Nellore

News April 12, 2025

కావలిలో మోసం

image

కావలిలో మరో మోసం వెలుగు చూసింది. కలిగిరికి చెందిన ఓవ్యక్తి పాతూరు శివాలయం వద్ద నాలుగేళ్లుగా ఉంటూ ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. ముందుగా ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు తీసుకుని నెలకు రూ.7వేలు చొప్పున వాళ్లకు ఇచ్చి నమ్మించాడు. ఆ తర్వాత రూ.2కోట్ల వరకు వసూళ్లు చేసి రూ.లక్షకు రూ.14 వేల చొప్పున ఫిబ్రవరి వరకు ఇచ్చాడు. ఆ తర్వాత ఫోన్ లిప్ట్ చేయలేదు. ఇంటికి సైతం తాళం వేసి ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

News April 12, 2025

NLR: మామా.. నా రిజల్ట్ చూడు రా..!

image

నెల్లూరు జిల్లాలో 53,200 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌లో 28,176 మంది, సెకండియర్‌లో 25,024 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘మామా.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.

News April 12, 2025

కాకాణి జైలుకు వెళ్లడం ఖాయం: సోమిరెడ్డి

image

అధికారంలో ఉన్నప్పుడు క్వార్ట్జ్ ను తవ్వేసి అమ్ముకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ దాక్కొన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వెంకటాచలంలో శుక్రవారం జరిగిన AMC సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమిరెడ్డి మాట్లాడారు. తోపునని తనకు తానే వర్ణించుకున్న కాకాణి దొరికితే జైలుకు వెళ్లడం ఖామన్నారు. కాకాణి మనుషులు మాట్లాడే భాష సరిగా లేదని మండిపడ్డారు.

News April 11, 2025

రైతున్నకు అండగా ఉంటాం: MLA సోమిరెడ్డి

image

కష్టాల్లో ఉన్న రైతన్నకు అండగా నిలుస్తామని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెంకటాచలం మండలం ఇస్కపాళెం, ఈదగాలి, తాటిపర్తిపాళెం, పూడిపర్తి గ్రామాల్లో ఆయన తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పినారు. అకాల వర్షాలతో అన్నదాతకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. సుమారు వెయ్యి పుట్ల ధాన్యం తడిచినట్లు ఆయన పేర్కొన్నారు. 

News April 11, 2025

నెల్లూరు: 50 మందికి 11.40 కోట్ల రుణాలు

image

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో ఫూలే జయంతి శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పూలదండలు వేసి నివాళులర్పించారు. 50 మంది బీసీలకు మంజూరైన రూ.11.4కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 11, 2025

నెల్లూరు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 53,200 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 28,176 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 25,024 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

నెల్లూరు: బ్యాంక్ ఉద్యోగం పేరిట మోసం

image

నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన శ్రీదేవి గతంలో ఓ గోల్డ్‌లోన్ సంస్థలో పనిచేశారు. కలువాయి(M) చవటపల్లికి చెందిన రమ్య లోన్‌కు వెళ్లి శ్రీదేవిని పరిచయం చేసుకుంది. డబ్బులు కట్టడంతో తనకు HYDలో SBI బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ వచ్చిందని రమ్య నమ్మించడంతో శ్రీదేవి ఉద్యోగానికి రూ.9లక్షలు ఇచ్చింది. ఉద్యోగాలు తీసిచ్చే అతను చనిపోయాడంటూ రమ్య తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 11, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరణ

image

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు గురువారం కలెక్టర్ ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్‌ను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జేసీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరణ

image

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు గురువారం కలెక్టర్ ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్‌ను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జేసీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2025

నెల్లూరు జిల్లాలో దారుణం

image

నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపట్టపుపాళెంలో దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వరకట్నం కోసం సుగుణమ్మను వివస్త్రని చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ దాడి చేశారు. ఈ విషయం బయటకొస్తుందని ఆపై కొట్టి చంపేశారు. కళ్లాపి రంగు తాగి ఆత్మహత్య చేసుకుందని హైడ్రామా సృష్టించారు. భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

error: Content is protected !!