Prakasam

News February 25, 2025

YS జగన్‌పై మంత్రి స్వామి హాట్ కామెంట్స్

image

30 ఏళ్లు అధికారం నాదేనంటూ విర్రవీగిన జగన్‌ని ప్రజలు ఐదేళ్లకే భరించలేక ఛీత్కరించినా.. మళ్ళీ మరో 30 ఏళ్లు అధికారం తమదేనని జగన్ కార్యకర్తలను మభ్యపెడుతున్నాడని మంత్రి స్వామి అన్నారు. సోమవారం అసెంబ్లీలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోయాడని ఎద్దేవా చేశారు. జగన్‌కి పదవులు మీద ఉన్న ఆరాటం ప్రజాసమస్యలపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే తనపదవి రద్దవుతుందని వచ్చారన్నారు.

News February 24, 2025

గవర్నర్‌కు ఎర్రగొండపాలెం MLA కౌంటర్

image

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు పేరును తప్పుగా ఉచ్చరించారు. దీనిపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ‘నరేంద్ర పవన్ చంద్రబాబు నాయుడు అని చదివితే బాగుండేది. కూటమి ధర్మం కూడా నిలబడేది’ అంటూ Xలో పోస్ట్ చేశారు.

News February 24, 2025

గవర్నర్‌కు ఎర్రగొండపాలెం MLA కౌంటర్

image

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు పేరును తప్పుగా ఉచ్ఛరించారు. దీనిపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ‘నరేంద్ర పవన్ చంద్రబాబు నాయుడు అని చదివితే బాగుండేది. కూటమి ధర్మం కూడా నిలబడేది’ అంటూ Xలో పోస్ట్ చేశారు.

News February 23, 2025

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

➤ప్రకాశం: గ్రూప్-2 మెయిన్స్‌కు 3965 మంది<<15556959>> హాజరు<<>>
➤ కంభం వద్ద రోడ్డు <<15557637>>ప్రమాదం.!<<>>
➤సంతనూతలపాడులో 25న మెగా <<15556030>>జాబ్ మేళా.!<<>>
➤పవన్ కళ్యాణ్‌పై MLA తాటిపర్తి సెటైరికల్ <<15555651>>ట్వీట్<<>>
➤ఫేక్ వార్తలపై <<15555300>>ఉక్కుపాదం<<>>: ప్రకాశం కలెక్టర్
➤దర్శిలో చికెన్‌పై ఆఫర్‌.. కిలో రూ.99
➤కనిగిరిలో ముగ్గురి అరెస్ట్

News February 23, 2025

ప్రకాశం: గ్రూప్- 2 మెయిన్స్‌కు 579 మంది గైర్హాజరు.!

image

ప్రకాశం జిల్లాలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టరేట్ ప్రకటించింది. పేపర్- 1కు మొత్తం 4544 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 3968 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 576 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అలాగే పేపర్- 2 పరీక్షకు 4544 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 3965 మంది హాజరయ్యారు. 579 మంది గైర్హాజరయ్యారు.

News February 23, 2025

పవన్ కళ్యాణ్‌పై ప్రకాశం జిల్లా MLA సెటైరికల్ ట్వీట్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.”సనాతనం నిన్ను కాపాడదు సైన్స్ మాత్రమే కాపాడుతుందన్నారు.’’ ఆధునిక వైద్యమే కాపాడుతుందని చెప్పకపోయినా సరే, అది నిన్ను కాపాడుతుందన్నారు. అదే అభ్యుదయపు గొప్పదనమని తెలిపారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు MLA తాటిపర్తి Xలో రాసుకొచ్చారు.

News February 23, 2025

కొండపి: సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

image

మానవ సంబంధాలను మంట గలిపే దారుణ ఘటన కొండపి మండలంలో వెలుగు చూసింది. విజయవాడలోని తల్లి వద్ద ఉంటున్న పెద్ద చెల్లిని, అన్న గతేడాది క్రిస్మస్‌కు పెట్లూరుకు తీసుకొచ్చాడు. పండగ అనంతరం చెల్లిని విజయవాడలో వదిలిపెట్టకుండా తన వెంట హైదరాబాద్ తీసుకువెళ్లాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో తల్లి వద్దకు చేరుకున్న కుమార్తెకు వైద్య పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది. విషయం తల్లికి చెప్పడంతో కేసు పెట్టింది.

News February 23, 2025

ప్రకాశం: ‘ఫేక్ డాక్యుమెంట్స్ సేకరించాలి’

image

ఒంగోలు, పరిసర ప్రాంతాలలో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో రెండేళ్ళ క్రితం వెలుగుచూసిన భూ అక్రమాలపై.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోడియా అరా తీశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో ప్రకాశం భవనంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించారో ఆధారాలను సేకరించాలని ఆదేశించారు.

News February 22, 2025

ప్రకాశం: ‘సెలవుల్లో కూడా బిల్లులు కట్టవచ్చు’

image

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకొనే కేంద్రాలు 23వ తేదీ ఆదివారం పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజు అయినా ఆదివారం కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెల ఆఖరు అయినా బిల్లులు చెల్లించలేదని విచారం వ్యక్తం చేశారు.

News February 22, 2025

సెలవు రోజు కూడా బిల్లులు కట్టవచ్చు: ఎస్ఈ

image

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకొనే కేంద్రాలు 23వ తేదీ ఆదివారం పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజు అయినా ఆదివారం కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెల ఆఖరు అయినా బిల్లులు చెల్లించలేదని విచారం వ్యక్తం చేశారు.