
జిల్లాలో కల్లుగీత కులాల వారికి 18 మద్యం షాపు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. జిల్లాలో నెల్లూరు, కావలి, కందుకూరు, ఆత్మకూరు మున్సిపాలిటీలు, కావలి, కందుకూరు, ఆత్మకూరు మండలాలు, గుడ్లూరు, కలువాయి, జలదంకి, సంగం, కలిగిరి, అనంతసాగరం, వింజమూరు, దుత్తలూరు, లింగసముద్రం, దగదర్తి, ఏఎస్ పేట మండలాలకు కేటాయించారు. దరఖాస్తుదారుడు కుల ధ్రువీకరణతో పాటు రెండు లక్షల రూపాయలు దరఖాస్తు చెల్లించాలన్నారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెంకటాచలం మండలంలో జరిగింది. కనుపూరు గ్రామానికి చెందిన కృష్ణవంశీ అనే యువకుడు ఆదే ఊరుకి చెందిన ఓ బాలిక(16)ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. అనంతరం బాలికకు టాబ్లెట్లు ఇచ్చి గర్భం తొలగింపజేశాడు. మళ్లీ లైంగిక దాడికి పాల్పడగా నిరాకరించడంతో దాడి చేశాడు. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
కల్లుగీత కులాల నుంచి మద్యం షాపులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాసన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 18 మద్యం షాపులు కేటాయించారని ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. గౌడ -7, గౌడ్ – 6, గమళ్ల -4, గౌండ్ల -1 కేటగిరీగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 80 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ మోసాలు, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.