India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతసాగరం(M), కమ్మవారిపల్లికి చెందిన ఆర్ వెంకటేశ్వర్లు(46) కువైట్లో సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా కువైట్లో ఓ సేట్ వద్ద పనిచేస్తున్నాడు. అయతే ఆ సేట్ కొన్నినెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. సోమవారం అతని మృతదేహాన్ని కమ్మవారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కోటంరెడ్డి తెలిపారు.
తెలంగాణ వరద బాధితులకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.25 లక్షల చెక్కును అందించారు. ఇటీవల వరదలతో ప్రజలు ఇబ్బందులకు గురవడంతో వారి సహాయార్థం సాయం అందించానన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ గౌడ్, రెండో డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ సోమవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు, వారందరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు
నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
మనుబోలు బీసీ కాలనీలో వినాయక ఉత్సవంలో ఇవాళ సాయంత్రం అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవం కోసం తెచ్చిన తారాజువ్వలపై నిప్పు రవ్వలు పడిన ఘటనలో సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గూడూరు మండలం చెన్నూరు గిరిజన కాలనీ వాసులు వినాయక విగ్రహాన్ని తూపిలిపాళెం సముద్రంలో నిమర్జనం చేసి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా, క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం మిలాద్ ఉన్ నబీ పండగ సెలవు కావడంతో నిర్వహించడం లేదని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రజలు, ఫిర్యాదు దారులు ఈ విషయాన్ని గమనించగలరని పోలీస్ శాఖ అధికారులు కోరారు.
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేటి వెంకట రామారావు తనయులు బొల్లినేని కార్తీక్ , బొల్లినేని ధనుశ్ ఆధ్వర్యంలో ప్రముఖ కాంట్రాక్టర్ గంటా రమణయ్య చేతుల మీదుగా అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం నారా చంద్రబాబు నాయుడుకి రూ.కోటి చెక్కును విరాళంగా అందజేశారు. వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
Sorry, no posts matched your criteria.