India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గత మండల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి TDP ఇందుకోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే MPPలు YCP నుంచి TDP గూటికి చేరుకున్నారు. MPTC ఎన్నికలు సైతం నామమాత్రంగా జరుగుతుండగా.. MPPలు ఎక్కువగా ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. దీంతో పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు TDP, బల నిరూపణకు YCP కాలుదువ్వుతున్నాయి. మరోవైపు BJP, జనసేన సైతం సత్తా చాటడానికి సిద్ధం అంటున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో 10 తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించి ప్లాన్ ప్రకారం బోధన చేయిస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 10 తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించి ప్లాన్ ప్రకారం బోధన చేయిస్తున్నట్లు చెప్పారు.

వెంకటగిరిలో విద్యార్థులు తమకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పజెప్పి మానవత్వం చాటుకున్నారు. కాజీపేటలో మార్గంలోని SBI బ్యాంక్ సమీపంలో రోడ్డుపై ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6,28,500 విలువ గల 4.5 సవర్ల బంగారం దొరికింది. వారు బంగారాన్ని ఎస్ఐ స్వరూపకు అందించారు. ఆ బంగారం పట్టణంలోని మహాలక్ష్మిదిగా గుర్తించి ఆమెకు అప్పగించారు. ఈ మేరకు విద్యార్థులను SI, బాధితురాలు అభినందించారు.

‘విజేతారెడ్డి, అనురాధ, రూప్, వీబీఆర్ దగ్గరకు వెళ్తే పనులవుతాయి అనుకోవద్దు. ఎవరు చెప్పినా నేను వినను’ అంటూ మంత్రి నారాయణ మాట్లాడినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైందని ఆయన మండిపడినట్లు ఆడియోలో ఉంది. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, తన కోసం 700 మంది పని చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.

వేసవికాలం దృష్ట్యా ప్రజలు ఫైర్ స్టేషన్కు సంబంధించిన ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్ 101, నెల్లూరు – 0861 2331051, 9963734284, కావలి – 08626 243101, 9963734286, ఆత్మకూరు – 08627 221222, 9963734394, పొదలకూరు -08621 225202, 9963734828, రాపూరు – 08621 226145, 9963735094, ఉదయగిరి- 08620 229251, 9963735314, వింజమూరు – 08629 214437, 9963735446, మర్రిపాడు- 08620 228800, 9963744817.

వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన పాపారావు తన కుమారుడు శ్రీకాంత్తో కలిసి ఇప్పగుంట పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. కోనేరు కుంట వద్ద భోజనం చేసిన తాగునీటి కోసం బావిలోకి దిగిన శ్రీకాంత్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు బావిలోకి దిగిన తండ్రి పాపారావు కూడా ప్రమాదానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

మనుబోలులోని ఆంధ్ర విలాస్ హోటల్ ఎదురుగా హైవేపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జట్లకొండూరుకు చెందిన పెంచలయ్య ఓ గ్రానైట్స్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. పని మీద సొంత ఊరు నుంచి మనుబోలుకు బైకుపై వస్తుండగా అదే సమయంలో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పాల ఆటో ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సామూహిక ఆత్మరక్షణ శిక్షణ బుధవారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కరాటే నిపుణులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు ప్రత్యక్షంగా వివరించారు.

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పని తీరుపై ఓ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఒక అర్జీని కలెక్టర్కు ఇవ్వడంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించారని చెప్పారు. సమస్య పరిష్కరించిన కలెక్టర్ను వృద్ధురాలు రమాజ్యోతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ చెప్పారు.
Sorry, no posts matched your criteria.