India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కనిగిరి మున్సిపాలిటీలో సానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చెన్నకేశవులు పై పామూరు బస్ స్టాండ్ సెంటర్లో వాచ్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న చిరు వ్యాపారి మంగళవారం దాడి చేశారు. గాయాలతో హాస్పిటల్లో చేరిన సానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులును మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ పరామర్శించారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
దోర్నాల మండలం హసనాబాద్కి చెందిన శివన్నారాయణ యూరప్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని సహచరుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘రూ. 2 లక్షలు పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేశారని, తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ వారి ఆదేశాల మేరకు, బాల కార్మిక వ్యవస్థ నుంచి పిల్లలకు స్వేచ్చ కార్యక్రమమునకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సు కమిటీ చైర్మన్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. కార్యక్రమములో జిల్లా ఉప కార్మిక కమీషనరు ఏ గాయత్రి దేవి, సార్డ్స్ ఎన్జీవో జనరల్ సెక్రెటరీ R సునీల్ కుమార్, టాస్క్ ఫోర్సు సభ్యులు పాల్గొనారు.
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ల వద్ద అవసరం మేరకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరి అధికారులపై ఉందన్నారు.
విద్యుత్ బిల్లు గతం వలే ఫోన్ పే ద్వారా కూడా చెల్లించవచ్చని ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజినీర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం వారి కార్యాలయంలో మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో APCPDCL ముందుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు.
ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సెబ్ అధికారులతో ఎస్పీ దామోదర్ పెండింగ్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. .. జిల్లాలో నాటుసారా తయారీ, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా కాచే పాత నేరస్థులపై నిఘా కొనసాగించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలుకు ప్రతిపాదనలు అధికారులు పంపాలన్నారు.
ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సెబ్ అధికారులతో ఎస్పీ దామోదర్ పెండింగ్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. .. జిల్లాలో నాటుసారా తయారీ, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా కాచే పాత నేరస్తులపై నిఘా కొనసాగించాలని, అవసరమైతే పిడి యాక్ట్ అమలుకు ప్రతిపాదనలు అధికారులు పంపాలన్నారు.
పెద్దదోర్నాలలోని హసనాబాద్ గ్రామానికి చెందిన ఒంటేరు శివన్నారాయణ యూరప్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. యూరప్లో ఈనెల 8న స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లి రూమ్కి వచ్చి వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపాడు. స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ.. ఈనెల 10న శివన్నారాయణ మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దదోర్నాలలోని హసనాబాద్ గ్రామానికి చెందిన ఒంటేరు శివన్నారాయణ యూరప్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. యూరప్లో ఈనెల 8న స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లి రూమ్కి వచ్చి వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపాడు. స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ.. ఈనెల 10న శివన్నారాయణ మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంతమాగులూరు మండలం ఏల్చూరులో జన్మించిన <<13839752>>ఆడ శిశువును<<>> సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆ చిన్నారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం క్షేమంగా ఉందని 108 ఈఎంటీ హరిబాబు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.