India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాల్షియం కార్బైడ్ ఉపయోగించి కృత్రిమ పద్ధతిలో పండ్లను మగ్గపెట్టే పండ్ల వ్యాపారులకు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ హెచ్చరించారు. ఏడు శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతోందని, అధికారులు తనిఖీలు వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం గురువారం 11 గంటలకు నెల్లూరు కలెక్టర్ ఓ.ఆనంద్ అధ్యక్షతన జరగనున్నట్లు జల వనరుల శాఖ ఇంజినీర్ డాక్టర్ దేశి నాయక్ తెలిపారు. బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులు ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాని కోరారు. నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ మీటింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
నెల్లూరు టు టౌన్ పరిధిలో సుల్తాన్(40) దారుణ హత్యకు గురయ్యారు. జాకీర్ హుస్సేన్ నగర్, పెన్నా శివారు ప్రాంతంలో బుధవారం రాత్రి దుండగులు ఆయన తల పగలగొట్టి హత్యచేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నవాబుపేట సీఐ అన్వర్ బాషా సిబ్బంది పరిసరాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరు జేసీ కార్తీక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో 41 రైతు సంఘాలకు డ్రోన్స్ ఇస్తున్నట్లు కార్తీక్ పేర్కొన్నారు.
ఓ యువతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద జరిగింది. బాలాజీనగర్ పోలీసుల సమాచారం మేరకు..మర్రిపాడుకు చెందిన రీమాశేఖర్ నారాయణ వైద్యశాలలో బయోమెడికల్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ స్నేహితుడితో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి బెదిరించి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు.
రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కొత్తగా 107పోస్టులు రానున్నాయి. వీటిలో 63 ఎస్జీటీ, 44 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 105 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 61 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 44 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నెల్లూరు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా డిప్యూటీ కలెక్టర్ బి.లీలారాణి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. లీలారాణి గతంలో జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్గా, గూడూరు, కోట మండలాల్లో తహసీల్దార్గా పనిచేశారు. ప్రస్తుతం రాజంపేట భూసేకరణ విభాగంలో పనిచేస్తున్నారు. బదిలీపై నెల్లూరు రానున్నారు.
YCP నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. పొదలకూరు(M) వరదాపురం వద్ద రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వి రూ.250కోట్లు దోచేసిన కేసులో 13 మందిపై కేసులు నమోదు చేశారు. కాకాణి A4గా ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో 7బృందాలతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
పెళ్లి జరిగి ఏడాది తిరగక ముందే నెల్లూరులో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ముదివర్తిపాలేనికి చెందిన స్మైలీ(23), నాగూర్ బాబు(ఇందుకూరుపేట) 7నెలల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మూడో మైలులో నివాసం ఉంటుున్నారు. కులం పేరుతో నాగూర్ ఫ్యామిలీ వేధించడంతో స్మైలీ ఉరేసుకుంది. మూలాపేట పోలీస్ క్వార్టర్స్లో ఉండే ARకానిస్టేబుల్ నాగరాజు 9నెలల కిందట పూర్ణిమను రెండో పెళ్లి చేసుకోగా, కుటుంబ కలహాలతో పూర్ణిమ ఉరేసుకుంది.
రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్గా హుస్సేన్ సాహెబ్ నియమితులయ్యారు. ఆయన గతంలో నెల్లూరు ఆర్డీవోగా పనిచేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. వెయిటింగ్లో ఉన్న ఆయనను తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Sorry, no posts matched your criteria.