India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలులో ఆదివారం సుందరకాండ చిత్రం యూనిట్ సందడి చేసింది. హీరో నారా రోహిత్ నటించిన సుందరకాండ చిత్రం విజయాన్ని అందుకోవడంతో అన్ని జిల్లాల పర్యటన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా రోహిత్, చిత్ర బృందంతో కలిసి ఆదివారం ఒంగోలుకు వచ్చారు. ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్దకు రాగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మార్కాపురం మండలం కోమటికుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి గొట్టిపడియ గ్రామానికి చెందిన కొండయ్యగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఇద్దరిని ఒంగోలు రిమ్స్కు తరలించారు.
జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి నవంబర్ 25 వరకు ఈ రైలు జిల్లా గుండా తిరుపతికి చేరుకోనుంది. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి రాత్రి 9.10 గంటలకు బయలుదేరి జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు స్టేషన్ల మీదుగా నంద్యాలకు చేరుతుంది. అక్కడి నుంచి తిరుపతికి వెళుతుందని అధికారులు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో 5 ఓపెన్ కేటగిరి బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 బార్లు, మార్కాపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 బార్లకు రీ- నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ బార్లకై వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం 6లోగా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరిస్తామని, 2న లాటరీ తీస్తామన్నారు.
జడ్జిలను దూషించిన ఓ వ్యక్తికి రిమాండ్ పడింది. గిద్దలూరు జడ్జికి ఆగస్ట్ 28వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ రిజిస్ట్రర్ పోస్ట్ వచ్చింది. అది తెరిచి చూడగా అసభ్యపదజాలంతో మేటర్ ఉంది. జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు కోర్టులోనే అటెండర్గా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఈ లెటర్ రాసినట్లు గుర్తించారు. అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ ఉత్తర్వులు ఇచ్చారు.
తర్లుపాడు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు పరిశీలించి, స్టేషన్ రికార్డులు, నేరాల చరిత్ర, కేసుల పురోగతి, పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో SI బ్రహ్మ నాయుడు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం ఒంగోలుకు రానున్నట్లు ఎంపీ మాగుంట కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలులోని తన కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే ఒంగోలులో జరిగే కార్యక్రమాలలో ఎంపీ మాగుంట రేపు పాల్గొంటారన్నారు. అంతేకాకుండా ఒకటో తేదీ సోమవారం కూడా ఎంపీ మాగుంట తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఓపెన్ కేటగిరీకి సంబంధించి 26 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, 78 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని కార్యాలయంలో మాట్లాడారు. 26 బార్లకు గాను 17 బార్లకు దరఖాస్తులు అందాయన్నారు. గీత కులాలకు కేటాయించిన 3 బార్లకు 14 వచ్చాయని తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ వద్ద కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందన్నారు.
చీమకుర్తిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి క్వారీలోని ఓ అంచు విరిగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే రాళ్లు విరిగిపడిన సమయంలో 50 మంది కూలీలు భోజనానికి వెళ్లినట్లు తెలిసింది. దీనితో పెను ప్రమాదం తప్పింది. కాగా క్వారీలో ఉన్న మెషిన్ పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది.
గిద్దలూరు పట్టణంలో శుక్రవారం MLA అశోక్ రెడ్డిను జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకులు వరలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు రైతు బజారు ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణకు వివరాలు తెలుసుకున్నారు. రైతుల కోసం కూటమి ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
Sorry, no posts matched your criteria.