Prakasam

News March 29, 2026

ఒంగోలు ప్రజలకు గమనిక

image

ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీకోసం కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 29, 2026

సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వండి: మార్కాపురం కలెక్టర్

image

మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.

News March 29, 2026

ప్రకాశం: IPL.. జిల్లా SP స్ట్రాంగ్ వార్నింగ్..!

image

ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టపరమైన శిక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో ఈ బెట్టింగ్ మాఫియాపై నిఘా పెంచినట్లు తెలిపారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండి, క్రికెట్‌ను కేవలం వినోదంగానే చూడాలని సూచించారు.

News March 28, 2026

ఒంగోలు: కుక్క అడ్డు రావడంతో ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్‌ మృతి

image

ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణయ్య శనివారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో పోలీస్ శాఖలో, కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News March 28, 2026

ఒంగోలు: కుక్క అడ్డు రావడంతో ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్‌ మృతి

image

ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణయ్య శనివారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో పోలీస్ శాఖలో, కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News March 28, 2026

ఒంగోలు: కుక్క అడ్డు రావడంతో ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్‌ మృతి

image

ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణయ్య శనివారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో పోలీస్ శాఖలో, కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News March 28, 2026

మార్కాపురం బస్సు ప్రమాదం.. పరారీలో ఉన్న యజమాని అరెస్ట్

image

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాద సమయంలో బస్సు యజమాని హరికృష్ణే వాహనాన్ని నడిపినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ప్రమాదం తర్వాత పరారైన అతడిని కనిగిరిలో అరెస్టు చేసి మార్కాపురం తరలించారు. కాలం చెల్లిన బస్సు కావడం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

News March 28, 2026

మార్కాపురం బస్సు ప్రమాదం.. పరారీలో ఉన్న యజమాని అరెస్ట్

image

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాద సమయంలో బస్సు యజమాని హరికృష్ణే వాహనాన్ని నడిపినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ప్రమాదం తర్వాత పరారైన అతడిని కనిగిరిలో అరెస్టు చేసి మార్కాపురం తరలించారు. కాలం చెల్లిన బస్సు కావడం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

News March 27, 2026

మార్కాపురం జిల్లాలో ఆ బస్సులు చాలా డేంజర్..!

image

మార్కాపురం ప్రమాదంతో నెల్లూరు (D) కలిగిరికి చెందిన <<19487686>>హరికృష్ణ <<>>ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన డొక్కు బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని సమాచారం. వాటిపై పాత ట్రావెల్స్ పేర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రయాణ సమయంలో తరచూ రిపేర్లకు గురవుతుంటాయని.. చాలాసార్లు మార్గమధ్యంలోనే బస్సులను మారుస్తుంటారని అందులో ప్రయాణించిన వాళ్లు చెబుతున్నారు.

News March 27, 2026

చీమకుర్తి వద్ద ప్రమాదం.. విద్యార్థి స్పాట్‌డెడ్

image

చీమకుర్తి బైపాస్‌లో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై వేగంగా వస్తున్న ముగ్గురు స్కూల్ విద్యార్థుల బైక్ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, గాయపడిన వారు చీమకుర్తిలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.