India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరులో అపార్టుమెంట్లకు ఆక్యూపెన్సీ లేకుండానే మార్టిగేజ్(రుణాలు)లు రిలీజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 72 అపార్ట్మెంట్లకు సంబంధించి పూర్వ కార్పొరేషన్ కమిషనర్లు హరిత, వికాస్ మర్మత్, చెన్నుడులు రూ.18 కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రస్తుత కమిషనర్ ఓ.నందన్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.
నెల్లూరు జిల్లాలో మొదటి విడత ముగిసిన తర్వాత మిగిలిన బార్లకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత నెల్లూరు కలెక్టరేట్లో లక్కీ డిప్ తీస్తారు. నెల్లూరు, కావలి, బుచ్చి, ఆత్మకూరు, అల్లూరు ప్రాంతాల్లో 31 బార్లకు అవకాశం ఉంది.
నెల్లూరు జిల్లాలోని విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS)కు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని DEO ఆర్.బాలాజీ రావు ఓ ప్రకటనలో సూచించారు. www.bse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. డిసెంబర్ 7వ తేదీన పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నెల్లూరు జిల్లాలో పల్లె రాజకీయం జోరందుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం 3నెలల ముందే నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో జనవరిలోనే <<17606799>>‘పల్లె పోరు’<<>> జరిగే ఛాన్సుంది. జిల్లాలో 722 పంచాయతీలు(సర్పంచ్ స్థానాలు) ఉన్నాయి. వీటితో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. నెల్లూరు కార్పొరేషన్, ఆత్మకూరు, కందుకూరు, కావలి మున్సిపాల్టీలు, బుచ్చి, అల్లూరు నగర పంచాయతీల్లో ఎన్నికలకు కసరత్తు మొదలైంది.
Hiv/aidsపై అవగాహన కల్పించేందుకు ఈనెల 9న నెల్లూరులో 5KM మారథన్ నిర్వహిస్తున్నట్లు DMHO సుజాత వెల్లడించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఉదయం 6గంటలకు కార్యక్రమం మొదలవుతుందన్నారు. 17 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు. ఈనెల 7వ తేదీలోగా 86394 32458కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.7వేలు ఇస్తామన్నారు. ఐడీ కార్డుతో హాజరుకావాలని కోరారు.
టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. బుచ్చిరెడ్డిపాలెం(M) పెనుబల్లి MPPSలో SGTగా పనిచేస్తున్న CHచెన్నయ్య, ఇందుకూరుపేట MKR ప్రభుత్వ జూ.కాలేజ్ లెక్చరర్ డొమినిక్రెడ్డి, అదే మండలంలోని నరసాపురం ZP హైస్కూల్ పీడీ ముజీర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. విజయవాడలో వీళ్లు అవార్డులు అందుకుంటారు.
మనుబోలు మండలం పిడూరుమిట్టలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నన్నూరు జస్వంత్ కుమార్ (16) పది చదువుతున్నాడు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో వినాయక బొమ్మను ఏర్పాటు చేసి బుధవారం ఉదయం బొమ్మను సముద్రంలో నిమజ్జనం చేయుటకు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం శ్రీనివాస సత్రంనకు బయలుదేరి వెళ్లారు. సముద్రంలో నిమజ్జనం చేస్తుండగా జస్వంత్ కుమార్ పడిపోయి చనిపోయాడు. ఎస్సై శివ రాకేశ్ విచారణ చేపట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కలిశారు. దగదర్తి రాచర్లపాడు ఛానల్ పనులలో అక్రమాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 23వేల ఎకరాల పంట బీడు భూములుగా మారుతున్నాయని రైతులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి వెంటనే విచారణ జరిపి న్యాయం చేస్తానని తెలిపినట్లు ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆర్ఆర్ఆర్ (రిపేర్, రెనోవెషన్, రెస్టోరేషన్) స్కీం ద్వారా జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. పంటలకు నీటిని సమృద్ధిగా అందించేందుకు, భూగర్భజలాలు పెంచడమే RRR లక్ష్యమన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. బుచ్చిరెడ్డిపాలెం(M)లోని పెనుబల్లి MPPSలో SGTగా పనిచేస్తున్న CHచెన్నయ్య, ఇందుకూరుపేట MKR ప్రభుత్వ జూ.కాలేజ్ లెక్చరర్ డొమినిక్రెడ్డి, అదే మండలంలోని నరసాపురం ZP హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు ముజీర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
Sorry, no posts matched your criteria.