Prakasam

News January 7, 2026

జగన్‌పై మంత్రి స్వామి విమర్శలు

image

పబ్లిసిటీ పిచ్చితో పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేసుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి స్వామి విమర్శించారు. కొండపి మండలం తాటాకులపాలెంలో ఆయన బుధవారం పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రికార్డులను తారుమారు చేయడానికి వీలులేని విధంగా కొత్తపాస్ పుస్తకాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రతి దశలో అన్నదాతకు అండగా ఉంటున్నామన్నారు.

News January 7, 2026

9న ఒంగోలులో జాబ్ మేళా..రూ.22వేల శాలరీ!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 18 నుంచి 30ఏళ్ల మధ్యగల యువతీ, యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. 10 నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని, నియమితులైనవారికి 22వేల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు.

News January 7, 2026

రామాయపట్నం పోర్టు పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలో అధికారులతో సమావేశమైన ఆయన ప్రస్తుత పనుల పురోగతి, భూసేకరణ స్థితిగతులపై ఆరా తీశారు. డ్రెడ్జింగ్, బెర్త్ వర్క్స్, ఆన్‌షోర్ వర్క్స్, రైల్వే లైన్ నిర్మాణం, రోడ్డు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు.

News January 7, 2026

మార్కాపురం: హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారి ఇతనే.!

image

మార్కాపురం జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారిగా శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ హౌసింగ్ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాణ్యతతో గృహాల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.

News January 7, 2026

కనిగిరి హత్య కేసులో మరో ట్విస్ట్.!

image

వెలిగండ్ల మండలంలోని కట్టకిందపల్లిలో మహిళను చంపి, ఆపై AR కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంగళవారం క్లూస్‌టీం రంగంలోకి దిగింది. సీనావలి, నాగజ్యోతి మృతదేహాలకు కనిగిరి ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. జ్యోతి మృతదేహాన్ని కట్టకిందపల్లికి తరలించేందుకు యత్నించగా మృతురాలి బందువులు న్యాయం చేయాలని పోలీసులను నిలదీశారు. వీరిరువురి మృతిపై <<18773256>>మూడవ వ్యక్తి ప్రమేయం<<>> ఉందేమోనని పోలీసులు ఆరాతీస్తున్నారు.

News January 7, 2026

ప్రకాశం: మోసంచేసి రన్నింగ్ బస్ దూకి మృతి

image

టంగుటూరుకు చెందిన మురళి చిలకలూరిపేట నుంచి ఒంగోలుకు RTC బస్సులో వస్తున్నాడు. జాగర్లమూడివారిపాలెంకి చెందిన గోపీనాథ్(24) అదే బస్సులో మేదరమెట్ల వద్ద ఎక్కాడు. తనకు రూ.200 ఫోన్‌పే చేయాలని మురళిని అడిగి కొడుతుండగా పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకున్నాడు గోపీ. మరోసారి మురళిని ఫోన్ అడిగి రూ.90వేలు ట్రాన్ఫర్ చేసుకున్నాడు. మురళి గమనించి అడగగా గోపీ రన్నింగ్ బస్ నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కాగా మంగళవారం చనిపోయాడు.

News January 7, 2026

మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

News January 7, 2026

మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

News January 6, 2026

మార్కాపురం జిల్లాకు 59 మంది ఇన్‌ఛార్జ్ అధికారులు

image

మార్కాపురం నూతన జిల్లా ఏర్పడిన రోజు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అధికారులను జిల్లా ఇన్‌ఛార్జ్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జిల్లాకు ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన 59 మంది ఇన్‌ఛార్జ్ జిల్లా అధికారులను నియమించారు.

News January 6, 2026

ప్రకాశం, మార్కాపురం జిల్లాలు.. అసలు రూపం ఇదే!

image

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని అధికారులు రూపొందించారు. ప్రకాశం జిల్లా 28 మండలాలు, 520 గ్రామాలతో ఉండగా.. మార్కాపురం జిల్లా 21 మండలాలతో 508 గ్రామాలతో స్వరూపాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక విస్తీర్ణం విషయంలో ప్రకాశం జిల్లా 15,58,828.77 ఎకరాలు, మార్కాపురం 14,82,757.24 ఎకరాలు ఉంది.