Nellore

News June 18, 2024

గూడూరు-రేణిగుంట 3వ రైల్వేలైను‌కు గ్రీన్ సిగ్నల్

image

గూడూరు-రేణిగుంట మధ్య 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ప్రధానమంత్రి జాతీయ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ లైన్ నిర్మించనుంది. ఈ 2 స్టేషన్ల మధ్య 83.17KM దూరానికి రూ.884 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. 2 రైల్వే వంతెనలు, అండర్ పాస్లు నిర్మించాల్సి ఉండగా ఈ ప్రాజెక్టు కోసం 36.58 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ లైన్ పూర్తయితే గూడూరు నుంచి రేణిగుంటకు తక్కువ సమయంలో చేరొచ్చు.

News June 17, 2024

బుచ్చిలో నివాస గృహాల మధ్య వ్యభిచారం

image

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నివాస గృహాల మధ్య గత కొంతకాలం నుంచి విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతోంది. నివాసాల గృహాల మధ్య వ్యభిచారం రోజురోజుకు పెచ్చు మీరడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంతవాసులు వాపోయారు. వ్యభిచార నిర్వహించేవారు విటులను ఆకర్షించేందుకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని ఈ ప్రాంత వాసులు కోరారు.

News June 17, 2024

నెల్లూరు GGHలో మరోసారి పాము కలకలం

image

నెల్లూరు జిల్లా కేంద్రం  జిజిహెచ్‌లో మరోసారి పాము కలకలం రేపింది. జిజిహెచ్ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా చెట్ల మాటున దాగి ఉన్న పాము ఒక్కసారిగా రత్నమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలిపై కాటు వేసింది. దీంతో వైద్య నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఇలాగే పనులు చేస్తుండగా ఓ పారిశుద్ధ్య కార్మికురాలు పాముకాటుకు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

News June 17, 2024

నెల్లూరు: కారుపై పెద్దపులి దాడి

image

నెల్లూరు జిల్లాలో పెద్దపులి దాడి కలకలం రేపింది. మర్రిపాడు మండలంలోని కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో హైవేపై వెళ్తున్న కారుపై సోమవారం ఉదయం పులి దాడి చేసింది. ఒక్కసారిగా రోడ్డుపైకి పులి రావడంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో వాహనం ముందు భాగం ధ్వంసమైంది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. పెద్దపులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

News June 17, 2024

బక్రీద్ ఎఫెక్ట్.. బారాషాహిద్ దర్గాలో సందడి

image

బక్రీద్ సందర్భంగా నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.

News June 17, 2024

నెల్లూరు: MLA అని ఉంచడంపై విమర్శలు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది సీట్లను TDP కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గెలిచిన YCP ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. ఈక్రమంలో సోషల్ మీడియాలోని తమ ఖాతాల్లో కావలి, నెల్లూరు సిటీ, కోవూరు మాజీ MLAలు అని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి అప్‌డేట్ చేశారు. ఆత్మకూరు MLA మేకపాటి విక్రమ్ రెడ్డి అని ఆయన ట్విటర్(X) ఖాతాలో ఇంకా అలాగే ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి.

News June 17, 2024

నెల్లూరు: వాళ్లకు మరోసారి ఛాన్స్ ఇస్తారా..?

image

నెల్లూరు జిల్లా పరిధిలోని గ్రామాల్లో 9,546 మంది, పట్టణ ప్రాంతాల్లో 4,063 మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు గ్రామాల్లో 3,798 మంది, పట్టణాల్లో 941 మంది రాజీనామా చేశారు. మొత్తంగా జిల్లాలో 4,739 మంది విధుల నుంచి తప్పుకొన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లతోనే రాజీనామా చేశామంటూ చాలా మంది వాలంటీర్లు ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేస్తున్నారు. మరి వీళ్లకు తిరిగి విధులు అప్పగిస్తారో లేదో చూడాలి మరి.

News June 17, 2024

అందరిపై అల్లా దయ ఉండాలి: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ ఎం.హరి నారాయణన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దానధర్మాలు, త్యాగాలకు ప్రతీకగా నిలిచే పండగల్లో బక్రీద్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. జిల్లాలోని ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు ఉండాలని.. అందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

News June 16, 2024

నెల్లూరు ప్రజల ఆశలన్నీ నారాయణపైనే..!

image

ఉమ్మడి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. మన జిల్లా వాసి నారాయణకే మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి పదవి రావడంతో సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు. మరి మీ పట్టణంలో సమస్యలు ఏంటో కామెంట్ చేయండి.

News June 16, 2024

నెల్లూరు: సచివాలయ భవనానికి తాళం

image

సచివాలయ భవనానికి నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేసిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగు చూసింది. వాసిలి గ్రామంలో ఐదేళ్లుగా సచివాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. గతంలో అద్దె చెల్లించాలని యజమాని అడగగా.. వైసీపీ నాయకులు చెల్లిస్తామంటూ ముందుకు వచ్చారు. ఇటీవల అద్దె అడగగా.. తమకు సంబంధం లేదని వైసీపీ నాయకులు తప్పుకున్నారు. దీంతో యజమాని సచివాలయానికి తాళం వేశారు.