India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు: ఏపీ NGOS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనను నెల్లూరులోని ఎన్జీవో హోంలో జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వరంలో మంగళవారం సత్కరించారు. ట్రెజరీ అసోసియేషన్ నాయకుడు రమణారెడ్డి, ఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సభ్యులు నంది మండలం ఆంజనేయ వర్మ, లక్కాకుల పెంచలయ్య, గాదిరాజు రామకృష్ణ, రాజేంద్ర సురేష్, డీఈవో రాజేంద్ర, సతీశ్ పాల్గొన్నారు.

ఉద్యానవన శాఖ అధికారులతో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యానవన శాఖ అధికారులు మండలాల్లో ఓ ప్రత్యేక థీంతో పనిచేసి ఆ మండలాలకు గుర్తింపు వచ్చేలా చూడాలన్నారు. వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తేనే నెల్లూరు జిల్లా వైపు అందరిని ఆకర్షించేలా చేయగలమని చెప్పారు. కలువాయి, సైదాపురం, దుత్తలూరులోని కోల్డ్ స్టోరేజ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నెల్లూరు ఈనెల 26వ తేదీ స్పెషల్ డేగా మారనుంది. మాజీ సీఎంవ జగన్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకు రానున్నారు. అదే రోజు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన స్రవంతి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఎన్నిక నామమాత్రమే కానుంది. అయినప్పటికీ అదే రోజు నెల్లూరుకు జగన్ రావడం ఆసక్తి రేపుతోంది.

YCP అధినేత జగన్ ఈనెల 26న నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. VPR కన్వెన్షన్ హాల్లో జరగనున్న వివాహానికి ఆయన హాజరుకానున్నారు. రైల్వే కోడూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత కుమారుడి వివాహంలో జగన్ పాల్గొంటారని సమాచారం.

నెల్లూరు జిల్లా రాజకీయాలు స్థానికతకే ప్రాధాన్యం ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశ రాజకీయాలనే శాసిస్తున్న BJPకి ఇక్కడ గౌరవం ఇవ్వడం లేదంట. తమను ఆహ్వానించాలని మంత్రుల పీఏలను BJP నేతలు కోరుతున్నా ఖాతరు చేయడం లేదంట. వక్ఫ్ బోర్డు స్థలంలో చేపడుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపనకు, 47వ డివిజన్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన కార్యక్రమాలకు పిలవలేదంట, కూటమిలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని నేతలు వాపోతున్నారు.

నెల్లూరు మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరు వినబడుతుంది. మాజీ మేయర్ స్రవంతిని అవిశ్వాసం పెట్టి దించిన తర్వాత.. అదే సామాజిక వర్గానికి చెందిన ఈమెను TDP తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్టీ జనరల్కు కేటాయించినా.. మహిళకే ప్రాధాన్యం ఇస్తే ఈమె ముందు వరుసలో ఉంది. TDP తరఫున 47 మంది, YCP నుంచి ఏడుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. వీరు 26న జరిగే సమావేశంలో మేయర్ను ఎన్నుకోనున్నారు.

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. ఈ జాతరకు ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.

* ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
* నెల్లూరు జిల్లాలో 53,404 మంది ఇంటర్ విద్యార్థులు
* ఫస్ట్ ఇయర్ 26,935 మంది
* సెకండ్ ఇయర్ 26,469 మంది
* జిల్లాలో 81 పరీక్షా కేంద్రాలు
* 1150 మంది ఇన్విజిలేటర్ల నియామకం
* సిట్టింగ్ స్క్వాడ్స్ 5.. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 4 ఏర్పాటు
* పరీక్షా సమయం 9AM నుంచి 12PM
* ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్స్
*పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్, సామాగ్రి సిద్ధం చేసుకోండి

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో గుడిపాటి రమణయ్య ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైకుకు నిప్పంటించారు. రెండు రోజుల క్రితం ఇంటి గేటుకు కరెంట్ వైర్ తగిలించిన ఘటనతో కుటుంబం భయాందోళనలో ఉంది. తమపై కుట్ర జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నెల్లూరు DMHO 15 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ), DMLT, BSc MLT, LLB, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపటి వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://spsnellore.ap.gov.in
Sorry, no posts matched your criteria.