India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బ్యాంకు రుణాలు రిసోర్స్ పర్సన్లకు కాసులు కురిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 37వేల పొదుపు సంఘాల్లో 3.80 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది 1575.51 కోట్ల రుణ లక్ష్యానికి రూ.1301.67 కోట్లు పూర్తి చేశారు. రూ.లక్షకు రూ.5వేలు నుంచి రూ.10 వేలు వరకు గ్రూపు నుంచి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.37 కోట్లు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారని సమాచారం. మీ దగ్గర ఎంత తీసుకున్నారో కామెంట్ చేయండి.

నెల్లూరు రాజకీయం అంటే ముందుగా గుర్తు వచ్చేది అనం కుటుంబం. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి రెండు దశాబ్దాల పాటు నెల్లూరులో తిరుగులేని వ్యక్తిగా నిలబడ్డారు. అయితే ఆయన మరణాంతరం కుమారులు ఆనం రంగ మయూర్ రెడ్డి, ఏసి సుబ్బారెడ్డిలు సైలెంట్గా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తారని ఆనం కుటుంబం అభిమానులు చెబుతున్నారు. వీరి రాజకీయ ఎంట్రీ ఏ పార్టీల నుంచి అనే దానిపై చర్చ సాగుతోంది.

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.

నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలు అంశాలపై మంత్రి వారితో చర్చించారు. అనంతరం అందరికీ కానుకలు అందజేశారు.

రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని అడవిలో ప్రేమికులు <<19290866>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. మృతులు ముత్తుకూరు మండలం పంటపాలేనికి ఆలపాక ప్రసన్న కుమార్(24), చిట్టమూరు మండలం చింతలతోపునకు చెందిన ఎం.సావిత్రి(26)గా గుర్తించారు. తేనె సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన పంగిలి గ్రామస్థులు మృతదేహాలను చూశారు. సమీపంలోని బైకుపై దొరికిన హ్యాండ్ బ్యాగులో ఉన్న ఫోన్ల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

నెల్లూరు జిల్లాలో 110KM విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. 53,541మంది మత్స్యకారులు ఉండగా.. 39,590 ఎకరాల ఆక్వా సాగులో ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మత్స్యశాఖలో 15 పోస్టులే ఉన్నాయి. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 8మందికి 4 ఖాళీలు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫిషరీస్ 4 పోస్టులకు 2ఖాళీలు ఉన్నాయి. దీంతో సాగరమిత్రలపై పనిభారం పెరుగుతోందని సమాచారం. వీరికి గత 4నెలలుగా జీతాలు కూడా సరిగా రావడం లేదని తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో ప్రేమ జంట మృతి కలకలం రేపింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25)కు సోషల్ మీడియా ద్వారా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి(24) పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఏమైందో ఏమో రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద ఉరేసుకున్నారు. పురుగుల మందు తాగిన తర్వాత ఉరేసుకుని ఉంటారని సమాచారం. సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.

ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నా నెల్లూరు రూరల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. MLA తమ్ముడు గిరిధర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. YCP ఇన్ఛార్జ్గా ఆనం విజయ్ కుమార్ రెడ్డే పోటీలో ఉంటారని కాకాణి చెప్పినా.. అనిల్ యాదవ్ పేరు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతానికి అనిల్ నెల్లూరుకు అంటీముట్టనట్లు ఉన్నారు. రోజూ ప్రజల్లో తిరుగుతున్న గిరిధర్ రెడ్డిలో ఎవరు గెలుస్తారో మరి.

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ జాతర మొదటి చాటింపు మంగళవారం అర్ధరాత్రి వేస్తున్నట్లు ఆలయ ఎక్స్ అఫీషియో సభ్యుడు చాకిరి రమణయ్య తెలిపారు. చంద్రగ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఈ చాటింపు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతర నిర్వహణకు సంబంధించి గ్రామస్థులు, భక్తులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.