Nellore

News September 6, 2025

విషాదం.. ట్రాక్టర్ కింద పడి ఇద్దరు చిన్నారుల మృతి

image

సుళ్లూరుపేట(M)లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కింద పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు.. అబాక హరిజనావాడకు చెందిన A.కృష్ణయ్య పొలానికి ట్రాక్టర్‌పై వెళుతుండగా ‘మేము వస్తాం’ అంటూ ఇద్దరు మనమరాళ్లు, మనవడు మారం చేశారు. దీంతో చేసేది లేక ఆయన వారిని తీసుకుని బయలుదేరాడు. పొలాన్ని దున్నుతుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్ కింద పడి కుందన(11), దివాన్ (3) చనిపోయారు.

News September 6, 2025

మాజీ MLA ప్రసన్న బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

image

కోవూరు మాజీ MLA నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. వైసీపీ అధినేత జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఓ హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వల్లే హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారంటూ అయనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రసన్న కోర్టును ఆశ్రయించగా.. విచారించిన న్యాయమూర్తి 8కి వాయిదా వేశారు.

News September 6, 2025

రికార్డు స్థాయిలో రూ.4.03 లక్షలు పలికిన వినాయకుని లడ్డూ

image

మనుబోలులోని చెర్లోపల్లి గేటు వద్ద ఉన్న విశ్వనాధ స్వామి ఆలయంలోని వినాయకుడి లడ్డూకు వేలంపాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.4.03 లక్షల ధర పలికింది. గుండు బోయిన వెంకటేశ్వర్లు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నాడు. అలాగే వెయ్యి రూపాయల డబ్బుల మాలను యోగేంద్ర రూ.2.50 లక్షలకు, రూ.5 కాయన్ రూ.50 వేలకు కావేటి పెంచలయ్య వేలం పాటలో దక్కించుకున్నారు.

News September 6, 2025

7న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం మూసివేత

image

నెల్లూరు దర్గా మిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుంచి సోమవారం ఉదయం 6:30 గంటల వరకు మూసి వేస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తరువాత ఆలయాన్ని శుభ్రం చేసి సోమవారం ఉదయం 8 గంటల నుంచి పూజలు, సర్వదర్శనం ఉంటుందన్నారు.

News September 5, 2025

ఆ బాధ్యత టీచర్లదే : కలెక్టర్

image

జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతం చేయాల్సిన బాధ్యత టీచర్లదేనని జిల్లా కలెక్టర్ ఆనందు తెలిపారు. ప్రభుత్వ, ప్రవేట్ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి విద్యారంగా అభివృద్ధికి దోహదపడాలన్నారు. విద్యావ్యవస్థలో వచ్చే మార్పులు దృష్టిలో ఉంచుకొని టీచర్లు శిక్షణ పొందాలని సూచించారు. కలెక్టరేట్లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

News September 5, 2025

నెల్లూరు: ధాన్యం రేటు పతనంపై నిరసన

image

నెల్లూరు జిల్లాలో వరి పుట్టి మద్దతు ధరను ప్రభుత్వం రూ.19,720గా ప్రకటించింది. దళారులు, మిల్లర్లు కలిసి రూ.16వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతు సంఘ నాయకుడు గంగపట్నం రమణయ్య ఆరోపించారు. పలుమార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యం, మిల్లర్లు, దళారుల దోపిడిపై ఈనెల 8న రైతు సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడతామని ప్రకటించారు.

News September 5, 2025

NLR: హూజ్ యాప్‌తో రూ.2 కోట్లకు టోకరా..?

image

కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ప్రజల ఆశను కొందరు ఆసరాగా చేసుకొని భారీగా కొల్లగొడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో హూజ్ యాప్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. 2024లోనే ఈ యాప్ ప్రారంభమైంది. జిల్లాలో దాదాపు రూ.2కోట్లకు పైగా నగదు డిపాజిట్ చేయించుకుంది. ఈ యాప్‌లో చేరిన వారికి గత నెల 20వ తేదీ నుంచి నగదు ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు వాపోయారు.

News September 5, 2025

శ్రీలంకలో కావలి మాజీ MLA..?

image

కావలి MLA కృష్ణారెడ్డి హత్యకు ప్లాన్ చేశారంటూ మాజీ MLA ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదైంది. దీనిని కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని కోర్టు ప్రశ్నించగా ‘ఆయన దేశంలో లేరు. శ్రీలంకలో ఉన్నట్లు దర్యాప్తు అధికారి గుర్తించారు. MLA హత్యకు ఆయన ప్లాన్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. కేసును క్వాష్ చేయవద్దు’ అని గవర్నమెంట్ లాయర్ కోరారు. ఈనెల 10కి ఈ కేసు వాయిదా పడింది.

News September 4, 2025

నెల్లూరు: రైతు బజారులో కిలో ఉల్లి రూ.16

image

నెల్లూరు జిల్లాలోని పలు రైతు బజార్లలో ఉల్లిపాయలను సబ్సీడీపై విక్రయిస్తున్నారు. పొదలకూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న రైతు బజారులో బుధవారం నుంచి కిలో రూ.16కు అందిస్తున్నట్లు నెల్లూరు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితా కుమారి తెలిపారు. బయట మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలో రూ.30గా ఉంది. సబ్సిడీపై రూ.16కే ఇస్తున్నామని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 4, 2025

నెల్లూరు పూర్వ కమిషనర్లపై అవినీతి ఆరోపణలు

image

నెల్లూరులో అపార్టుమెంట్లకు ఆక్యూపెన్సీ లేకుండానే మార్టిగేజ్‌(రుణాలు)లు రిలీజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 72 అపార్ట్‌మెంట్లకు సంబంధించి పూర్వ కార్పొరేషన్ కమిషనర్లు హరిత, వికాస్ మర్మత్, చెన్నుడులు రూ.18 కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రస్తుత కమిషనర్ ఓ.నందన్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.