Nellore

News July 10, 2024

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ బదిలీ

image

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కార్పొరేషన్‌లో కమిషనర్ సంతకాలను కొందరు ఫోర్జరీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఆయనను బదిలీ చేశారు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు.

News July 10, 2024

రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించిన ఖాదర్ బాషా

image

నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్గా ప్రాంగణంలో జరుగుతున్న పనులను బారాషహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ సమీ, సాబీర్ ఖాన్ తదితర నేతలు మంగళవారం పరిశీలించారు. రొట్టెల పండగకు సుమారు పది లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారికి మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

News July 10, 2024

వెంకటగిరిలో వందేళ్ల చరిత్ర ఉన్న పీర్ల చావిడి

image

వెంకటగిరి పట్టణం ఫీర్జాతిపేటలో సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న హజరత్ హట్లే సాహెబ్ పీర్ల చావిడి ఉంది. ఇది శిథిలావస్థలోకి చేరడంతో గతేడాది తొలగించి హిందూ, ముస్లిం పెద్దల సహకారంతో పునర్నిర్మించారు. ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గతంలో ఈ పీర్ల చావిడిలో ఉన్న పీర్లకు వెంకటగిరి రాజా కుటంబీకులు ఫాతిహా అందించే వారని చెప్పారు.

News July 9, 2024

నెల్లూరు: కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

image

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామసమీపంలోని జొన్నవాడ దశయ్య రొయ్యల గుంటల వద్ద గుర్తుతెలియని వ్యక్తి కరెంట్ షాక్‌తో మంగళవారం చనిపోయాడు. అతను రొయ్యల దొంగతనానికి వచ్చినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. విడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 9, 2024

నెల్లూరు: యువకుడు దారుణహత్య

image

కోవూరులోని రాళ్లమిట్ట ప్రాంతంలో మంగళవారం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో నాగరాజు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వారధిసెంటర్‌కు చెందిన యువకులకు, రాళ్లమిట్టకు చెందిన యువకులకు పాతకక్షలు ఉన్నాయి. ఈక్రమంలో వారధిసెంటర్‌కు చెందిన నాగరాజు రాళ్లమిట్టకు రావడంతో ఇక్కడ యువకులు దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 9, 2024

వెంకటాచలంలో పర్యటించిన కలెక్టర్

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం వడ్డిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఓ ఆనంద్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి పరిశీలించారు. విద్యార్థుల హాజరు, రిజిస్టర్లు, ఇతర వివరాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

News July 9, 2024

రేపు ఆత్మకూరులో వైసీపీ ఆత్మీయ సమావేశం

image

ఆత్మకూరులోని శ్రీధర్ గార్డెన్స్ లో బుధవారం ఉదయం 10.30 గంటలకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని మేకపాటి కార్యాలయ ప్రతినిధులు కోరారు.

News July 9, 2024

నెల్లూరు మీదుగా వెళ్లే పది రైళ్లు రద్దు

image

నెల్లూరుజిల్లా మీదుగా వెళ్లే 10 రైళ్లను ఈ నెల 15-30 తేదీల మధ్య రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే విజయవాడ పీఆర్‌ఓ మడృప్కర్ తెలిపారు. విజయవాడ- GDR మధ్య మూడో రైల్వేలైన ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. GDR- విజయవాడ మధ్య నడిచే రైళ్లు రద్దు కాగా.. ఎర్నాకులం-హౌరా, సత్రగంచి-తాంబరం, హౌరా-బెంగళూరు, మధురై- నినిజాముద్దీన్ రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.

News July 9, 2024

విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి సోమిరెడ్డి: కాకాణి

image

వ్యక్తిగత దూషణలు తప్ప, విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో డైకస్ రోడ్డు లోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇది రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై మీడియాలో, వార్తల్లో అనేక కథనాలు వస్తున్నాయి. వాటిపై మంత్రులు ప్రజలకు స్పష్టత ఇస్తే, బాగుంటుందని కోరామన్నారు.

News July 9, 2024

నెల్లూరు: వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెల్మెట్

image

హెల్మెట్ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం(M) నిడిగుంటపాలెంకు చెందిన సుబమ్మ(58), భర్త ప్రసాద్ సోమవారం విడవలూరు(M) వావిళ్ల నుంచి బైక్‌పై వెంకటాచలం బయలుదేరారు. నెల్లూరు సమీపంలోని ప్రశాంత్ నగర్ కూడలి హైవే వద్దకు రాగానే వెనుక నుంచి టిప్పర్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త హెల్మెట్ ధరించడంతో స్పల్పగాయాలతో బయటపడ్డారు.