India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోవూరు రాళ్లమిట్టలో ఈ నెల 9న యువకుడి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఘటనపై వివరాలను గురువారం డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. బాధితుడు నాగరాజు అతడి స్నేహితులు ఓ పందిని దొంగిలించిన ఘటనలో యజమాని రామకృష్ణతో గొడవడ్డారు. ఈ గొడవలో అనూహ్యంగా మరో స్నేహితుడు నాగరాజును పొడవడంతో అతడు చనిపోయాడు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.
విజయవాడ పోలీస్ కమిషనర్గా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఎస్వీ రాజశేఖర బాబు నియమితులయ్యారు. ఆయన 1998లో గ్రూప్-1 అధికారిగా పోలీస్ శాఖలో ప్రవేశించి, 2006లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. తిరుపతి, అనంతపురం, గుంటూరు ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఐజీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత పోలీసు నియామక బోర్డు ఛైర్మన్గా పోస్టింగ్ పొంది ఇప్పుడు విజయవాడకు సీపీ అయ్యారు.
ఆరోగ్య శ్రీ సేవల్లో నెల్లూరు మూడో స్థానంలో ఉన్నట్లు జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. బి నాయక్ తెలిపారు. గతంలో పదో స్థానంలో ఉన్న జిల్లా ఏడు స్థానాలు మెురుగుపర్చుకున్నట్లు ఆయన తెలిపారు. పీజీ సీట్ల రాకతో ఈ ఘనత సాధ్యమైపట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1238 ఓపీలు వస్తున్నాయని, 626 మంది ఇన్ పేషంట్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా షేక్ మునీర్ను ఎంపిక చేశారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 17 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ ఏడాది రొట్టెల పండగ కమిటీ కార్యదర్శిగా నియమించారు.
నెల్లూరు నగరంలోని గోమతి నగర్లో జనసేన జిల్లా పార్టీ ఆపీసు ఏర్పాటు చేశారు. దీనిని పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఎవరికి అన్యాయం జరిగినా తమ పార్టీ కార్యాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. జనసేన పార్టీ పేద ప్రజల బాధలు తెలుసుకుని వారికి సహాయం చేసేందుకు ముందుంటుందని తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పలు మార్గాల్లో ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు, కావలి, గూడూరు పరిధిలో 60 KM రాష్ట్ర రోడ్ల బాగుకు రూ.1.14 కోట్లు, 220 KM జిల్లా రోడ్ల మరమ్మతులకు రూ.2.90 కోట్లు అవసరమని గుర్తించారు. మొత్తంగా రూ.4.04 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారి 16 రోజుల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక పుష్పాలంకరణతో గ్రామంలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఉషశ్రీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వారిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడి ప్రోత్సహంతో మనుషా రాష్ట్ర స్థాయి PG లాసెట్లో ఐదో ర్యాంకు సాధించింది. పొదలకూరు(M) లింగంపల్లి గ్రామానికి చెందిన గుండ్రా మస్తాన్రెడ్డి, మాధవిల కుమార్తె పదో తరగతి వరకు పొదలకూరు బాలికల ZP హైస్కూల్లో చదివింది. తిరుపతి SV యూనివర్సిటీలో LLB పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేస్తోంది. న్యాయమూర్తి కావడమే లక్ష్యమని మనుషా పేర్కొంది.
అంధ్రవిశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యాయన కేంద్రం గ్రోత్ రేట్ ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుత జనాభాను అంచనా వేసింది. దీని ప్రకారం రాష్ట్ర జనాభా 5,78,92,568 మంది ఉండగా 24,69,712 మంది జనాభాతో నెల్లూరు జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి 1000 మంది మగవాళ్లకు 985 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 68.90 శాతంగా ఉంది.
నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు 70 మందితో కూడిన కమిటీని వక్ఫ్ బోర్డు సీఈవో అబ్దుల్ ఖాదర్ నియమించారు. కమిటీ అధ్యక్షులుగా ఎస్.కె ఖాదర్ బాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, షేక్ న్యాయమతుల్లా, ప్రధాన కార్యదర్శిగా ఎండి. కరిముల్లా, కార్యదర్శి షేక్ మునీర్ బాష, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అక్బర్, మోహిద్, కరిముల్లా షరీఫ్ తో పాటు పలువురు సభ్యులుగా ఉంటారు.
Sorry, no posts matched your criteria.