Nellore

News April 10, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరణ

image

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు గురువారం కలెక్టర్ ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్‌ను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జేసీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2025

నెల్లూరు జిల్లాలో దారుణం

image

నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపట్టపుపాళెంలో దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వరకట్నం కోసం సుగుణమ్మను వివస్త్రని చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ దాడి చేశారు. ఈ విషయం బయటకొస్తుందని ఆపై కొట్టి చంపేశారు. కళ్లాపి రంగు తాగి ఆత్మహత్య చేసుకుందని హైడ్రామా సృష్టించారు. భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

News April 10, 2025

NLR: నోషనల్ ఖాతాలుగా మార్చేందుకు చర్యలు

image

నెల్లూరు జిల్లాలో భూముల నోషనల్ ఖాతాలను మార్పు చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఆర్వో ఉదయ భాస్కర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భూముల్లో రైతులకు సంబంధించిన రికార్డుల్లో నోషనల్ ఖాతాల నమోదు, వివాదాలు లేని పట్టా భూములకు రెగ్యులర్ నోషనల్ ఖాతా ఇవ్వడానికి ఈనెల 16వ తేదీలోగా తహశీల్దార్, ఆర్డీవోలకు తగిన రికార్డులు సమర్పించాలని సూచించారు.

News April 10, 2025

గుంటూరులో నెల్లూరు మహిళపై దాడి

image

గుంటూరులో నెల్లూరుకు చెందిన మహిళపై దాడి జరిగింది. అక్కడి RTC బస్టాండ్ వద్ద నెల్లూరు మహిళ వ్యభిచారం చేస్తోంది. ఆమెతో బేరం మాట్లాడుకున్న ఓ వ్యక్తి గుంటూరు మణిపురం బ్రిడ్జి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడి చేశారు. రూ.1000 లాక్కొని పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు.

News April 10, 2025

మోసపోయిన నెల్లూరు యువతి

image

నెల్లూరుకు చెందిన సాయిజ్యోత్స్న ఇన్‌స్టాలో ఓ లింక్ క్లిక్ చేయడంతో నితేశ్ అనే వ్యక్తి ఆమెకు వాట్సప్‌లో మెసేజ్ చేశాడు. ఆమె చేత ఓ కంపెనీ వస్తువు ఫీడ్‌బ్యాక్ చేయించి రూ.14వేలు అకౌంట్లో వేశాడు. తమ కంపెనీలో డిపాజిట్లు చేస్తే లాభాలు వస్తాయనడంతో ఆమె రూ.2.50లక్షలు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నట్లు చూపించడంతో విత్ డ్రా పెట్టగా రాలేదు. మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 10, 2025

డైట్‌లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో డిప్యుటేషన్(యఫ్.యస్.టి.సి)పై లెక్చరర్స్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. డైట్‌లో 27 సాధారణ అధ్యాపకులు, ఉర్దూ 22 , ఉపన్యాసకులు 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈ పోస్టులకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వారు అర్హులని తెలిపారు.

News April 10, 2025

VSUలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై అవగాహన

image

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన విద్యా విధానం విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి దోహదపడేలా రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఈపీ-2020 కోఆర్డినేటర్ మధుమతి తదితరులు పాల్గొన్నారు.

News April 9, 2025

కాకాణికి హైకోర్ట్‌లో ఎదురు దెబ్బ 

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అనుబంధ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ డిస్మిస్ చేసింది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని పొదలకూరు పోలీసులు కాకాణిపైన కేసు నమోదు చేసిన విషయం విధితమే.

News April 8, 2025

NLR: పోలీసులపై పర్వత రెడ్డి విమర్శలు

image

నెల్లూరు జిల్లా పోలీసులు అనాలోచితంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏదో రకంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందన్నారు. నాయకులకే రక్షణ లేకపోతే ప్రజల సంగతి ఏంటని ప్రశ్నించారు.

News April 8, 2025

నెల్లూరు: దొంగలు వస్తారు.. జాగ్రత్త!

image

నెల్లూరు జిల్లాలో ఇటీవల దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పడుగుపాడు పంచాయతీలో మధుసూదనరావు, దయాకర్ ఇళ్లకు తాళాలు వేసి HYD వెళ్లగా ఆదివారం రాత్రి నగదు, బంగారం దోచుకెళ్లారు. కోవూరు శాంతినగర్‌కు చెందిన సురేశ్ రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగానే రూ.20వేలు చోరీ చేశారు. సెలవులకు వెళ్లే వాళ్లు, రాత్రిపూట ఇంటి బయట నిద్రించే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. LHMS సేవలు వాడుకోవాలని కోరుతున్నారు.

error: Content is protected !!