India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో 2023 బ్యాచ్కి చెందిన దామెర హిమవంశీని నియమించారు. 8నెలల క్రితం సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీపూజ నిజాయితీగా, ముక్కుసూటిగా పనిచేస్తారని మంచిపేరు సాధించారు. సబ్ డివిజన్ గురించి పూర్తి అవగాహన చేసుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనుకునే లోపే ఆమె బదిలీ కావడం విశేషం.

జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో వైసీపీ నాయకులు జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి 20,000 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులుకి రూ. 5,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయం అన్నారు.

రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న అభియోగాల నేపథ్యంలో సీఐడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెండు రోజులు పాటు ఆయనని కస్టడీకి తీసుకోగా ఇవాళ విచారణ ముగిసింది. రెండో రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డిని 14 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వులు మేరకు ఆయనను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.

నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ విభాగాలకు సంబంధించి 48 అర్జీలు వచ్చాయి. అకౌంట్ సెక్షన్ 1, ఆప్కాస్ 3, ఇంజినీరింగ్ 6, టిడ్కో హౌసింగ్ 18, రెవెన్యూ 4, టౌన్ ప్లానింగ్ 8, పబ్లిక్ హెల్త్ 5, హెచ్ సెక్షన్ – 2, పెన్షన్ – 1 అర్జీ వచ్చాయి. కార్యక్రమంలో డీసీ చెన్నుడు, ఎంహెచ్ఓ కనకాద్రి, ఎస్ఈ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరులోని అభివృద్ధి పనులపై టీడీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నగర కార్పొరేషన్లో రూ.830 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. ఇప్పటికే డ్రైన్లలో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ 1వ తేదీ కల్లా అన్ని పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

నెల్లూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ 10వ క్రీడా వారోత్సవాలను జిల్లా జడ్జి శ్రీనివాసులు, కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. శుక్రవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. మూడు రోజులుపాటు ఈ క్రీడా వారోత్సవాలు జరగనున్నాయి. ఈ పోటీల్లో నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొననున్నారు.

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో ఊరట లభించింది. కృష్ణపట్నం పోర్టు రోడ్ పంట పాలెం వద్ద అక్రమ టోల్ గేట్ పెట్టి వాహనాలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో రైల్వే కోర్ట్ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ బెయిల్ మంజూరు చేశారు.

కావలిలో గోడ కూలి బేల్దారి మృతి చెందాడు. డ్రైనేజీ కాలువ నిర్మించేందుకు తవ్వుతుండగా పక్కనేఉన్న గోడ కూలి మృతి చెందాడు. మృతుడు బోగోలు మండలం సాంబశివపురం తాతా వెంకయ్యగా గ్రామస్థులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బేల్దారి మేస్త్రిలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

నెల్లూరులోని ఓ ప్రముఖ హోటల్ ఆహరంలో బల్లి వచ్చిన ఘటన బుధవారం వెలుగు చూసింది. నగరంలోని ఓ హోటల్లో రాత్రి రూ.70 పెట్టి భోజనం కొన్న కస్టమర్ సాంబార్లో బల్లి కనిపించడంతో కంగుతిన్నాడు. ఇదేమిటని హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్షంగా సమాధానం ఇచ్చినట్లు ఆయన వాపోయాడు. అదే సాంబారును హోటల్ నిర్వాహకులు కస్టమర్లకు పంపిణీ చేశారని ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించారు.
Sorry, no posts matched your criteria.