India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.16లకే విక్రయిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ AD అనిత కుమారి తెలిపారు. ప్రభుత్వం కర్నూలు ఉల్లి రైతులను ఆదుకొనే క్రమంలో ప్రభుత్వం ఉల్లిపాయలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. నెల్లూరులోని ఫత్తేఖాన్పేట, నవాబుపేట రైతు బజార్లు, కందుకూరు, పొదలకూరు, కావలి రైతు బజారులకు 5టన్నుల ఉల్లిని సరఫరా చేసిందని పేర్కొన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నెల్లూరు జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం యశస్వి స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించింది. వార్షికాదాయం రూ.2.50లక్షల లోపు ఉన్న బీసీ, ఓబీసీ, మైనార్టీ, డీఎన్టీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. 9, 10వ తరగతి వాళ్లకు రూ.75 వేలు, ఇంటర్ వాళ్లకు గరిష్ఠంగా రూ.1.25లక్షలు స్కాలర్షిప్గా ఇస్తారు. ఈ <
Share It.
కావలిలో చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కుటుంబం 3ఏళ్ల కిందట కావలి మండలానికి వలస వచ్చింది. వీరికి కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉంది. తల్లి కూరగాయల కోసం వెళ్లినప్పుడు బ్రహ్మయ్య(20) బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న లేడీ డాన్ అరుణపై మరో కేసు నమోదైంది. ఆస్తి వివాదంలో తలదూర్చి తనను అరుణ గన్తో బెదిరించిందని నెల్లూరు నవాబుపేటకు చెందిన శశి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాను ఆసరాగా చేసుకుని అరుణ సెటిల్మెంట్కి ప్రయత్నం చేసింది. ఈక్రమంలో శశికుమార్ వినకపోవడంతో అతన్ని గన్తో బెదిరించింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగస్టు నెలలో 3 అల్పపీడనాలు ఏర్పడి రాష్ట్రంలోని 25 జిల్లాలపై వర్షాలు ప్రభావం చూపాయి. వాటిలో 6 జిల్లాల్లో 20% నుంచి 50% వరకు వర్షపాతం నమోదైంది. అయితే ఒక్క నెల్లూరులో మాత్రమే 20% కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురంలో మాత్రం ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైంది. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా వాగులు, వంకలు పోంగిపోర్లాయి.
నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి పదవి పోతుందా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. ఆమె YCP తరఫున మేయర్గా గెలిచారు. కూటమి అధికారంలో రావడంతో YCPకి రాజీనామా చేసి TDPలోకి చేరే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మరోవైపు పదవీకాలం నాలుగేళ్లు పూర్తివడంతో TDP అధిష్ఠానం త్వరలోనే అవిశ్వాసతీర్మానం పెట్టి మేయర్ను పదవి నుంచి దించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా మేయర్ పదవికి మరో ఏడాది ఉండగానే గండం ఏర్పడే పరిస్థితి నెలకొంది.
వెంకటాచలం(M) కంటెపల్లిలో ఏడేళ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలనుకున్న క్రికెట్ స్టేడియం కార్యరూపం దాల్చాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించాలనుకున్న స్టేడియం కోసం అప్పట్లో 50 ఎకరాలు భూసేకరణ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో దానిని పట్టించుకోక పోవడంతో బీడు భూమిగా నిలిచింది. మళ్లీ వచ్చిన కూటమి ప్రభుత్వంలో అయినా స్టేడియం నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సోమశిల – నెల్లూరు రహదారిలో సోమశిల సమీపంలోని ఆశ్రమం వద్ద ఉన్న బ్రిడ్జిపై రంధ్రం పడడంతో రాకపోకలకు నిలిపివేసి మలుపులో తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తున్నారు. మంగళవారం మలుపు వద్ద ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు పొరపాటున రోడ్డు దాటి దిగువకు జారిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
ముత్తుకూరు (M) బోడి స్వామి కండ్రిగలో జరిగిన వినాయక నిమజ్జనంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. వినాయక నిమజ్జనం కోసం టాక్టర్ ను నీటితో శుభ్రం చేస్తుండగా వివాదం తలెత్తింతి. ఓ వర్గం రాళ్లు రువ్వినట్లు మరో వర్గం ఆరోపించారు. దీంతో ఇరువర్గాలలో పలువురికి గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
కావలి టూ టౌన్ పరిధికి చెందిన ఓ వ్యక్తిని ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ మార్కెట్లో కువేర అనే కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఓ వ్యక్తి నమ్మపలికారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆ కంపెనీ షేర్ మార్కెట్లో రూ.50 లక్షల పెట్టుబడి పెట్టి ఆదాయం కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.