India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు కలెక్టర్ <<19137448>>దంపతులు<<>> హిమాన్షు శుక్లా, కృతిక(పల్నాడు). వీరు ఒకే వృత్తిలో ఉంటూ ఉద్యోగానికి.. ఫ్యామిలీకి సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. వృత్తి రీత్యా ఇద్దరూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ వారానికో రోజు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు హిమాన్షు Way2Newsకు వివరించారు. ఓ వారం తాను.. మరో వారం తన భార్య నెల్లూరు to పల్నాడుకు జర్నీ చేస్తూ సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

నేటి యువత భవిష్యత్తులో స్థిరపడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే తమకు ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. <<19130524>>ప్రేమికుల రోజు<<>>ను పురస్కరించుకొని Way2Newsతో ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యువత మొదట చదువు పూర్తి చేసి, మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని వివరించారు. #Valentine’s Day

నెల్లూరు రైల్వే స్టేషన్లో తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి మూడో నెంబర్కు వెళుతుండగా అకస్మాత్తుగా రైలు కదలడంతో రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడి వయస్సు 40-45 ఏళ్లు ఉంటుంది. ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు.

మన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్సోరీలో శిక్షణలో ఉండగా 2013లో కృతికా(పల్నాడు కలెక్టర్) పరిచయమయ్యారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో పరస్పరం ఇష్టపడ్డారు. తమ కెరీర్కు ప్రాధాన్యమిస్తూనే ముందుకు సాగారు. తల్లిదండ్రులను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ష్(8), పాప అహిల్యా(18 నెలలు) ఉన్నారు. లవర్స్ డే నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని ఆయన Way2Newsకు వివరించారు.

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.

శివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి పలు ప్రాంతాలకు RTC తరఫున 147 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ప్రజా రవాణా అధికారి షేక్ షమీం తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. 14, 15, 16వ తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ, సిద్ధేశ్వరం, మైపాడు తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.

పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వెంకటాచలం సర్పంచ్ మందల రాజేశ్వరిపై గతంలోనే సస్పెన్షన్ వేటుపడింది. తాజాగా గురువారం ఆమెను శాశ్వతంగా తొలగిస్తూ నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ అధికార దుర్వినియోగంతో తన భర్త వెంకటశేషయ్య అకౌంట్లోకి అక్రమంగా నగదు తరలింపు, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అకాల వర్షాలు, కరవు, పెరిగిన సాగు ఖర్చులు, అధిక వడ్డీల భారం రైతు మెడకు ఉరితాడుగా మారుతున్నాయి. జిల్లాలో 2021(2), 2022(6), 2023(1), 2024(3), 2025(3) చొప్పున 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 8 మందికి రూ.7లక్షలు చొప్పున రూ.56 లక్షలు పరిహారం అందగా, 3 దరఖాస్తులు రిజెక్ట్ చేయగా, 3 ప్రతిపాదనలు పంపగా.. ఒకరిది అగ్రికల్చర్ లాగిన్లోకి రాలేదు. ప్రభుత్వాలు పంటకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అకాల వర్షాలు, కరవు, పెరిగిన సాగు ఖర్చులు, అధిక వడ్డీల భారం రైతు మెడకు ఉరితాడుగా మారుతున్నాయి. జిల్లాలో 2021(2), 2022(6), 2023(1), 2024(3), 2025(3) చొప్పున 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 8 మందికి రూ.7లక్షలు చొప్పున రూ.56 లక్షలు పరిహారం అందగా, 3 దరఖాస్తులు రిజెక్ట్ చేయగా, 3 ప్రతిపాదనలు పంపగా.. ఒకరిది అగ్రికల్చర్ లాగిన్లోకి రాలేదు. ప్రభుత్వాలు పంటకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Sorry, no posts matched your criteria.