Nellore

News September 19, 2024

నెల్లూరు: భార్యతో గొడవ.. భర్త సూసైడ్

image

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పెళ్లకూరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ సంగమేశ్వరరావు వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో వారు ఫొన్లో రోజూ గొడవపడేవారు. రాజుపాళెం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ మునుస్వామి తెలిపారు.

News September 19, 2024

భూటాన్ దేశంలో సత్తా చాటిన నెల్లూరు విద్యార్థిని

image

నెల్లూరు నగరం స్థానిక స్టోన్ హౌస్ పేటలో 10వ తరగతి విద్యార్థిని తుమ్మల పూజిత ఇటీవల భూటాన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ “ఆట్యా-పాట్యా” ఛాంపియన్ షిప్ 2023-24 క్రీడల్లో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ విద్యార్థినిని ప్రత్యేకంగా బుధవారం సత్కరించారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆదర్శనీయం అని ప్రశంసించారు.

News September 18, 2024

నెల్లూరు జిల్లాలో పలువురికి వైసీపీ కీలక బాధ్యతలు

image

నెల్లూరు జిల్లాలో పలువురికి కీలక పదవులు అప్పగిస్తూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు- కాకాణి
రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్- ఆనం విజయకుమార్ రెడ్డి
సిటీ ఇన్‌ఛార్జ్- పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు కార్పొరేషన్ అబ్జర్వర్- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు ఎంపీ ఇన్‌ఛార్జ్‌- ఆదాల ప్రభాకర్ రెడ్డి
రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి- మహ్మమద్ ఖలీల్

News September 18, 2024

వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి

image

వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కాకాణికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి పార్టీ మారడంతో జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. తాజాగా ఆయనను నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

News September 18, 2024

మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

image

స్వచ్చతా హి సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా పరిషత్ ఆవరణలో బుధవారం కలెక్టర్ ఆనంద్, ZP చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా అధికారులు మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ, వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డులకు తరలించడం తదితర కార్యక్రమాలు చేపట్టేమన్నారు.

News September 18, 2024

నెల్లూరు: చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి

image

సంగం మండలం పడమటి పాలెంలో మంగళవారం అప్పుల బాధ తట్టుకోలేక ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కానిస్టేబుల్ రమేశ్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.

News September 18, 2024

సంగం: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

image

ఏఎస్ పేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్ సంగం మండలం పడమటిపాలెంలో మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బుచ్చి నుంచి నెల్లూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేశ్ స్వగ్రామం విడవలూరు.

News September 18, 2024

నెల్లూరు: నవోదయ ప్రవేశపరీక్షకు దరఖాస్తుల గడువు పెంపు

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలు, సూచనలు, సలహాలు కొరకు 08985007588, 63004 29938 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News September 17, 2024

కావలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

కావలి మండలం తాళ్లపాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంచాల శ్రీకాంత్, సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులు కావలి మండలం జువ్విగుంటపాలెం నుంచి కావలి వస్తుండగా తాళ్లపాలెం వద్ద లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుబ్బారావు నడుముపై లారీ టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీకాంత్‌ను చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు.

News September 17, 2024

నెల్లూరు: రైతులకు GOOD NEWS.. గడువు పెంపు

image

నెల్లూరు జిల్లాలోని పంటల నమోదులో చేయాల్సిన ఈక్రాప్ బుకింగ్ ఈకేవైసీ గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీతో ముగిసిందని జిల్లాలో చాలాచోట్ల నమోదులో కాలేదని దీంతో గడువు పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పంటలు వేసిన రైతులు ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని కోరారు.