Prakasam

News June 26, 2024

పర్చూరు: మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు.. కేసు నమోదు

image

పర్చూరు ప్రాంతానికి చెందిన వివాహిత కందుకూరులో మహిళ పోలీసుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త యూపీ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల తరచూ భర్త తనను బెదిరించడంతో పాటు, వేధిస్తున్నాడని ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

News June 26, 2024

జగన్‌పై మండిపడ్డ మంత్రి గొట్టిపాటి రవి

image

స్పీకర్ పై మంగళవారం జగన్ రాసిన లేఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైన ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని లేకపోతే క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతందని విమర్శించారు. ‘ప్రజలు జగన్ ను పాతాలానికి తొక్కేసినా చంద్రబాబు పెద్దమనసుతో గౌరవం ఇచ్చి అసెంబ్లీలో గౌరవం లభించేలా చేశారన్నారు. జగన్ వక్రభాష్యంతో లేఖ రాశారన్నారు’.

News June 26, 2024

ఒంగోలు: అంబులెన్స్ వాహనాల్లో ఉద్యోగ అవకాశాలు

image

జిల్లాలో 1962 పశు సంచార అంబులెన్స్ వాహనాలకు సంబంధించి ఖాళీగా ఉన్న పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ నెమలి శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా పైలట్ పోస్టుకి పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి హెవీ లైసెన్స్ లేదా బ్యాడ్జి లైసెన్స్ కలిగి ఉండాలన్నారు . ఈ నెల 28వ తేదీ ఒంగోలు బస్టాండ్ సమీపంలో ఉన్న కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News June 26, 2024

ఒంగోలులో దారుణ హత్యను ఛేదించిన పోలీసులు

image

ఒంగోలులో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వారి వివరాల మేరకు.. యూపీకి చెందిన ధ్రువ్ చంద్రవర్మ ఒంగోలులో ఉంటూ మేస్త్రీ పనిచేస్తుంటాడు. శ్రీవాస్తవ అనే యువకుడు ధ్రువ్ వద్ద పనికి కుదిరి, రూ.10 వేలు కావాలనగా సాధ్యం కాదని చెప్పాడు. శ్రీవాస్తవ కోపంతో చంపేస్తానని బెదిరించాడు. కూలీల ముందు తనను అవమానించాడని రాంచరణ్ అనే వ్యక్తితో కుట్ర పన్ని శ్రీవాస్తవని గొంతు కోసి హత్య చేశారు.

News June 25, 2024

ప్రకాశం: షాప్ ముందుకు నీళ్లు వచ్చాయని మర్డర్: ఎస్సై

image

చీరాలలో ఈనెల 23న పట్టపగలు జరిగిన హత్యలో నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. పోలీసుల వివరాలు.. కర్రీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు కే.సంతోష్‌ రోడ్డుపై బబుల్‌తో నీళ్లు దొర్లించాడు. పక్కనే ఉన్న పండ్లషాప్ ముందుకు వెళ్లడంతో అందులో పనిచేసే ఉమామహేశ్వరరావు వాగ్వావాదానికి దిగాడు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. షాపు యజమాని యోసేఫ్‌ ప్రోద్బలంతో కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు.

News June 25, 2024

ప్రకాశం: పెరిగిన ధరతో లబ్ధి ఎంతంటే..

image

జిల్లాలో 4.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతున్నాయి. అందులో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎకరాకు సగటున 1,900 కిలోల వరి దిగుబడి లభిస్తుంది. రూ.117 అదనపు ధర లభించడంతో వరి రైతులకు రూ.95కోట్లు అదనంగా సమకూరనుంది. మొక్కజొన్న మీద క్వింటాకు రూ.135 పెరగడంతో అదనంగా రూ.3,750 లాభం రానుంది. పత్తిపై అదనంగా క్వింటాకు రూ.501 పెంచడంతో అదనంగా రూ.6వేల వరకు లాభం చేకూరనుంది.

News June 25, 2024

ఈనెల 27న మార్కాపురంలో జాబ్ మేళా

image

మార్కాపురంలో ఈనెల 27న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సోమవారం ప్రిన్సిపల్ నరేంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఏడు కంపెనీలకు చెందిన వారు పాల్గొని, విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఐటీఐ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ మేళాలో పాల్గొనాలని సూచించారు.

News June 25, 2024

ప్రకాశం జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే.?

image

టీచర్ ఉద్యోగం కలల స్వప్నాన్ని ప్రభుత్వం సాకారం చేసేందుకు సిద్ధమైంది. మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 DSC పోస్టులకు గానూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 124 ఎస్టీటీలతో కలిపి మొత్తం 672 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించనున్నారు.

News June 25, 2024

27న జిల్లాకు కొత్త కలెక్టర్ తమీమ్ అన్సారియా

image

జిల్లాకు తాజాగా నియమితులైన కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈనెల 27న రానున్నారు. ఆరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయిన ఏఎస్ దినేష్ కుమార్ ఈనెల 26న రిలీవ్ కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు జిల్లా అధికారులు వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు.

News June 25, 2024

ఒంగోలులో యువకుడి గొంతు కోసి హత్య

image

ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకుడిని సోమవారం రాత్రి అత్యంత కిరాతకంగా గొంతు కోసి ఎన్నెస్పీ కాలువలో పడేశారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో చెప్పులు మాత్రమే ఉన్నాయని వేరే ఆధారాలు లభించలేదన్నారు. మృతుడు బిహార్ లేదా యూపీకి చెందిన వలస కూలీగా భావిస్తున్నామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు DSP కిషోర్ బాబు తెలిపారు.