India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో పెన్షన్లపై కలెక్టర్ తమీమ్ అన్సారియా కీలక ప్రకటన చేశారు. జిల్లాలో 4,654 మందిని పెన్షన్లకు అనర్హులుగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించిందన్నారు. వీరిలో అర్హతను బట్టి 1,062 మంది పెన్షన్లను వికలాంగ, వృద్ధాప్య పెన్షన్లుగా మార్పు చేశామని చెప్పారు. మిగిలిన 3,592 పెన్షన్లలో 791 మందికి మినహాయింపు ఉందని, 2,801 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అప్పీల్ చేసుకున్నవారికి 1న పింఛన్ అందుతుందని తెలిపారు.
ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి .వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, స్కాన్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం తొమ్మిది టీములు వైద్యశాలలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
సంతనూతలపాడు మండలం రుద్రవరంలో శుక్రవారం రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుహాసిని ఆధ్వర్యంలో పలువురు ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు పర్యటించారు. ఈ సందర్భంగా రుద్రవరం గ్రామంలో రైతు మీనమ్మ సాగు చేసిన నిమ్మ తోటను వారు సందర్శించారు. పంటలను పరిశీలించి, స్థానికంగా వ్యవసాయంపై రైతులు చూపుతున్న ఆసక్తిని వారు అభినందించారు.
మాతృభాష తెలుగు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టరుతో పాటు డీఆర్ఓ చిన ఓబులేసు, ఇతర అధికారులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గిడుగు సేవలను వారు కొనియాడారు.
ప్రకాశం జిల్లాలో మెగా డీఎస్సీలో PHC కేటగిరీ కింద ఎంపికైన అభ్యర్థులకు ఒంగోలు చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న సరస్వతి జూనియర్ కళాశాలలో దరఖాస్తుల పరిశీలన నిర్వహిస్తామని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు తమ దివ్యాంగత్వం ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలు జీజీహెచ్, విశాఖపట్నం ENT వైద్యశాలకు శుక్రవారం వెళ్లాలని కోరారు.
ప్రకాశం జిల్లాలో మెగా డీఎస్సీలో PHC కేటగిరి కింద ఎంపికైన అభ్యర్థులకు ఒంగోలు చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న సరస్వతి జూనియర్ కళాశాలలో దరఖాస్తుల పరిశీలన నిర్వహిస్తామని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు తమ దివ్యాంగత్వం ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలు జీజీహెచ్, పీహెచ్సీహెచ్1 పత్రాలు కలిగిన విశాఖపట్నం ENT వైద్యశాలకు శుక్రవారం వెళ్లాలని కోరారు.
దొనకొండ మండలం బాధాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2,149 ఎకరాల భూములను ఇప్పటికే గుర్తించినట్లు జేసీ గోపాలకృష్ణ వెల్లడించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సాగుకు అవసరమైన స్థాయిలో యూరియా అందుబాటులో ఉన్న విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఒంగోలు రూరల్ పరిధిలోని శ్రీసరస్వతి జూనియర్ కళాశాలను జేసీ గోపాలకృష్ణ సందర్శించారు. డీఎస్సీ-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పటిష్ఠంగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట డీఈవో కిరణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఈనెల 29న నిర్వహించే విజార్డ్ ఆఫ్ ద హాకీ ఈవెంట్కు క్రీడా ప్రతిభ అవార్డులను అందించేందుకై 5 పాఠశాలలను ఎంపిక చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం డీఈవో విడుదల చేసిన ప్రకటన మేరకు.. గొట్ల గట్టు జడ్పీహెచ్ఎస్ మొదటి స్థానంలో, గురవాజిపేట జడ్పీహెచ్ఎస్ 2వ స్థానం, పాకల జడ్పీహెచ్ఎస్ 3వ స్థానం, చిర్రీకూరపాడు జడ్పీహెచ్ఎస్ 4వ స్థానం, ఈతముక్కల జడ్పీహెచ్ఎస్ 5వ స్థానంలో నిలిచాయి.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.