India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శనివారం నుంచి వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా.. శనివారం ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఒంగోలు నగరంలోని 49వ డివిజన్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ఆదిలక్ష్మి, ఆర్డీవో కె. లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తన పిన్ని కూతురు బర్త్ డే పార్టీ ఇస్తున్నట్లుగా నమ్మించి ఆరిఫ్ బాలికను తన గదికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆ యువకుడు పరారయ్యాడు. ఒంగోలులో ఓ బాలిక తన స్నేహితుడి ద్వారా పరిచయమైంది. బాలికపై కన్నేసిన యువకుడు ఇన్స్టాగ్రామ్లో రోజూ చాట్ చేస్తూ పరిచయాన్ని పెంచుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లాలో మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సైమన్ విక్టరీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 5 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
ప్రకాశం జిల్లాలో మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సైమన్ విక్టరీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 5 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
ప్రకాశం జిల్లాలో మార్చి 3వ తేదీ నుంచి ఓపెన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో నేరుగా డౌన్లోడ్ చేసుకుని వెళ్లినా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మార్చి ఒకటో తేదీ నుంచి భారీ ఫైన్లు తప్పవని ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు హెచ్చరించారు. ఫైన్ వివరాలను ఆయన వెల్లడించారు.
➤ హెల్మెట్(బైకుపై ఇద్దరికీ), ఇన్సూరెన్స్ లేకుంటే: రూ.1000
➤ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే: రూ.10వేలు
➤ బైక్ రేసింగ్(ఓవర్ స్పీడ్): రూ.5 వేలు
➤ మైనర్ డ్రైవింగ్: రూ.1000
➤ డేంజరస్ పార్కింగ్: రూ.1500-రూ.3వేలు
➤ శబ్ద కాలుష్యం చేస్తే: రూ.2వేలు-రూ.4వేలు
ప్రకాశం జిల్లాలో మార్చికి సంబంధించి పింఛన్ నగదు 123.63 కోట్లు విడుదలైనట్లు డీఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీ చిరంజీవి తెలిపారు. ఒకటో తేదీన 100% పింఛన్ పంపిణీ చేయాలని.. ఎవరైనా మిగిలిపోతే 3వ తేదీన పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. నగదు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పామూరు మండలంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో నగదు జమచేసేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని దగ్గర ఓ రూ.200 నోటు దొంగ నోటని బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ఆ నోటుపై నకిలీ అని రాసి.. దానిని ఖాతాదారుడి చేత చించి వేయించారు. దొంగనోట్ల చెలామణికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారట. అవేమీ కుదరకపోవడంతో ఇప్పుడు జనసేన గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంట. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా శిద్ధాను జనసేనలోకి ఆహ్వానించారంట.
Sorry, no posts matched your criteria.