Nellore

News July 11, 2024

నెల్లూరు: ఆ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు

image

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యం మేరకు ఆర్టీసి బస్సులు తిప్పనున్నట్లు ఆర్ఎం విజయరత్నం తెలిపారు. జిల్లా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి దర్గా వరకు 44 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్లు ఆర్ఎం చెప్పారు. ఈ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు.

News July 11, 2024

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం

image

విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. ఆలయం నందు జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి ఈవో వివరించారు.

News July 10, 2024

నాయుడుపేట: భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య

image

నాయుడుపేట మండల పరిధిలోని అత్తల పాలెం గ్రామానికి చెందిన పొట్టేలు వెంకటేశ్ (34) భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని క్షణికావేశంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్సలు చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశారు.

News July 10, 2024

నెల్లూరులో గంజాయి ముఠా అరెస్ట్

image

నెల్లూరు నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నవాబ్ పేట పోలీసులు ఆట కట్టించారు. ఏఎస్పీ సిహెచ్ సౌజన్య మాట్లాడుతూ.. రాబడిన సమాచారం మేరకు ఐదుమంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 2 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దటమే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిఘా బృందాలతో నవాబ్ పేట ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

News July 10, 2024

చేజర్ల: మంత్రి ఫ్లెక్సీ చించివేత

image

చేజర్ల మండల పరిధిలోని ఆదూరుపల్లి గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంత్రి ఫ్లెక్సీని ఓవ్యక్తి చించుతుండగా టీడీపీ నేత చీర్ల వెంకటేశ్వర్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకొని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

News July 10, 2024

నెల్లూరు: దివ్యాంగురాలిపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్

image

రాపూరుకు చెందిన ఓ మానసిక దివ్యాంగురాలిపై అదే కాలనీకి చెందిన ప్రేమ్ కుమార్ (25) అనే యువకుడు ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై మాల్యాద్రి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. ఆ ఓ మానసిక దివ్యాంగురాలికి అమ్మానాన్న ఎవరూ లేరని, ఉన్న ఒక అన్న కూడా వికలాంగుడేనన్నారు.

News July 10, 2024

టీటీడీ ఛైర్మన్ పదవి రేసులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి?

image

టీటీడీ నూతన ఛైర్మన్ ఎవరన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదవి కోసం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని తమకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో టీటీడీ ఢిల్లీ అడ్వైజరీ బోర్డు ఛైర్‌పర్సన్‌గా, పాలక మండలిలో సభ్యురాలిగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

News July 10, 2024

నెల్లూరు: ఇన్‌స్టాలో పరిచయంతో అదృశ్యం.. ఎస్సై చొరవతో ఇంటికి

image

అదృశ్యమైన ఇద్దరు బాలికలు ఎస్సై నాగార్జున రెడ్డి చొరవతో సురక్షితంగా ఇళ్లకు చేరారు. పొదలకూరు మండలానికి చెందిన బాలికలు పాఠశాలకు వెళ్తున్నామంటూ సంగం చేరుకున్నారు. ఆ తర్వాత ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి ఇన్‌స్టాలో పరిచయమైన శివప్రసాద్ అనే కడప జిల్లా వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఓ బాలిక ఇంట్లో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

News July 10, 2024

రాపూరులో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం

image

నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం జరిగింది. మతిస్థిమితం సరిగా లేని దివ్యాంగురాలిపై ప్రేమకుమార్ (25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాపూరు ఎస్ఐ మాల్యాద్రి పేర్కొన్నారు. నిందితుడు పరారిలో ఉండటంతో ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News July 10, 2024

నెల్లూరు జైలులో పిన్నెల్లికి 65 ప్రశ్నలు

image

సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పిట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ఆ ఘటనతో తనకు సంబంధం లేదంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది.