Nellore

News September 15, 2024

బొల్లినేని కుటుంబ సభ్యులు రూ.కోటి విరాళం

image

ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేటి వెంకట రామారావు తనయులు బొల్లినేని కార్తీక్ , బొల్లినేని ధనుశ్ ఆధ్వర్యంలో ప్రముఖ కాంట్రాక్టర్ గంటా రమణయ్య చేతుల మీదుగా అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం నారా చంద్రబాబు నాయుడుకి రూ.కోటి చెక్కును విరాళంగా అందజేశారు. వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

News September 15, 2024

జాతీయ లోక్ అదాలత్‌లో మూడోసారి నెల్లూరుకు ప్రథమ స్థానం – జిల్లా జడ్జి

image

జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 24,972 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి సి.యామిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించిందని లోక్ అదాలత్ కార్యక్రమాలపై నిరంతర దృష్టిపెట్టడంతో నెల్లూరు జిల్లా మూడో సారి రాష్ట్రంలో మొదటి స్థానం దక్కించుకోవడంపై పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 15, 2024

జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరదలు: సోమిరెడ్డి

image

నెల్లూరు మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేరు ఆధునికీకరణకు 2019లో టీడీపీ టెండర్ పిలిస్తే, వైసీపీ విస్మరించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వరద బాధితులను పరామర్శించేందుకు సైతం జగన్ ఆర్భాటాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్‌కు క్యూసెక్, టీఎంసీ, అవుట్ ఫ్లో అంటే అర్థాలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు.

News September 15, 2024

నెల్లూరు: బామ్మర్దిని గొంతు నులిమి చంపిన బావ

image

నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్‌ HYD గచ్చిబౌలిలో హాస్టల్‌ నడుపుతున్నాడు. అయితే ఆన్‌లైన్‌ గేమింగ్‌తో పాటు పలు వ్యసనాల వల్ల భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. బామ్మర్ది యశ్వంత్‌ని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని భావించాడు. తన స్నేహితుడు ఆనంద్‌, వెంకటేశ్‌తో కలిసి యశ్వంత్‌‌ను చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు.

News September 15, 2024

పెంచలకోనలో పవిత్రోత్సవాలు

image

రాపూరు మండలం పెంచలకోనలో స్వయంభుగా వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం నుంచి బుధవారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయసాగర్ బాబు తెలిపారు. మూడురోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, హోమములు, అభిషేకము, బుధవారం మహా పూర్ణాహుతి, మహా కుంభ ప్రోక్షణ జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

News September 14, 2024

సూళ్లూరుపేట: ప్రేమ వ్యవహారం.. థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి

image

తిరుపతిలోని సినిమా థియేటర్‌లో ఎంబీయూ యూనివర్శిటీ విద్యార్థి లోకేశ్‌పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తో పాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరు పేట కాగా, బాధితుడిది ప్రకాశం జిల్లా గిద్దలూరుగా గుర్తించారు.

News September 14, 2024

మాజీ సీఎం జగన్‌కు సోమిరెడ్డి కౌంటర్

image

మాజీ సీఎం జగన్‌‌కి సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయవాడకు వచ్చిన వరదలపై జగన్ విమర్శిస్తున్న తీరును తప్పుబట్టారు. విపత్తులు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అయితే , రూ. లక్షల కోట్లు దాచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

News September 14, 2024

నెల్లూరు: ఈనెల 20న మెగా జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణాభివృద్ధి అధికారి సి. విజయవినీల్ కుమార్ తెలిపారు. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఉదయం 9.30 – 2 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 10,ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ చేసిన వారు అర్హులు.

News September 14, 2024

సూళ్లూరుపేట: మిస్సైన అమ్మాయి ఆచూకీ లభ్యం

image

సూళ్లూరుపేట పట్టణంలో శుక్రవారం ట్యూషన్ కోసమని ఇంటి నుంచి వెళ్లి ఆఫ్రీన్(12) మిస్సైన సంగతి తెలిసిందే. అయితే బాలిక ప్రస్తుతం చెన్నై పోలీసుల చెంత సురక్షితంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పాప చెన్నైకి వెళ్లి ఓ ఆటో ఎక్కి తనను బీచ్ వద్దకు చేర్చమని ఆటో వ్యక్తికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు కుటుంబీకులు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు.

News September 14, 2024

నెల్లూరు: రిజిస్ట్రేషన్ శాఖలో ముగ్గురు అధికారులపై వేటు

image

నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరిగిన ఆక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. కార్పొరేషన్ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన జాఫర్, మిల్కిరోషన్, సింహాద్రిలను సస్పెండ్ చేసినట్లు డీఐజీ కిరణకుమార్ తెలిపారు.