India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గజ్జలకొండ-మార్కాపురం సెక్షన్లో సోమవారం రాత్రి రైల్వే సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. రేపల్లెకు చెందిన కుటుంబం కొండవీడు ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి బయలుదేరారు. ప్రయాణికుడు అదుపుతప్పి కింద పడిపోగా.. కుటుంబీకులు చైన్ లాగి సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆ మార్గంలో మరో రైలుకు సిగ్నల్ ఇవ్వకుండా చర్యలు తీసుని రైలును సిబ్బంది కి.మీ వెనక్కి తీసుకెళ్లారు. బాధితుడిని MRK స్టేషన్లో దించి ఆసుపత్రికి తరలించారు.
ఒంగోలులోని ఓ బంగారు షాపులో కొత్త బంగారు చైన్ తయారు చేయిస్తానంటూ షాపు యజమాని మోసం చేసినట్లు ఓ మహిళ సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశారు. బంగారం షాపులో కొత్త చైను కోసం రూ.3 లక్షల నగదు చెల్లించి, పాత చైన్ కూడా అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రకాశం జిల్లాలో మంగళవారం డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు జనసేన సిద్ధమవుతోంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర సరుకులు పంపిణీ, పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ సోమవారం ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని తెలిపింది.
ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీ-కోసం కార్యక్రమానికి భారీగా ఫిర్యాదుదారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ స్వయంగా వారి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎస్పీ మీ-కోసం కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరం వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు.
ఒంగోలులోని రూడ్ సెట్ కార్యాలయంలో ఈనెల 11 నుంచి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్పై ఉచిత శిక్షణ అందించనున్నారు. జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ మహిళలు అందరూ అర్హులు. 19 నుంచి 45 ఏళ్లు వయసు కలిగిన వారికి భోజనం, వసతితో ఉచితంగా శిక్షణ ఇస్తారు. మరిన్ని వివరాలకు రూడ్ సెట్ ఆఫీసును సంప్రదించాలి.
వినాయక చవితికి స్వగ్రామానికి వచ్చిన యువకుడు చనిపోయిన ఘటన ఇది. మార్కాపురం మండలం గొట్టిపడియకు చెందిన కొండారెడ్డి HYDలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు వచ్చి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి మార్కాపురం వెళ్లాడు. తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా కోమటికుంట వద్ద కారు ఢీకొని చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారుపై CMO అని ఉంది.
తాడిని తన్నేవాడుంటే, వాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడనే సామెత పెద్దలు ఊరికే చెప్పలేదేమో. ప్రకాశం జిల్లాలో సేమ్ టు సేమ్ అలాంటి ఘటనే జరిగిందని తెలుస్తోంది. టంగుటూరుకు చెందిన ఓ వ్యాపారి వద్ద పని చేసే గుమస్తా అనుమానం రాకుండా ఏకంగా రూ.20 కోట్లు దండుకున్నాడట. ఈ గుమస్తా ఖాతాను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు సుమారు రూ.7కోట్లు కొట్టేశారని వదంతులు. ఇందులో ఏది నిజమో కానీ, అసలు విషయం వెలుగులోకి రావాల్సి ఉంది.
ఒంగోలులో ఆదివారం సుందరకాండ చిత్రం యూనిట్ సందడి చేసింది. హీరో నారా రోహిత్ నటించిన సుందరకాండ చిత్రం విజయాన్ని అందుకోవడంతో అన్ని జిల్లాల పర్యటన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా రోహిత్, చిత్ర బృందంతో కలిసి ఆదివారం ఒంగోలుకు వచ్చారు. ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్దకు రాగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మార్కాపురం మండలం కోమటికుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి గొట్టిపడియ గ్రామానికి చెందిన కొండయ్యగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఇద్దరిని ఒంగోలు రిమ్స్కు తరలించారు.
Sorry, no posts matched your criteria.