India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2024లో సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. నెల్లూరు MP సీటుతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో TDP గెలిచింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచిన YCP 2024 ఎన్నికల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. సూళ్లూరుపేట నుంచి విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేశ్, కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి, కావలి నుంచి కృష్ణారెడ్డి మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
నెల్లూరు జిల్లాలో కొత్త సంవత్సరం అంటే అందరూ జొన్నవాడ, నరసింహకొండ, పెంచలకోన అంటూ తమకు నచ్చిన గుడికి వెళ్తుంటారు. ఆ తర్వాత ఆత్మీయుల కోసం గ్రీటింగ్ కార్డు కొనుగోలు చేసి మనసులోని భావాలను ఆ కార్డుపై రాసి పంపేవారు. నేడు పరిస్థితి మారింది. గుడికి వెళ్లడం కొనసాగుతున్నా.. గ్రీటింగ్ కార్డులు మాయమయ్యాయి. మొబైల్ ఫోన్ల రాకతో అర్ధరాత్రి 12 మోగగానే మెసేజ్లు, కాల్స్తో విషెస్ చెబుతున్నారు.
నెల్లూరు నగరంలో తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆదివారం స్టోన్ హౌస్ పేటలోని పాండురంగ అన్నదాన సమాజంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి కృషి చేశామని ఆయన అన్నారు.
సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న మాజీ సీఎం జగన్ 30 ఏళ్లు పూర్తయ్యేసరికి ముత్తాత అవుతారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ ఆఫిస్లో ఆదివారం ఆయన మాట్లాడారు. అవినీతిలో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన జగన్ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలోనే జగన్ రెడ్డిలా అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి ఎవ్వరు లేరని ఆయన దుయ్యబట్టారు.
నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో సోమవారం నుంచి నిర్వహించనున్న APSLRB పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతే ప్రమాణికంగా ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిక్రూట్మెంట్కు వచ్చే అభ్యర్థులు సూచించిన ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావాలని ఎస్పీ కోరారు.
శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV- C60 రాకెట్ను ప్రయోగించనున్నన్నట్లు ఆదివారం పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రాకెట్ ద్వారా 440 కిలోల బరువు కలిగిన స్పాడెక్స్ పేరుతో జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. కక్ష్యలోకి వెళ్లిన ఉపగ్రహాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండి సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. దీనివల్ల భారత్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశం అవుతుందన్నారు.
నెల్లూరులో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కామాటివీధికి చెందిన సాయికిరణ్ అమెరికాలో ఉంటున్నాడు. బృందావనంలోని ఓ బ్యాంకు ఖాతాలో ఇటీవల కొంత నగదు జమ చేశారు. అందులోని రూ.3.96 లక్షలను గత నెల 7న గుర్తుతెలియని వ్యక్తులు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు ఇటీవల గుర్తించాడు. దీంతో నెల్లూరులో ఉంటున్న తండ్రి రమేశ్ బాబు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, చిన్నబజార్ సీఐ కోటేశ్వరరావు విచారణ చేపట్టారు.
వ్యాపార, వాణిజ్య రంగాల ద్వారా ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సాధించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మెప్మా రిసోర్స్ పర్సన్ (ఆర్.పి) సిబ్బంది దోహదపడాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ సూచించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై రెండు బృందాలకు శనివారం కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శిక్షణ తరగతులను నిర్వహించారు.
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ పటిష్ఠత, కార్యకర్తలకు అండగా ఉండటం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని వారు నిర్ణయించారు.
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 30వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలకు జిల్లాలో 4690 మంది అభ్యర్థులలో 3,855 మంది పురుషులు, 835 మంది స్త్రీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.
Sorry, no posts matched your criteria.