Prakasam

News April 20, 2025

ప్రకాశం: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది

image

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 24 రోజులు పెళ్లిళ్లకు మంచి గడియలు ఉన్నాయి. మండు వేసవి అయినప్పటికీ మంచిగడియల్లో పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో ప్రకాశం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో కేవలం వివాహాల మీదనే రూ.30 కోట్ల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణ మండపాలు, గోల్డ్, బట్టల షాపులు సందడిగా మారాయి.

News April 20, 2025

DSC: ప్రకాశం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

image

డీఎస్సీ-2025 ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 629 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:39
➤ హిందీ:23 ➤ ఇంగ్లిష్: 95
➤ గణితం: 94 ➤ఫిజిక్స్: 76
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 106
➤ పీఈటీ: 72 ➤ ఎస్జీటీ:106
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో తెలుగు 2, హిందీ 4, ఆంగ్లం 4, గణితం 1, ఫిజిక్స్ 2, బయాలజీ 2, సోషల్ 2, ఎస్టీటీ 26 భర్తీ చేస్తారు.

News April 20, 2025

ఒంగోలు: ‘జిల్లా అభివృద్ధి చెందేలా చర్యలు వేగవంతం చేయాలి’

image

వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లా అన్ని విధాలా అభివృద్ది చెందేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జిల్లాకు తనను ప్రత్యేక అధికారిగా నియమించిందని తెలిపారు.

News April 19, 2025

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధు నియామకం

image

టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన పైనం మధుబాబు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకి, జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.

News April 19, 2025

పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారిగా పురోగతి సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లాలో పీ.ఎం. సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు 78,766 దరఖాస్తులు రాగా, అందులో 1115 గ్రౌండింగ్ చేయగా, 736 మందికి సబ్సిడీ జమ చేసినట్లు పేర్కొన్నారు.

News April 19, 2025

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

ఒంగోలు గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిజ్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ శిక్షణ మే నెల 21 నుంచి జూన్ 19వ తేదీ వరకు ఉంటుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని, శిక్షణ సమయంలో భోజనం, వసతి పూర్తిగా ఉచితం అని తెలిపారు. 

News April 19, 2025

రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.

News April 19, 2025

సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

image

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 19, 2025

ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

image

ఇటీవల ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 18, 2025

క్రికెట్ బెట్టింగ్ కేసులో సింగరాయకొండ వాసి అరెస్ట్

image

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సింగరాయకొండకు చెందిన వైసీపీ నేత వెంకట్రావు గురువారం అరెస్టయ్యారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన కడప వాసి సతీశ్ కుమార్ వెంకట్రావుకు రూ. 2 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ నగదు కోసం వేధిస్తున్నాడని సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించి నెల్లూరు జైలుకు తరలించారు. 

error: Content is protected !!