Prakasam

News August 18, 2024

ఒంగోలులో త్వరలో ఎయిర్పోర్ట్

image

రాష్ట్రంలో 7 ఎయిర్పోర్టులు ఉండగా, కొత్తగా మరో ఏడింటిని నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో టెర్మినల్ కెపాసిటీలు పెంచుతున్నామన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషి చేస్తాం’ అని తెలిపారు. దీంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 18, 2024

పర్చూరులో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం.. కేసు

image

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదుచేసినట్లు పర్చూరు ఇన్‌ఛార్జి SI రత్నకుమారి తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన 30ఏళ్ల యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఎదురింట్లో పాప ఉండటాన్ని గుర్తించిన తల్లి పాపను విచారించగా, జరిగిన విషయాన్ని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News August 18, 2024

ప్రకాశం: నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గీత కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 29 మండలాల నుంచి ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి (2024-25) సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.

News August 18, 2024

అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయండి: కలెక్టర్

image

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా ఉండాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో భాగంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏడాదికి 15 శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్ర-2047 అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు.

News August 18, 2024

కంభం: చంద్రబాబుపై అనుచిత పోస్ట్ పెట్టిన మహిళ అరెస్ట్

image

కంభం పట్టణంలో సీఎం చంద్రబాబును అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో అనుచిత పోస్టు పెట్టిన ఓ మహిళను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోస్టు పెట్టిన వారిని గుర్తించారు. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ పోస్ట్ పెట్టినట్లుగా గుర్తించి ముందుగా నోటీసు ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News August 17, 2024

ప్రభాస్ కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన మంత్రి గొట్టిపాటి

image

దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో హీరో ప్రభాస్ సినిమా నేడు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. అనంతరం సినిమాకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా చిత్ర బృందానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు.

News August 17, 2024

ప్రకాశం: డాక్టర్ లైంగిక వేధింపులు.. ANMల ఫిర్యాదు

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు నాగర్జున గౌడ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 15 మంది ANMలు TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాలతో బాధితులను, డా.నాగర్జున గౌడ్‌ను DMHO సురేశ్ శుక్రవారం విచారించారు. గతంలోనూ పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడని తెలిపారు. వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పారు.

News August 17, 2024

కంభంలో ఉరేసుకొని మహిళ మృతి

image

కంభం పట్టణంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. నేపాల్‌కు చెందిన డింగిరి కమల అనే (24) మహిళ తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే మహిళ మృతికి గల కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News August 17, 2024

ప్రకాశం: నేడు 93 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు

image

జిల్లాలోని 80 పాఠశాలల్లో శనివారం యాజమాన్య కమిటీల ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 8న జిల్లాలో 2,465 పాఠశాలలకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించగా కోరం లేకపోవడం, కోర్టు ఉత్తర్వులు, ఇతర కారణాలతో 93 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. ఆయా పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు మళ్లీ రీ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో నేడు ఆయా పాఠశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

News August 17, 2024

ప్రకాశం: జిల్లాలో 24 గంటలు వైద్య సేవలు బంద్

image

కొల్‌కతాలోని జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లాలో శనివారం ఉదయం 6.గంటల నుంచి ఆదివారం ఉదయం 6.గంటల వరకు వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ శ్రావణి తెలిపారు. స్థానిక ఐఎంఏ హాలులో అత్యవసర సమావేశం శుక్రవారం నిర్వహించి ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం కేసులు మీనహా సర్వీసులు నిలిపివేస్తున్నామన్నారు.